వరద బాధితులకు సాయం
రాష్ట్రంలోని 3,227 లంబాడీ తాండాలు, కురుబర హట్టిలను రెవెన్యూ గ్రామాలుగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆర్.అశోక్ వెల్లడించారు. వీటిలో 1034 తాండాలు, హట్టిలను రెవెన్యూ గ్రామాలుగా ప్రకటించేందుకు నోటిఫికేషన్ జారీ చేశామని చెప్పారు.
విలేకరులతో మాట్లాడుతున్న అశోక్
రాష్ట్రంలోని 3,227 లంబాడీ తాండాలు, కురుబర హట్టిలను రెవెన్యూ గ్రామాలుగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆర్.అశోక్ వెల్లడించారు. వీటిలో 1034 తాండాలు, హట్టిలను రెవెన్యూ గ్రామాలుగా ప్రకటించేందుకు నోటిఫికేషన్ జారీ చేశామని చెప్పారు.
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : భారీ వర్షాలతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.అశోక్ ప్రకటించారు. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న చోట్ల, లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. బాధిత కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, వంట నూనె, చక్కెర, కొవ్వొత్తులు, అగ్గిపెట్టె తదితరాలు ఉన్న రూ.వెయ్యి విలువ చేసే ‘బాధ్యత కిట్’ అందిస్తున్నామని ప్రకటించారు. విధానసౌధలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిర్వాసితులు, ఇళ్లలోకి నీరు చేరడంతో సమస్యలు ఎదుర్కొంటున్న వారు తాము ఒంటరి అనే భావన రాకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తోందని వివరించారు. చిన్న కుటుంబానికీ కనీసం పది రోజులకు సరిపోయే నిత్యావసరాలు ఈ కిట్లలో ఉంచామని చెప్పారు. రాష్ట్రంలోని 21 జిల్లాల్లో వరద, భారీ వర్షాలు, ఆస్తి, పంట నష్టాలు నమోదైనట్లు వివరించారు. పంట, ఆస్తి నష్టం అంచనాలను వర్షం తగ్గిన తర్వాత చేపడతామన్నారు. గత ఏడాది పంట, ఇతర నష్టాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.2,445 కోట్లు విడుదల చేసిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న పరిహారంతో పోల్చితే కర్ణాటకలోనే ఎక్కువ మొత్తంలో అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆరు దశాబ్దాల కిందట కేఆర్ఎస్ ఆనకట్ట నిర్మాణం కోసం వచ్చిన 700కుపైగా వలస కార్మికులు శ్రీరంగపట్టణ తాలూకాలో ఉంటున్నారని, వారందరికీ ప్రస్తుతం ఉంటున్న స్థలాలకు హక్కు పత్రాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆగస్టు 1-7 మధ్య అతివృష్ఠితో 14 జిల్లాల్లోని 161 గ్రామాలకు చెందిన 21,727 మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. వీరిలో 8,197 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వివరించారు. నిర్వాసితుల కోసం ప్రారంభించిన 75 కేంద్రాల్లో 7,386 మంది ఆశ్రయం పొందుతున్నారని తెల్లడించారు. అతివృష్ఠితో 73 మంది మరణించగా, ఇందులో పిడుగుపడి 15 మంది, చెట్టు కొమ్మలు పడి ఐదుగురు, ఇళ్లు కూలి 19 మంది, ప్రవాహంలో కొట్టుకుపోయి 24 మంది, లోయల్లో పడి 9 మంది, విద్యుదాఘాతంతో ఒకరు మరణించారని చెప్పారు. వర్షాలకు 666 ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా 2,449 ఇళ్లకు ఎక్కువ హాని, మరో 17,750 ఇళ్లకు హాని కలిగిందని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో 204 ఆవులు, 305 గొర్రెలు, మేకలు వర్షానికి మరణించాయి. పంట హానికి సంబంధించి 1,37,029 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,768 కిలోమీటర్ల పొడవైన రహదారులు, 1,152 చిన్న వంతెనలు, 4,561 పాఠశాలలు, 122 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2,249 అంగన్వాడి కేంద్రాలు, 17,065 విద్యుత్తు స్తంభాలు, 1,472 ట్రాన్స్ఫారాలు, 95 చెరువులు పాక్షికంగా, పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
* రాష్ట్రంలో పంట నష్టానికి జాతీయ విపత్తుల నిర్వహణ దళం ఇస్తున్న పరిహారాన్ని పెంచుతున్నట్లు మంత్రి అశోక్ తెలిపారు. ప్రస్తుతం ప్రతి హెక్టారుకు రూ.6,800 బదులుగా రూ.13,600 ఇస్తున్నామని చెప్పారు. మాగాణి సాగు పంటలు నష్టమైతే రూ.13,500 బదులుగా రూ.25 వేలు సాయం చేస్తామని తెలిపారు. బహుళ వార్షిక పంటలు నష్టమైతే రూ.18 వేల బదులుగా రూ.28 వేలను ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూట్యూబర్ దుస్సాహసం.. ఎయిర్పోర్టు రన్వేపై వీడియో చిత్రీకరించి..
[ 18-04-2024]
బెంగళూరు నగర శివారు దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేపై వీడియో చిత్రీకరించి, యూట్యూబ్లో అప్లోడ్ చేసిన యూట్యూబర్ వికాస్ గౌడను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. -
భార్య హంతకుడికి ఐదేళ్ల కారాగారం
[ 18-04-2024]
సారాయి తాగవద్దని అడ్డుకుంటున్న నసీమా (23) అనే గృహిణిని 2021 అక్టోబరు 19న బ్లేడుతో గొంతు కోసి హత్య చేసిన ఆమె భర్త ఇబ్రహీం సయ్యద్ హబీబ్ (25)కు కలబురగిలోని ఒకటో అదనపు జిల్లా న్యాయస్థానం.. -
భాజపాతో పోటీ.. హామీలు గ్యారంటీ
[ 18-04-2024]
కర్ణాటకలో గ్యారంటీలను సజావుగా అమలు చేశామన్న ధీమాతో కాంగ్రెస్ దేశప్రజలకు అదే స్థాయి హామీలిచ్చింది. ఇప్పటికే 25 గ్యారంటీలతో ఎన్నికల ప్రణాళిక ప్రకటించిన కాంగ్రెస్ వాటిపై రాష్ట్ర ప్రచారంలో మరింత వివరణ ఇచ్చింది. -
భాజపాకు గ్యారంటీల భయం.. హస్తానికదే అభయం
[ 18-04-2024]
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారంటీలు కొట్టుకుని పోతాయని ప్రచారంలో ముందుకు వెళ్తున్న భాజపాకు ఎక్కడో అదే గ్యారంటీల భయం వెంటాడుతోందని సర్వత్రా చర్చనీయాంశమైంది. -
విద్యానగరిలో స్వతంత్రుడి సెగ?
[ 18-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలో అనుభవం కలిగిన నాయకుడు ప్రహ్లాద్ జోసి- యువనేత వినోద్ అసూటి మధ్య మధ్య పోటీ రసవత్తరంగా మారింది. -
పంచభూతాల్లో లీనమైన ద్వారకీశ్
[ 18-04-2024]
గుండెపోటుతో మంగళవారం ఉదయం మరణించిన సీనియరు నటుడు, దర్శకుడు, నిర్మాత- ద్వారకీశ్ భౌతికకాయానికి చామరాజపేట టీఆర్ మిల్ ఆవరణలో బుధవారం మధ్యాహ్నం పోలీసు గౌరవ లాంఛనాలతో- కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించారు. -
డీకేపై గౌడ తీవ్ర ఆరోపణ
[ 18-04-2024]
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆస్తి కోసం ఒక తొమ్మిదేళ్ల బాలికను అపహరించారని మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవేగౌడ మంగళవారం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. -
కరడికి చేయందించిన కాంగ్రెస్
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురై, మంగళవారం లోక్సభ సభ్యత్వానికి- భారతీయ జనతాపార్టీకీ రాజీనామా చేసిన కొప్పళ ఎంపీ కరడి సంగణ్ణ బుధవారం బెంగళూరులో కాంగ్రెస్లో చేరారు. -
మోదీ సభకు సకల సన్నాహాలు
[ 18-04-2024]
బెంగళూరు ప్యాలెస్ మైదానంలో శనివారం సాయంత్రం నిర్వహించే బహిరంగలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభాకరంద్లాజె వెల్లడించారు. -
భాజపాను బలపరుద్దాం
[ 18-04-2024]
మాదిగ సముదాయ ప్రజలందరం భాజపాను బలపరుద్దామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. చెళ్లకెర వాసవీ కల్యాణ మంటపంలో బుధవారం జరిగిన మాదిగ సముదాయ సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మంత్రి మల్లికార్జున ప్రచారం
[ 18-04-2024]
బోవి గురుపీఠాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున వివిధ పీఠాధిపతులను కలిసి లోక్సభ ఎన్నికల్లో దావణగెరె కాంగ్రెస్ అభ్యర్థి డా.ప్రభ మల్లికార్జునకు మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
భాజపా రామాలయం నిర్మిస్తే.. మేం రామరాజ్యమే తెస్తాం
[ 18-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామరాజ్యమే నిర్మిస్తామని బళ్లారి జిల్లా మంత్రి బి.నాగేంద్ర స్పష్టం చేశారు. జూన్ 4న కేంద్రంలో భాజపా ప్రభుత్వం పతనమవుతుంది. -
ఫోన్ ట్యాపింగ్ చేయలేదు కుమారస్వామి స్పష్టీకరణ
[ 18-04-2024]
తాను ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి ఉంటే సంకీర్ణ ప్రభుత్వం పతనమయ్యేది కాదని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు
-
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు
-
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
-
ఇన్ఫీ లాభం 30 శాతం జంప్.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్