Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు
న్యాయస్థానం ఆవరణలో భార్య గొంతు కోసి పరారైన శివకుమార్ (27) అనే హంతకున్ని హాసన జిల్లా హొళెనరసీపుర పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని హాసన జిల్లాలోని తట్టికెరెకు చెందిన చైత్ర (24) అనే యువతిని ఆరేళ్ల క్రితం
చైత్ర, శివకుమార్ దంపతులు (పాతచిత్రం)
హాసన, న్యూస్టుడే: న్యాయస్థానం ఆవరణలో భార్య గొంతు కోసి పరారైన శివకుమార్ (27) అనే హంతకున్ని హాసన జిల్లా హొళెనరసీపుర పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని హాసన జిల్లాలోని తట్టికెరెకు చెందిన చైత్ర (24) అనే యువతిని ఆరేళ్ల క్రితం ప్రేమించి శివకుమార్ వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ రెండేళ్ల క్రితం విడాకుల కోసం న్యాయస్థానంలో అర్జీ వేసుకున్నారు. శనివారం నిర్వహించిన లోక్అదాలత్లో రాజీ కోసం వీరిద్దరూ హాజరయ్యారు. కొంత సమయం విచారణ అనంతరం మరో తేదీకి కేసును వాయిదా వేశారు. ఈ క్రమంలో తన రెండేళ్ల కుమారుడ్ని వెంటపెట్టుకుని వెళ్తున్న చైత్రను వెంబడించిన నిందితుడు మరుగుదొడ్ల ఆవరణలో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. స్థానికంగా బాధితురాలికి ప్రథమ చికిత్స అందించి హాసన జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె శనివారం రాత్రి మరణించింది. నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు విచారణ తీవ్రం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..