వానలతో ఎడతెగని బాధలు
భారీ వర్షాలకు బాగలకోట జిల్లాలోని పలు తాలాకాల్లో పంటలు నీట మునిగాయి. దిగంబేశ్వర మఠం వద్ద బసవరాజ జంబగి అనే వ్యక్తికి చెందిన పొలంలోని పొద్దుతిరుగుడు పంట పూర్తిగా నీట మునిగింది.
బెళగావి భరతనగరలో కూలిన ఓ ఇంటిని పరిశీలిస్తున్న జిల్లా అధికారి నితీశ్పాటిల్
బెళగావి, బాగలకోట, న్యూస్టుడే : భారీ వర్షాలకు బాగలకోట జిల్లాలోని పలు తాలాకాల్లో పంటలు నీట మునిగాయి. దిగంబేశ్వర మఠం వద్ద బసవరాజ జంబగి అనే వ్యక్తికి చెందిన పొలంలోని పొద్దుతిరుగుడు పంట పూర్తిగా నీట మునిగింది. బెళగావి నగరం, బెళగావి తాలూకా, ఖానాపూర తాలూకాల్లోని అన్ని విద్యాసంస్థలకు జిల్లాధికారి నితేశ్ పాటిల్ సోమవారం సెలవు ప్రకటించారు. బళ్లారి నాలా నీటితో నిండుగా ప్రవహిస్తోంది. దీనితో యళ్లూరు, దామణె, వడగాంవి, ఆనగోళ, జునే బెళగావి ప్రాంతాల్లో కాలువ పక్క ఉన్న పొలాలు దెబ్బతిన్నాయి. ముంగారులో తాము రెండోసారి వేసుకున్న పంట కూడా వర్షార్పణమైనట్లు రైతులు ఆక్రోశించారు. బెళగావి నగరం వడగావి భారతనగర రెండో అడ్డరోడ్డులో ఆనంద కల్లప్ప బిర్జె అనే వ్యక్తికి చెందిన ఇల్లు సోమవారం ఉదయం కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇల్లు శిథిలావస్థకు చేరడంతో ఆదివారం సాయంత్రమే ఈ ఇంటి నుంచి ఏడుగురు ఖాళీ చేసి వేరే చోటుకు వెళ్లారు. పొరుగింటిపైకి గోడ కూలడంతో శాంత అనే గృహిణి స్వల్పంగా గాయపడింది. నాలుగు వాహనాలు పూర్తిగా ధ్వసమయ్యాయి. బెళగావిలోని ఓం నగర, హిండలగ, శివాజీనగర, వీరభద్ర, కేశవనగరల్లోని రహదారులపై నీరు నిలిచింది. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రాలేని స్థితి నెలకొంది. కేశవనగరలోని 20కు పైగా ఇళ్లలోకి వర్షం నీరు వచ్చింది. శ్రీనగర గార్డెన్లోని బాలల ఆసుపత్రిలో అర అడుగు మేర నీరు చేరుకుంది. పాలికె కమిషనర్ రుద్రేశ్ గాలి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కొందరు బాధితులకు నిత్యావసరాలను అందజేశారు.
మండ్య జిల్లాలో క్యాన్సర్తో మరణించిన ఓ మహిళ మృతదేహాన్ని వాననీటిలోనే తరలిస్తున్న బంధువులు
ఇతర జిల్లాల్లో...
చిక్కమగళూరు జిల్లాలో వరుసగా కురుస్తున్న వర్షాలకు వరి పొలాలు నీటిలో మునిగిపోయాయి. కళస తాలూకా నెల్లిబీడు గ్రామంలో మనోజ్ అనే రైతు పొలంలో పది అడుగుల వైశాల్యంలో 60 అడుగుల లోతుకు భూమి కుంగిపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. తుంగ, భద్ర, హేమావతి నదుల్లో నీటి ప్రవాహ స్థాయి పెరిగింది. వక్క, మిరియాలు, కాఫీ తోటలకు తెగుళ్ల భీతి మొదలైంది. తోటల్లో పనులన్నీ నిలిచిపోయాయి. తిరుగుణ గ్రామంలో రెండు నెలల కిందట వేసిన తారు రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. కొన్ని చోట్ల పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయింది. ఈ పనులు చేసిన గుత్తేదారు పరారీలో ఉన్నాడని అధికారులు గుర్తించారు. దక్షిణ కన్నడ జిల్లా సుళ్య సమీపంలో కేరళ సరిహద్దు వోకార్డి సమీపంలోని సుంకదకట్టలో భారీ భవంతి ఒకటి కూలిపోయింది. గోడలు బీటలు వారడం, పునాదుల్లోకి నీరు చేరడంతో రెండు రోజుల క్రితమే దీనిలో ఉంటున్న ప్రజలు, దుకాణదారులు, భాజపా కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. పదేళ్ల క్రితం నిర్మించిన ఈ మూడంతస్తుల భవంతిలోకి నిరంతరం నీరు చేరడంతోనే ఈ పరిస్థితి నెలకొందని దాని యజమాని సురేంద్ర పూజారి ఆక్రోశించారు. కలబురగి సమీపంలో వర్షాలకు వాగులు, వంకలు ఏకమయ్యాయి. అఫ్జలపుర తాలూకా హావనూరు గ్రామాన్ని అనుసంధానం చేసే వంతెన కొట్టుకుపోయింది. యాదగిరి జిల్లాలోనూ లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. విద్యుత్తు లేకపోవడం, విష పురుగులు ఎక్కువ కావడంతో పలు ప్రాంతాల్లో గ్రామస్థులు ఇబ్బందికి గురయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?