లతా రజనీపై రెండు కేసుల రద్దు
సూపర్స్టార్ రజనీకాంత్ భార్య లతపై నమోదైన వంచన, అబద్దం చెప్పిన కేసులను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఫోర్జరీ కేసు విచారణను కొనసాగించేందుకు పోలీసులకు అనుమతి మంజూరు చేసింది. తమిళ చిత్రం ‘కొచాడియన్’ సినిమాకు
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : సూపర్స్టార్ రజనీకాంత్ భార్య లతపై నమోదైన వంచన, అబద్దం చెప్పిన కేసులను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఫోర్జరీ కేసు విచారణను కొనసాగించేందుకు పోలీసులకు అనుమతి మంజూరు చేసింది. తమిళ చిత్రం ‘కొచాడియన్’ సినిమాకు రజనీకాంత్ కుమార్తె దర్శకత్వం వహించారు. ఆ చిత్రానికి సంబంధించి యాడ్ బ్యూరో అడ్వర్టైజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, మెసర్స్ మీడియా ఒన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి. మెసర్స్ మీడియా ఒన్ తరఫున లత లావాదేవీలు నిర్వహించారు. చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో తాము నష్టపోయామని యాడ్ బ్యూరో అడ్వర్టైజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆరోపించింది. ఒప్పందం ప్రకారం తమకు పరిహారం ఇవ్వాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది. దీనిపై వార్తలను ప్రచురించకుండా లత 2014 డిసెంబరు 2న వేసుకున్న అర్జీని హైకోర్టు 2016లో తోసిపుచ్చింది. స్టేకు సంబంధించి ఆమె అబద్దాలు చెప్పారని, వంచనకు పాల్పడ్డారని, కొన్ని సంతకాలను ఫోర్జరీ చేశారంటూ ఆ సంస్థ ఆరోపించింది. స్టే ఆదేశాల్లో ఉన్న సంతకాన్ని నకలు చేశారని వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగించి, మిగిలిన రెండు ఆరోపణలపై నమోదైన కేసులను కొట్టి వేస్తూ జస్టిస్ ఎం.నాగప్రసన్న ఆదేశాలు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?