ప్రభుత్వ ఆదేశాలపై విమర్శలు
వారం కిందట విజయనగర, కొప్పళ జిల్లాల బాధ్య మంత్రులను మారుస్తూ చేసిన ఆదేశాలను 24 గంటలు తిరగకముందే రద్దు చేసి ఇరకాటంలో పడిన భాజపా ప్రభుత్వం తాజాగా అలాంటి మరో విచిత్ర ఆదేశాలతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది.
మంత్రి ఆనంద్సింగ్ మంత్రి శశికళా జొల్లె
హొసపేటె, న్యూస్టుడే: వారం కిందట విజయనగర, కొప్పళ జిల్లాల బాధ్య మంత్రులను మారుస్తూ చేసిన ఆదేశాలను 24 గంటలు తిరగకముందే రద్దు చేసి ఇరకాటంలో పడిన భాజపా ప్రభుత్వం తాజాగా అలాంటి మరో విచిత్ర ఆదేశాలతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. విజయనగర జిల్లా బాధ్యమంత్రి శశికళా జొల్లె కొప్పళలో, కొప్పళ జిల్లా బాధ్యమంత్రి ఆనంద్సింగ్ విజయనగరలో పంద్రాగస్టున జెండా ఎగుర వేయాలన్న కొత్త ఆదేశాలు సోమవారం వెలువడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సంబంధించిన జిల్లాల బాధ్య మంత్రులే పంద్రాగస్టున బహిరంగ కార్యక్రమంలో జెండా ఎగుర వేయాలి. ఒకవేళ ఆ జిల్లాకు బాధ్య మంత్రిలేకపోతే సంబంధించిన జిల్లా పాలనాధికారి జెండా ఎగుర వేయాలి. కానీ ఇక్కడ ఇద్దరు జిల్లా మంత్రులకు జెండా ఎగురు వేసే బాధ్యతను మాత్రమే మార్చడం తీవ్ర చర్చలకు తావిచ్చింది. గత నెల 30న మంత్రి ఆనంద్సింగ్ను విజయనగరకు, శశికళా జొల్లెను కొప్పళ బాధ్యులుగా మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. తెరవెనక ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో కానీ.. 24 గంటల్లోగా ఆ ఆదేశాలు రద్దయ్యాయి. ఇప్పుడు జెండా ఎగురు వేసేందుకు జిల్లా మంత్రులను మార్చడం విడ్డూరంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. హొసపేటె తాలూకా క్రీడామైదానంలో పర్యాటక శాఖ రూ.6కోట్ల ఖర్చుతో దేశంలోనే ఎత్తైన 405 అడుగుల ధ్వజ స్తంభాన్ని నిర్మిస్తోంది. పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆ స్తంభానికి పంద్రాగస్టును జెండా ఎగుర వేయాలని మంత్రి ఆనంద్సింగ్ ముఖ్యమంత్రిపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి కొప్పళ జిల్లా బాధ్య మంత్రిగా ఉన్నప్పటికీ విజయనగర జిల్లాలో జెండా ఎగురు వేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ మార్పుపై మంత్రి శశికళా జొల్లె.. సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. జెండా ఎగుర వేసేందుకు మంత్రులను మార్చిన అంశంపై మంత్రి శశికళా జొల్లె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆమెను ఒక్కమాట కూడా అడగకుండా మార్చారని సన్నిహితులు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హత్యకు.. కొడుకే కిరాయి ఇచ్చాడట
[ 23-04-2024]
జిల్లా కేంద్రం గదగ దాసరవీధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసును గదగ పోలీసులు ఛేదించారు. -
రైతన్నకు కరవు సాయం
[ 23-04-2024]
తీవ్ర కరవు బారినపడిన తమ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వివక్షతో నిధుల విడుదలను జాప్యం చేస్తోందంటూ సుప్రీంకోర్టులో కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్ సోమవారం కీలక మలుపు తిరిగింది. -
హామీలు విస్మరించిన భాజపా
[ 23-04-2024]
పేదలు, మధ్యతరగతి కుటుంబాల భవిష్యత్తుకు ఈ లోక్సభ ఎన్నికలు నిర్ణయాత్మకమైనవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. -
హత్యోన్మాదంపై నిరసన వెల్లువ
[ 23-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడ విద్యార్థిని నేహా హీరేమఠ్ హత్యను ఖండిస్తూ వివిధ సంఘాలు ఇచ్చిన పిలుపునకు ధార్వాడలోని వర్తక, వాణిజ్య సంస్థల ప్రతినిధులు స్పందించారు -
బడుగుల ఓట్లే నిర్ణయాత్మకం
[ 23-04-2024]
ప్రముఖ హృద్రోగ చికిత్స నిపుణుడు డాక్టర్ సీఎన్ మంజునాథ్ రాజకీయ అరంగేట్రం.. ఆయనకు పెను సవాళ్లను విసురుతోంది. -
ఆకట్టుకునేలా అవగాహన
[ 23-04-2024]
ఎన్నికల్లో యువత తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొనాలంటూ అధికారులు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు -
అభ్యర్థికి కాదు.. అమాత్యులకే అగ్నిపరీక్ష
[ 23-04-2024]
బళ్లారి లోక్సభ బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఇ.తుకారాంను గెలిపించుకునే బాధ్యత బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్య మంత్రులు బి.నాగేంద్ర, బి.జడ్.జమీర్ అహ్మద్ ఖాన్ భుజస్కందాలపై ఉండటంతో ఈ ఎన్నికలు అభ్యర్థికన్నా అమాత్యులకే అగ్నిపరీక్షగా మారాయి -
గ్యారంటీలతో ప్రజలకు ఊతం
[ 23-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ఆచార్య రాజీవ్గౌడకు మద్దతుగా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం దాసరహళ్లిలో రోడ్షో నిర్వహించి, ఓట్లు అభ్యర్థించారు. -
‘ఉచిత’ హారం..అపూర్వ సత్కారం
[ 23-04-2024]
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఒక విద్యార్థిని సోమవారం రాత్రి ప్రత్యేకంగా సత్కరించింది. అరసికెరెలో మొదటి ఏడాది న్యాయశాస్త్రాన్ని చదువుతున్న జయశ్రీ ‘ఉచిత బస్సు టికెట్ల’తో చేసిన హారంతో ఆయనను సన్మానించింది.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ