కొడగు.. కన్నీటి మడుగు
ఆగకుండా కురుస్తున్న వర్షాలతో కొడగు జిల్లా కన్నీరుమున్నీరవుతోంది. జీవనది కావేరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలు బిక్కుబిక్కు మంటూ, నిద్రాహారాలకు దూరమై కాలం వెళ్లదీస్తున్నారు.
మడికేరి సమీపంలో వర్షపీడిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్
మైసూరు, న్యూస్టుడే : ఆగకుండా కురుస్తున్న వర్షాలతో కొడగు జిల్లా కన్నీరుమున్నీరవుతోంది. జీవనది కావేరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలు బిక్కుబిక్కు మంటూ, నిద్రాహారాలకు దూరమై కాలం వెళ్లదీస్తున్నారు. మడికేరి తాలూకాలోని వివిధ గ్రామాల్లోని రహదారులు జలావృతమయ్యాయి. ప్రవాహ తీవ్రత మరికొంత పెరిగితే నాపోక్లు పట్టణంలోకి వెళ్లే అన్ని మార్గాలూ మూసుకు పోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. నాపోక్లు నుంచి మార్నాడుకు వెళ్లే రహదారిపై బోళిబాణె వద్ద ఐదు అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. కొట్టముడి కూడలి వద్ద కాఫీ తోటల్లోకి కావేరి నీరు ప్రవేశించింది. కొన్నిచోట్ల నాలుగు అడుగుల ఎత్తులో నీరు నిలిచి కాఫీ వేర్లు కుళ్లిపోతాయని ప్లాంటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. చెరియపరంబు- కల్లుమొట్టెకు వెళ్లే మార్గంలోనూ వాహన సంచారాన్ని నిలిపి వేశారు. ఈ ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లోనూ రహదారులపై ఆరు అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. మడికేరిలో జనరల్ తిమ్మయ్య మైదానంలో నీటి మడుగు ఏర్పడింది. నాల్కునాడు పరిధిలోని కక్కబ్బె గ్రామంలో ఫైనరీ దర్గాకు వెళ్లే రహదారులు, ఎమ్మెమాడు-కూరుళి గ్రామానికి వెళ్లే మార్గం, కైకాడు, పారాణె, ఎత్తుకడు, ఎడపాల కడంగ, సిద్ధపుర సమీపంలోని గుహ్య, కరిడిగోడు, విరాజపేట సమీపంలోని అరపట్టు గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఈ ప్రాంతాల్లో కావేరి నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. నాలుగేళ్ల నుంచి కొడగు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు విసుగెత్తి పోయారు. కొండచరియలు విరిగిపడడం, రహదారులపై కోత, ఇళ్లపై మట్టి పెళ్లలు జారిపడడం, ఇళ్లు కూలిపోవడంతో ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు. ప్రభుత్వం తాను ఇచ్చిన హామీని ఇప్పటికీ నిలబెట్టుకోలేదని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు కొండల్ని తవ్వి రిసార్టుల నిర్మాణం, హోం స్టేల ఏర్పాటుతోనే ఈ పరిస్థితి నెలకొందని ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకొంటోంది. దానికి బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కాఫీ తోటలు పాడవుతున్నా పరిహారం అందడం లేదని తోటల యజమానులు ఆరోపించారు. కొడగులో 2018లో సంభవించిన జల ప్రళయానికి ఇళ్లు కోల్పోయిన వారికి ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదు. రెండు వేల మంది నిర్వాసితులు కాగా, వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో కేవలం 800 ఇళ్లను మాత్రమే నిర్మించి ఇచ్చారు. విద్యుత్తును పునరుద్ధరించడం, వంతెనలు, రహదారుల నిర్మాణాలకు జిల్లా పాలన యంత్రాంగం, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక లోక్సభ సభ్యుడు స్పందించడం లేదని సామాజిక మాధ్యమాల్లో జిల్లా ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు. ఖజానాలో నగదుకు కొరత లేదని ప్రకటిస్తున్న ప్రభుత్వం కొడగు జిల్లాపై సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని స్థానికులు ఆరోపించారు. మడికేరి సమీపంలోని బలెకండి అనే చోట 30 ఇళ్లకు చేరుకునేందుకు నిర్మించిన రహదారిపై కొండ చరియలు పడ్డాయి. వాటిని తొలగించేందుకు వచ్చిన జేసీబీపై మన్ను పడడంతో దాని డ్రైవరు రవి, మరో ఇద్దరు స్థానికులు త్రుటిలో పక్కకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. జేసీబీ పక్కనే ఉన్న లోయలోకి పడిపోయింది.
ముర్నాడు- విరాజ్పేట మధ్య వంతెన పైభాగాన్ని తాకూతూ ప్రవహిస్తున్న కావేరి నది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్