కాంగ్రెస్.. అమృత మహోత్సాహం
నగరంలో గతంలో ఎన్నడూలేని విధంగా జరిగే స్వాతంత్య్ర అమృత మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేపీసీసీ అధ్యక్షుడు డీకేశివకుమార్ పిలుపు నిచ్చారు. ఇప్పటి వరకు కార్యక్రమంలో పాల్గొనేందుకు 90 వేల మంది తమ
జాతీయ జెండా చేతపట్టి కార్యకర్తలతో కలిసి నడుస్తున్న సిద్ధరామయ్య
బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్టుడే: నగరంలో గతంలో ఎన్నడూలేని విధంగా జరిగే స్వాతంత్య్ర అమృత మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేపీసీసీ అధ్యక్షుడు డీకేశివకుమార్ పిలుపు నిచ్చారు. ఇప్పటి వరకు కార్యక్రమంలో పాల్గొనేందుకు 90 వేల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. ఆదివారం ఎంజీరోడ్డులో మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యతో కలిసి పువ్వులు వేశారు. అనంతరం ట్రినిటి కూడలి నుంచి మహాత్మాగాంధీ విగ్రహం వరకు 3.3 కిలోమీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. జెండాను పట్టుకుని డీకేశివకుమార్, కార్యాధ్యక్షుడు సలీం అహ్మద్, యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ నలపాడ్ తదితరులు జాతాలో నడిచారు. కొంతసేపు సిద్ధరామయ్య జాతీయ జెండా చేతులో పట్టుకుని కార్యకర్తలతో కదిలారు. నగరంలో జరిగే స్వాతంత్య్ర అమృత మహోత్సవ కార్యక్రమానికి పార్టీలు రాజకీయాలకు అతీతంగా ప్రజలు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.
జాతీయ జెండాతో ర్యాలీలో పాల్గొన్న డీకేశివకుమార్, యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ నలపాడ్, తదితరులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రంగులరాట్నం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్కు కన్నడనాడు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల మధ్య ప్రచారం ఓ ఎత్తయితే నాలుగు రోజులుగా ప్రచారాస్త్రాలు కొత్త రంగు అద్దుకుంటున్నాయి. -
ఉపాధ్యాయిని అపహరణ
[ 24-04-2024]
హుబ్బళ్లిలోని ఒక పాఠశాలలో ఒప్పంద పద్ధతిలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్న అక్షత (24) అపహరణకు గురైంది. అఖండేశ్వర జాతరకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చిన ఆమె మళ్లీ వెనక్కు రాలేదు. -
బడుగుల బతుకు ధరాభారం
[ 24-04-2024]
దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలు నలిగి పోతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. -
కోలారు.. కోటి ఆశల తేరు!
[ 24-04-2024]
కోలారు (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాన్ని మరోసారి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు మునిగాళ్లపై నిలిచారు. నిన్నమొన్నటి అభిప్రాయభేదాలను పక్కనబెట్టి సీనియర్లు- జూనియర్లు ఒక్కటయ్యారు. -
ప్రజల ఆకాంక్షలకే పెద్దపీట
[ 24-04-2024]
రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో కీలక నేతల సందడి కొనసాగుతోంది. భాజపా తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రముఖులు అమిత్ షా, జేపీ నడ్డా రాకతో అభ్యర్థులు చివరి దశ ప్రచారాన్ని విజయవంతంగా ముగించే ప్రయత్నం చేస్తున్నారు. -
రాష్ట్రంలో అధికార దుర్వినియోగం: అశోక్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని దురుపయోగపరుస్తోందని విపక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అనుసరించవలసిన నిబంధనలను ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించిందని గుర్తు చేశారు. -
నేటితో ప్రచారం.. పరిసమాప్తం
[ 24-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికల కోసం జాతీయ నేతల ప్రచారం జోరందుకుంది. బుధవారంతో బహిరంగ ప్రచారానికి తెరపడనుండగా చివరి ప్రయత్నంగా జాతీయ పార్టీల నేతలు ప్రచార వేదికలపై ప్రసంగాలతో హోరెత్తించారు.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!