పాముకాటుతో వ్యక్తి మృతి
హొసదుర్గం తాలూకా అయ్యనహళ్లి గ్రామానికి చెందిన సురేశ్ (32) అనే యువకుడు ఆదివారం ఉదయం తన పొలంలో గడ్డిని కోస్తుండగా పాము కాటు వేసింది. తీవ్ర అనారోగ్యానికి గురవడంతో అతన్ని హొసదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా
చెళ్లకెరె (చిత్రదుర్గం), న్యూస్టుడే : హొసదుర్గం తాలూకా అయ్యనహళ్లి గ్రామానికి చెందిన సురేశ్ (32) అనే యువకుడు ఆదివారం ఉదయం తన పొలంలో గడ్డిని కోస్తుండగా పాము కాటు వేసింది. తీవ్ర అనారోగ్యానికి గురవడంతో అతన్ని హొసదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. హొసదుర్గం పోలీసు ఠాణాలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతూ యువకుడి దుర్మరణం
చెళ్లకెరె (చిత్రదుర్గం), న్యూస్టుడే : చెళ్లకెరె - హిరియూరు రహదారిలో సాణికెరె గ్రామం వద్ద శనివారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని, లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహన చోదకుడు విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా అప్పేనహళ్లి గ్రామానికి చెందిన సచిన్ (25) తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం చెళ్లకెరె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. చెళ్లకెరె పోలీసు ఠాణాలో కేసు నమోదైంది.
మనస్తాపంతో వ్యక్తి బలవన్మరణం
చెళ్లకెరె (చిత్రదుర్గం), న్యూస్టుడే : మూత్రపిండాల వైఫల్యంతో తీవ్ర అనారోగ్యానికి గురైన హిరియూరుకు చెందిన బసవరాజ్ (50) అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం రాత్రి జరిగినట్లు పోలీసులు తెలిపారు. పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నా నయం కాకపోవడంతో ఆయన మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హిరియూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో దంపతుల మృతి
దావణగెరె, న్యూస్టుడే: దావణగెరె జిల్లా బావియాళు గ్రామంలో విద్యుదాఘాతంతో వీణ (30), ఆమె భర్త రవిశంకర్ (38) ఆదివారం కన్నుమూశారు. ఉతికిన దుస్తుల్ని ఆరవేసేందుకు రవిశంకర్ వెళ్లిన సమయంలో విద్యుత్తు తీగ తాకి, షాక్ కొట్టింది. భర్తను రక్షించేందుకు వెళ్లి ఆమె కూడా విద్యుదాఘాతంతో మరణించింది. మాయకొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!