బస్సు-లారీ ఢీకొని 15 మందికి గాయాలు
బెంగళూరుకు వెళ్లే కేఎస్ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులు గాయపడిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున హిరియూరు తాలూకా జవనగొండన హళ్లి గ్రామం వద్ద జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా
హిరియూరు తాలూకా జవనగొండనహళ్లి వద్ద బస్సు లారీని ఢీకొన్న దృశ్యం
చెళ్లకెర(చిత్రదుర్గం), న్యూస్టుడే: బెంగళూరుకు వెళ్లే కేఎస్ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులు గాయపడిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున హిరియూరు తాలూకా జవనగొండన హళ్లి గ్రామం వద్ద జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా కుడివైపునకు తిరగడంతో వెనుకవైపు నుంచి వేగంగా వస్తున్న బస్సు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న అభిజిత్, రాఘవేంద్ర రెడ్డి, నేత్రావతి తదితరులు తీవ్రంగా గాయపడగా వారిని హిరియూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హిరియూరు గ్రామీణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భారీగా నగలు, నగదు చోరీ
దొంగతనం చేశాక చెల్లాచెదరైన వస్తువులు
చెళ్లకెర(చిత్రదుర్గం) ,న్యూస్టుడే: హిరియూరు పట్టణంలోని లక్ష్మమ్మ నగర్లో నివాసముంటున్న ఇంద్రజిత్ అనే వ్యక్తి ఇంట్లో గురువారం రాత్రి దొంగలు పడ్డారు. ఇంట్లో దాచిన రూ.4.30 లక్షల నగదు, సుమారు రూ.12 లక్షలు విలువైన 280 గ్రాముల బంగారు నగలను దొంగలు దోచుకొని పరారైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. ఇంద్రజిత్ అనారోగ్యంతో బాధపడుచూ చికిత్స కోసరం బెంగళూరుకు వెళ్లడంతో ఈ సంఘటన చోటు చేసుకొంది.
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
బళ్లారి: బళ్లారి రైల్వేస్టేషన్ పరిధిలోని హగరి- హద్దినగుండు రైల్వేస్టేషన్ పరిధిలోని కె.ఎం.221/51-53వ కిలోమీటర్ వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి (60) మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని విమ్స్కు తరలించారు. మృతుడు సంబంధీకులు ఉంటే రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామనగరలో శివశక్తి ప్రదర్శన
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ఘట్టం గురువారం ప్రారంభమైన నేపథ్యంలో శక్తి ప్రదర్శనకు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రామనగర పట్టణాన్ని వేదికగా మలుచుకున్నారు. కాంగ్రెస్ తరఫున బెంగళూరు గ్రామీణ అభ్యర్థిగా సోదరుడు డీకే సురేశ్ -
పేలుడు కేసులో నిందితుడి అరెస్టు
[ 29-03-2024]
బ్రూక్ఫీల్డ్ పరిధి రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు నిందితుడు ముజామిల్ షరీఫ్ను అరెస్టు చేశామని జాతీయ తనిఖీ దళం గురువారం రాత్రి ప్రకటించింది. -
గెలిచాకే మోదీని కలుస్తా: ఈశ్వరప్ప
[ 29-03-2024]
శివమొగ్గ లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప తన సొంత కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. -
నాకు ప్రాణాపాయం
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల వేళ తనను అంతం చేసేందుకు కొందరు భాజపా నాయకులు కంకణం కట్టుకున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. -
ఐదుగురు కుమార్తెలతో తల్లి ఆత్మహత్యాయత్నం
[ 29-03-2024]
భర్త గోపాల్ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. -
యాప్ల తోడుగా ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా!
[ 29-03-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను సజావుగా, సులువుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక యాప్లను సిద్ధం చేసింది. ఈ యాప్లు ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా తెలిపారు. -
కఠోర శ్రమతో సులువుగా లక్ష్య సాధన
[ 29-03-2024]
నవోదయ రీగెల్-24 వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గురువారం రాత్రి నవోదయ స్టేడియంలో మూడు రోజుల కార్యక్రమాలను రాయచూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ హనుమంతప్ప జ్యోతి వెలిగించి ప్రారంభించారు. -
ప్రగతిని తుంగలో తొక్కిన భాజపా
[ 29-03-2024]
బెంగళూరు గ్రామీణ లోక్సభ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి హస్తినలో మీ స్వరాన్ని వినిపించేందుకు డీకే సురేశ్ను మరోసారి గెలిపించాలని ప్రజలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. ఇక్కడి ప్రజల సమస్యలకు మొదటి నుంచి ఆయన స్పందిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. -
మరింత పడిపోయిన విద్యుదుత్పాదన
[ 29-03-2024]
రాష్ట్రంలోని శాఖోత్పన్న విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పాదన సగానికి పతనమైంది. గురువారం సాయంత్రం 4.24 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం. -
లాడ్జిలో దంపతుల ఆత్మహత్య
[ 29-03-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు