చదువులమ్మ అమృతానందం!
అఖిల భారత ఉన్నత విద్యా సమీక్ష (ఏఐఎస్హెచ్ఈ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) మొదలు గ్లోబల్ క్యూఎస్ సమీక్షలు ఎప్పుడు ప్రకటించినా కర్ణాటక ఉత్తమ ర్యాంకులు మెరుగైన స్థానంలోనే నిలుస్తోంది. రాష్ట్రంలో అగ్రహార, శివపురి, బ్రహ్మపురి, ఘటికాస్థాన, మఠాల విద్యా వ్యవస్థల నుంచి రాష్ట్రంలో
నూతన జాతీయ విద్యా విధానానికి కన్నడ పాలకుల నాందీ
ఈనాడు, బెంగళూరు : అఖిల భారత ఉన్నత విద్యా సమీక్ష (ఏఐఎస్హెచ్ఈ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) మొదలు గ్లోబల్ క్యూఎస్ సమీక్షలు ఎప్పుడు ప్రకటించినా కర్ణాటక ఉత్తమ ర్యాంకులు మెరుగైన స్థానంలోనే నిలుస్తోంది. రాష్ట్రంలో అగ్రహార, శివపురి, బ్రహ్మపురి, ఘటికాస్థాన, మఠాల విద్యా వ్యవస్థల నుంచి రాష్ట్రంలో నాణ్యమైన విద్యా బోధన దొరుకుతూనే ఉంది. ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక విద్యల్లో సంప్రదాయ విధానాలను క్రమంగా సవరించిన కర్ణాటక విద్యా వ్యవస్థ నేడు రోబో, కృత్రిమ మేథతో ఆధునిక విద్యను అందరికీ అందుబాటులోనికి తెచ్చింది.
ఆధునిక బోధన..: అప్పటి వరకు గ్రామాలు, ప్రాంతాలకే పరిమితమైన పాఠ్యాంశాలు సమగ్ర విద్య సలహా సమితి (ఈఐఏసీ) ఏర్పాటుతో బోధన లక్ష్యం విస్తృతమైంది. స్వాతంత్య్రానికి పూర్వం మరాఠి భాష ప్రభావంతో హుబ్బళ్లి- ధార్వాడల్లో మరాఠా బోధనశాలలు ఏర్పాటై ముంబై రాష్ట్రం పర్యవేక్షణలో నడిచేవి. ఆపై మైసూరు ఉచిత ఆంగ్ల మాధ్యమశాలలను సామాన్యులకు అందుబాటులో తెచ్చారు. ఈ పాఠశాలలకు సమాంతరంగా క్రిస్టియన్ మిషనరీ బోధన 1950 వరకు రాష్ట్రంలో నగరవాసులకు అనువైన విద్యను అందించింది. చదువు విలువ పెరిగే కొద్దీ ప్రాంతాలు, సంస్కృతులకు పరిమితమైన విద్య కాస్త 1956 నాటికి సమగ్ర విద్య సలహా సమితి ఏర్పాటుకు దారి తీసి రాష్ట్రమంతా ఏకరూప విద్యా విధానం తెరపైకి వచ్చింది.
నగరీకరణ ఘనం: గ్రామాల నుంచి నగరాలకు వలస వచ్చేవారి సంఖ్య పెరగటం, ఉపాధి కోసం ఇంటి కంటే కార్యాలయాలకే పరిమితమయ్యే నగరవాసుల కోసం ప్రాథమిక, మాధ్యమిక విద్యా బోధన కోసం 1956లో ఏర్పాటైన కర్ణాటక ప్రభుత్వం కొత్త విధానాలను రూపొందించింది. ఆ సమయంలో బోధన ప్రమాణాలు ఎంత ముఖ్యమో అంతే స్థాయిలో విద్యార్థుల ప్రవేశాలు కీలకంగా మారాయి. కొఠారి కమిషన్ సిఫార్సుల ప్రకారం.. రాష్ట్రంలో నాలుగు అంచెల విద్యా విధానం, ఉన్నత విద్యకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో 1964 నాటికి ఏకరూప విద్యా బోధన అధికారికంగా విద్యాలయాల్లో అమలు చేసిన ప్రభుత్వం ఆ ఏట 537 పాఠశాలల్లో 1.15 లక్షల మందిని చేర్పించి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచింది. నాలుగు అంచెల బోధన పీయూ, సాంకేతిక విద్య అవసరాల కోసం వృత్తి విద్యా బోధనను ప్రారంభించేందుకు జాతీయ స్థాయి మొదలియార్ సమితి సిఫార్సుల్లో కీలక అంశాలపై రాష్ట్రం దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక విద్య ప్రమాణాలను జాతీయ స్థాయి దాటి ప్రపంచ స్థాయికి మళ్లించింది.
ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాల ఐఐఎస్సీ
విశ్వవిద్యాలయాల విప్లవం : 1956 నాటికి కేవలం నాలుగు విశ్వవిద్యాలయాలతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యను నెగ్గుకొచ్చింది. ఆ తర్వాత వరుసగా విశ్వవిద్యాలయాల చట్టాలను తెరపైకి తెచ్చి నేటికి వాటి సంఖ్యను 58కి చేర్చింది. ప్రాంతీయ అసమానతలను తగ్గించే దిశగా 1916లో నాలుగో కృష్ణరాజ ఒడయార్ ప్రారంభించిన మైసూరు విశ్వవిద్యాలయం చదువుల విప్లవానికి నాంది పలికింది. ఆపై వరుసగా బెంగళూరు, మంగళూరు, ధార్వాడ, శివమొగ్గ, రాయచూరు, చిత్రదుర్గ, కలబురగిల్లో విశ్వవిద్యాలయాలను స్థాపించి సంప్రదాయ విద్యను అన్ని ప్రాంతాలకూ విస్తరించారు. సబ్జెక్టులు, భాషలు, సంస్కృతులు, కళలలు, వ్యవసాయానికే పరిమితమైన బోధన అందిస్తూనే ఇదే ప్రాంతాల్లో సాంకేతిక విద్యను మద్రాస్ విశ్వవిద్యాలయం ఆసరాతో అందించారు. ఈ క్రమంలో మఠాలు కూడా అక్షర దాసోహ సేవలతో దేశంలో ఏ రాష్ట్రంలోనూ అందించని ఉచిత విద్యా వ్యవస్థలను ఏర్పాటు చేసి రాష్ట్ర విద్యా ప్రమాణాలను పెంచాయి.
ఎన్ఈపీతో : విద్యా విధానాన్ని మార్చాలన్న ఉద్దేశంతో అమలు చేసిన జాతీయ నూతన విద్యా విధానం (ఎన్ఈపీ)ని అమలు చేసిన తొలి రాష్ట్రం కర్ణాటక. 2020లో ఎన్ఈపీ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసి ఆపై నాలుగు నెలలకే ఎన్ఈపీ నివేదికను కేంద్రానికి సమర్పించింది.
యాజమాన్య బోధనతో ఉపాధి బాట
ఉపాధ్యాయుల శిక్షణ
1914 నాటికి రాష్ట్రానికి ప్రత్యేకంగా ఉపాధ్యాయ శిక్షణ వ్యవస్థ లేకపోవటంతో పట్టభద్రులంతా చెన్నై బాట పట్టేవారు. 1925లో మైసూరు మహరాజుల ఆసరాతో మైసూరు విశ్వవిద్యాలయం బ్యాచ్లర్ ఆఫ్ టీచింగ్ను ప్రారంభించి 1952 నాటికి ఈ బీఈడీ కోర్సులను స్వయంగా నిర్వహించే స్థాయికి చేరుకుంది. మరో నాలుగేళ్లకు ఎంఈడీ చదువులకు మైసూరు విశ్వవిద్యాలయం శ్రీకారం చుట్టి రాష్ట్రంలోనే నాణ్యమైన బోధకులను తీర్చి దిద్దింది.
అత్యధికం బెంగళూరులోనే
సంప్రదాయ, సాంకేతిక విద్యను సమాంతరంగా అందుబాటులోకి తెచ్చిన కర్ణాటకలో 1980 నాటికి సాంకేతిక విద్య జోరందుకుంది. వృత్తి విద్య, పరిశోధన అభివృద్ధి, ఉపాధి రంగాలు ఊపందుకోవటంతో బెంగళూరు నగరం క్రమంగా ఉన్నత విద్యకు కేంద్రంగా మారింది. 1909లో బెంగళూరు ఏర్పాటైన భారతీయ విజ్ఞాన సంస్థ రాష్ట్ర పరిశోధన ప్రగతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లగా, ఐఐటీ ధార్వాడ, ఐఐఎం బెంగళూరు, ఎన్ఎల్ఎస్యూ సంస్థలు తమదైన ప్రత్యేక సబ్జెక్టుల్లో ఎన్ఐఆర్ఎఫ్, క్యూఎస్ సమీక్షల్లో సత్తా చాటాయి. 2021 ఏఐఎస్హెచ్ఈ సమీక్ష ప్రకారం అత్యధిక కళాశాలలున్న రాష్ట్రాల్లో కర్ణాటక మూడో స్థానంలో ఉండగా, ప్రతి లక్ష మందికి 57 కళాశాలలు, 18-23 వయసున్న విద్యార్థుల ఉన్నత విద్యా ప్రవేశాల(జీఈఆర్) ప్రమాణం 23 శాతంతో రాష్ట్రం మెరుగైన స్థానంలో నిలిచింది. తాజాగా కేంద్ర ఉన్నత విద్యాశాఖ ప్రకటించిన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లోనూ రాష్ట్రానికి చెందిన 14 కళాశాలలు 11 కేటగిరీల్లో తొలి పదిలో స్థానం సంపాదించటం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖËర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!