Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు

న్యాయస్థానం ఆవరణలో భార్య గొంతు కోసి పరారైన శివకుమార్‌ (27) అనే హంతకున్ని హాసన జిల్లా హొళెనరసీపుర పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని హాసన జిల్లాలోని తట్టికెరెకు చెందిన చైత్ర (24) అనే యువతిని ఆరేళ్ల క్రితం

Updated : 15 Aug 2022 07:05 IST

చైత్ర, శివకుమార్‌  దంపతులు (పాతచిత్రం)

హాసన, న్యూస్‌టుడే: న్యాయస్థానం ఆవరణలో భార్య గొంతు కోసి పరారైన శివకుమార్‌ (27) అనే హంతకున్ని హాసన జిల్లా హొళెనరసీపుర పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని హాసన జిల్లాలోని తట్టికెరెకు చెందిన చైత్ర (24) అనే యువతిని ఆరేళ్ల క్రితం ప్రేమించి శివకుమార్‌ వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ రెండేళ్ల క్రితం విడాకుల కోసం న్యాయస్థానంలో అర్జీ వేసుకున్నారు. శనివారం నిర్వహించిన లోక్‌అదాలత్‌లో రాజీ కోసం వీరిద్దరూ హాజరయ్యారు. కొంత సమయం విచారణ అనంతరం మరో తేదీకి కేసును వాయిదా వేశారు. ఈ క్రమంలో తన రెండేళ్ల కుమారుడ్ని వెంటపెట్టుకుని వెళ్తున్న చైత్రను వెంబడించిన నిందితుడు మరుగుదొడ్ల ఆవరణలో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. స్థానికంగా బాధితురాలికి ప్రథమ చికిత్స అందించి హాసన జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె శనివారం రాత్రి మరణించింది. నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు విచారణ తీవ్రం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని