చేనేత ఉత్పత్తులను ప్రోత్సహిస్తాం
చేనేత ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని చేతి మగ్గాలు, జౌళి, చక్కెర అభివృద్ధి శాఖ మంత్రి శంకర పాటిల మునేనకుప్ప పిలుపునిచ్చారు. చేనేతను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను జారీ చేస్తున్నాయని గుర్తు చేశారు.
చరఖా వద్ద దివ్యజ్ఞాన నందగిరి స్వామి, ప్రభులింగ స్వామి, చేనేత సమాఖ్య అధ్యక్షుడు సోమశేఖర్, తదితరులు
బెంగళూరు (సదాశివనగర), న్యూస్టుడే: చేనేత ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని చేతి మగ్గాలు, జౌళి, చక్కెర అభివృద్ధి శాఖ మంత్రి శంకర పాటిల మునేనకుప్ప పిలుపునిచ్చారు. చేనేతను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను జారీ చేస్తున్నాయని గుర్తు చేశారు. ఎనిమిదో జాతీయ చేతిమగ్గాల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్రకళా పరిషత్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ చేనేతలకు పురస్కారాలు ప్రదానం చేసి మాట్లాడారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే దిశలో 2017 ఆగస్టు 7ను జాతీయ చేతిమగ్గాల దినోత్సవంగా కేంద్రం ప్రకటించిందన్నారు. పట్టు చీరపై తమ పంటతో రైతుల చిత్రాన్ని నేసిన మొళకాల్మూరుకు చెందిన చేనేత డి.ఎస్.మల్లికార్జునకు మొదటి బహుమతి, పట్టు వస్త్రంపై పునీత్ రాజ్కుమార్ చిత్రాన్ని నేసిన కొళ్లేగాలకు చెందిన పి.శ్రీనివాస్, ఇతర వస్త్ర విభాగాల్లో కాటన్ చీరపై భారతదేశ పటాన్ని నేసిన చిక్కోడికి చెందిన సచీన బాహుసాబ తెరదాళ, కొండి సాంకేతికతతో ఇళకల్ మాదిరి చీర నేసిన బీళగికి చెందిన పడియప్ప గోకావి, ఉన్నితో బావుటా చేసిన చిక్కోడికి చెందిన శంకర సణ్ణక్కికి ఆయన పురస్కారాలు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో చేతి మగ్గాల అభివృద్ధి మండలి అధ్యక్షుడు సిద్ధు సవది, కర్ణాటక జౌళి మౌలిక సదుపాయాల అభివృద్ధి మండలి అధ్యక్షుడు గుత్తిగనూరు విరూపాక్ష, వివిధ మఠాల ప్రతినిధులు, చేనేత సమాఖ్య అధ్యక్షుడు సోమశేఖర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హత్యకు.. కొడుకే కిరాయి ఇచ్చాడట
[ 23-04-2024]
జిల్లా కేంద్రం గదగ దాసరవీధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసును గదగ పోలీసులు ఛేదించారు. -
రైతన్నకు కరవు సాయం
[ 23-04-2024]
తీవ్ర కరవు బారినపడిన తమ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వివక్షతో నిధుల విడుదలను జాప్యం చేస్తోందంటూ సుప్రీంకోర్టులో కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్ సోమవారం కీలక మలుపు తిరిగింది. -
హామీలు విస్మరించిన భాజపా
[ 23-04-2024]
పేదలు, మధ్యతరగతి కుటుంబాల భవిష్యత్తుకు ఈ లోక్సభ ఎన్నికలు నిర్ణయాత్మకమైనవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. -
హత్యోన్మాదంపై నిరసన వెల్లువ
[ 23-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడ విద్యార్థిని నేహా హీరేమఠ్ హత్యను ఖండిస్తూ వివిధ సంఘాలు ఇచ్చిన పిలుపునకు ధార్వాడలోని వర్తక, వాణిజ్య సంస్థల ప్రతినిధులు స్పందించారు -
బడుగుల ఓట్లే నిర్ణయాత్మకం
[ 23-04-2024]
ప్రముఖ హృద్రోగ చికిత్స నిపుణుడు డాక్టర్ సీఎన్ మంజునాథ్ రాజకీయ అరంగేట్రం.. ఆయనకు పెను సవాళ్లను విసురుతోంది. -
ఆకట్టుకునేలా అవగాహన
[ 23-04-2024]
ఎన్నికల్లో యువత తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొనాలంటూ అధికారులు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు -
అభ్యర్థికి కాదు.. అమాత్యులకే అగ్నిపరీక్ష
[ 23-04-2024]
బళ్లారి లోక్సభ బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఇ.తుకారాంను గెలిపించుకునే బాధ్యత బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్య మంత్రులు బి.నాగేంద్ర, బి.జడ్.జమీర్ అహ్మద్ ఖాన్ భుజస్కందాలపై ఉండటంతో ఈ ఎన్నికలు అభ్యర్థికన్నా అమాత్యులకే అగ్నిపరీక్షగా మారాయి -
గ్యారంటీలతో ప్రజలకు ఊతం
[ 23-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ఆచార్య రాజీవ్గౌడకు మద్దతుగా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం దాసరహళ్లిలో రోడ్షో నిర్వహించి, ఓట్లు అభ్యర్థించారు. -
‘ఉచిత’ హారం..అపూర్వ సత్కారం
[ 23-04-2024]
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఒక విద్యార్థిని సోమవారం రాత్రి ప్రత్యేకంగా సత్కరించింది. అరసికెరెలో మొదటి ఏడాది న్యాయశాస్త్రాన్ని చదువుతున్న జయశ్రీ ‘ఉచిత బస్సు టికెట్ల’తో చేసిన హారంతో ఆయనను సన్మానించింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?