అత్యుత్తమ ఆర్థికవేత్త డా.శేషాద్రి
భారతదేశంలో తలసరి ఆదాయం పెరుగుతోందని చెబుతున్నా....ప్రభుత్వం భారీగా పన్నులు పెంచుతోంది. సామాన్యులు మాత్రం అభివృద్ధి చెందడం లేదు. సామాన్య ప్రజలు ఆర్థిక, సామాజిక, మౌలిక, విద్యా సామర్థ్యాలు అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములయ్యేలా
కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, అధ్యాపకులు
బళ్లారి, న్యూస్టుడే: భారతదేశంలో తలసరి ఆదాయం పెరుగుతోందని చెబుతున్నా....ప్రభుత్వం భారీగా పన్నులు పెంచుతోంది. సామాన్యులు మాత్రం అభివృద్ధి చెందడం లేదు. సామాన్య ప్రజలు ఆర్థిక, సామాజిక, మౌలిక, విద్యా సామర్థ్యాలు అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములయ్యేలా అభివృద్ధి చెందాలని హంపీ కన్నడ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు డా.ఎం.చంద్రపూజరి పేర్కొన్నారు. డా.శేషాద్రి స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ సరళాదేవి సతీశ్చంద్ర అగరవాల్ డిగ్రీ కళాశాలలో డా.శేషాద్రి స్మరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కోట్లాది మూలధనాన్ని ఖర్చు చేసినా...ప్రజలు ప్రయోజనం పొందలేక పోతున్నారు. అభివృద్ధి ప్రక్రియలో సామాన్య ప్రజలను భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. అప్పుడే అభివృద్ధి చెందుతుందన్నారు. బహుళజాతి కంపెనీలను ఆహ్వానించే సామర్థ్యం దేశానికి ఉండాలి. దేశంలో మౌలిక వసతులు, నైపుణ్యం లేని మానవ వనరులు, శాంతిభద్రతలు చూసి కంపెనీలు ముందుకు రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. కళాశాల ప్రధాన ఆచార్యులు డా.ఆర్.ఎం.శ్రీదేవి మాట్లాడుతూ మా గురువు డా.శేషాద్రి. ఆయన మార్గదర్శనంలో ముందుకు వెళ్లడంతో మంచి భవిష్యత్తులో స్థిరపడనట్లు వివరించారు. కార్యక్రమంలో మోకా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డా.హోన్నూరువలి, డా.అబ్దుల్ అజీజ్ మాట్లాడారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డా.శేషాద్రి స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కె.సి.కొండయ్య మాట్లాడుతూ డా.శేషాద్రి రాష్ట్రంలోనే అత్యుత్తమ ఆర్థికవేత్త, బళ్లారి అభివృద్ధిలో ఉన్నత ఆలోచనలు ప్రజాప్రతినిధులతో పంచుకొనేవారన్నారు. డా.శేషాద్రి చిత్రపటం పెన్సిల్తో అక్కడే గీసిన ప్రముఖ చిత్ర కళాకారుడు మంజునాథ గోవిందవాడకు సన్మానం చేశారు. అనంతరం పుస్తకం విడుదల చేశారు. కార్యక్రమంలో విశ్రాంత తెలుగు అధ్యాపకులు డా.సురేంద్రబాబు, విశ్రాంత పాత్రికేయుడు అహిరాజ్, డా.దురుగప్ప, సిరిగేరి పన్నారాజ్, డా.ఎస్.జయణ్ణ, తాడిపత్రి గోవింద విఠల్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే