logo

గడువిస్తే.. అన్నీ చెబుతా

ముఖ్యమంత్రి మార్పు తదితర రాజకీయాంశాలపై మూడు రోజుల తరువాత మాట్లాడతానని పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ వెల్లడించారు. బుధవారం ఇక్కడి ఆర్‌ఆర్‌ నగరలోని గ్లోబుల్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర అమృత మహోత్సవ నడక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Published : 11 Aug 2022 05:58 IST

విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న డీకే శివకుమార్‌

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి మార్పు తదితర రాజకీయాంశాలపై మూడు రోజుల తరువాత మాట్లాడతానని పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ వెల్లడించారు. బుధవారం ఇక్కడి ఆర్‌ఆర్‌ నగరలోని గ్లోబుల్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర అమృత మహోత్సవ నడక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ భాజపా నేతలకు అభివృద్ధితో పని లేదన్నారు. ముఖ్యమంత్రిని మార్చే విషయంపై తప్పకుండా స్పందిస్తానన్నారు. వారు ఎందరు ముఖ్యమంత్రులను మార్చినా మాకేమీ నష్టం లేదన్నారు.
* స్వాతంత్య్ర అమృత మహోత్సవ పాదయాత్రలో పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలని డీకే శివకుమార్‌ పిలుపునిచ్చారు. బెంగళూరు సంగోళ్లి రాయణ్ణ కూడలి నుంచి నేషనల్‌ కళాశాల మైదానం వరకు పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. కళాకారులు, విద్యావేత్తలు, క్రీడాకారులు, విద్యార్థులు, సాహితీవేత్తలు.. ఇలా అన్నివర్గాల వారినీ ఆహ్వానించామన్నారు. ఇప్పటి వరకు 40 వేల మంది తమ పేర్లను నమోదు చేయించుకున్నారని తెలిపారు. హాజరైయ్యే వారందరికీ జాతీయ జెండా, టోపీ, టీషర్ట్‌ ఇస్తామన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని