సర్కారులో లుకలుకలు
ఏదో ఒక రూపంలో బసవరాజ బొమ్మై ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతవారం ఓ మాజీ ఎమ్మెల్యే బొమ్మై నాయకత్వాన్ని మార్చే సమయం వచ్చిందని చేసిన వ్యాఖ్య దుమారం రేపింది. ఆ సందర్భంగా భాజపా రాష్ట్ర బాధ్యుడు అరుణ్సింగ్ స్పందించి
ఏదో.. నెట్టుకొస్తున్నామన్న మాధుస్వామి
ఆ వ్యాఖ్యలపై మంత్రివర్గ సభ్యుల ఆగ్రహం
మాధుస్వామి మాటలతో ముఖ్యమంత్రి బొమ్మైకి ఇరకాటం
ఈనాడు, బెంగళూరు : ఏదో ఒక రూపంలో బసవరాజ బొమ్మై ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతవారం ఓ మాజీ ఎమ్మెల్యే బొమ్మై నాయకత్వాన్ని మార్చే సమయం వచ్చిందని చేసిన వ్యాఖ్య దుమారం రేపింది. ఆ సందర్భంగా భాజపా రాష్ట్ర బాధ్యుడు అరుణ్సింగ్ స్పందించి.. బొమ్మై నాయకత్వంలోనే ఎన్నికలు ఎదుర్కొంటామని చెప్పి ఆ వదంతులకు ముగింపే పలికే ప్రయత్నం చేశారు. దిల్లీ నేతల హామీతో ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో సర్కారుపై మరో పిడుగుపడ్డట్లైంది. మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు బదులివ్వాల్సిన అవసరం లేదని నిన్నమొన్నటి దాకా బొమ్మై సర్కారుకు మద్దతు పలికిన మంత్రి మాధుస్వామి- తాజా వివాదానికి కేంద్రంగా మారటం గమనార్హం.
అలా నెట్టుకొస్తున్నాం
సామాజిక వేత్తగా పరిచయం చేసుకున్న చెన్నపట్టణకు చెందిన భాస్కర్ అనే వ్యక్తితో మాట్లాడుతున్నట్లు వైరల్గా మారిన ఓ ఆడియో నేడు బొమ్మై సర్కారును కుదిపేస్తోంది. మూడు రోజుల కిందట మంత్రి మాధుస్వామి ఫోన్లో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సర్కారు నడవటం లేదు. ఏదో మేనేజ్ చేస్తున్నాం. పైగా.. సహకార బ్యాంకులు రైతుల రుణాల రెన్యువల్ పేరిట అదనపు ఫీజులు వసూలు చేస్తున్నా ఆ మంత్రి చర్యలు తీసుకోలేదు’అంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు. తాను కూడా ఈ అదనపు ఫీజులు చెల్లించిన బాధితుడినని మాధుస్వామి చెప్పిన ఆడియో నేడు సర్కారులో చీలికకు దారి తీసింది. ఈ ఆడియోపై మాధుస్వామి మంగళవారం స్పందించారు. ఆ ఆడియోలో మాట్లాడింది నేనేనని అంగీకరించారు. అది పాత వీడియో.. ఏ సందర్భంగా అలా మాట్లాడానో నాకు గుర్తు లేదన్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తనను రెచ్చగొట్టించి అలా మాట్లాడేలా చేశారని పెదవి విరిచారు. రహస్యంగా రికార్డు చేయటం నేరమన్న ఆయన.. ఈ ఆడియో ప్రసారం చేసిన వారిపై ఫిర్యాదు చేస్తానన్నారు.
అర్థం వేరులే..
మంత్రి మాధుస్వామి సర్కారుపై చేసిన వ్యాఖ్యల అర్థం వేరని ముఖ్యమంత్రి బొమ్మై మంగళవారం సమర్థించుకున్నారు. ప్రత్యేక శాఖపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం సర్కారు సజావుగా సాగుతున్నట్లు ముఖ్యమంత్రి సమర్థించుకున్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన మంత్రితో తాను మాట్లాడినట్లు చెప్పారు. అదనపు ఫీజులు వసూలు చేస్తున్న బ్యాంకులపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు.
మంత్రుల మండిపాటు
మాధుస్వామి చేసిన వ్యాఖ్యలపై మంత్రివర్గ సభ్యుల్లో కొందరు తీవ్రంగా స్పందించారు. తన శాఖపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన ఎస్.టి.సోమశేఖర్ మాట్లాడుతూ సర్కారులో కీలక శాఖ నిర్వహిస్తున్న మాధుస్వామి స్వయంగా ఇలా వ్యాఖ్యానించటం తగదన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రతి గురువారం ఆయన స్వయంగా ప్రకటనలు చేస్తుంటారన్నారు. ప్రభుత్వం పని చేయకపోతే మంత్రివర్గ సమావేశాలు ఎందుకు నిర్వహించాలంటూ ప్రశ్నించారు. బహుశా మాధుస్వామి నిర్వహించే చిన్ననీటి పారుదల శాఖ సవ్యంగా లేదేమోనంటూ ఎద్దేవా చేశారు. మరో మంత్రి మునిరత్న మాట్లాడుతూ సర్కారు సరిగా లేదంటే అందులో భాగస్వామి అయిన మాధుస్వామి రాజీనామా చేయాలంటూ సవాలు విసిరారు. మరో మంత్రి గోపాలయ్య స్పందిస్తూ.. మాధుస్వామి వంటి సీనియర్ మంత్రి ఇలా వ్యాఖ్యానించరాదన్నారు. ముఖ్యమంత్రి కరోనా ఉన్నా కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని గుర్తుచేశారు. ఆయన నేతృత్వంలో ఎంతో సజావుగా ఉన్న సర్కారును విమర్శించటం సరికాదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటి హర్షికపై దాడి
[ 20-04-2024]
పులకేశినగరలో తన భర్త భువన్తో కలిసి వెళుతున్న సమయంలో కొందరు దుండగులు తమపై దాడి చేసి, తన గొలుసు దోచుకునేందుకు ప్రయత్నించారని పులకేశినగర ఠాణాలో నటి హర్షిక పుణచ్చ ఫిర్యాదు చేశారు. -
దక్షిణాదిపైనే కమలదండు గురి
[ 20-04-2024]
సీనియర్ల పోటీ మధ్య రాష్ట్ర భాజపా అధ్యక్ష పగ్గాలు దక్కించుకున్న యువ నేత బి.వై.విజయేంద్ర సారథ్యంలో తొలిసారిగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. -
ప్రేమ పేరుతో రక్తపుటేరులా?
[ 20-04-2024]
కర్ణాటకలో లవ్ జిహాద్ ఘటనలు ఎక్కువవుతున్నాయంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది. -
అగ్రనేతల గడ్డపై ఎవరిదో విజయం?
[ 20-04-2024]
బళ్లారి లోక్సభ నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, భాజపా నుంచి ఫైర్బ్రాండ్గా ప్రత్యేక గుర్తింపు పొందిన దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ బరిలో నిలిచారు. -
బెంగళూరు ఉత్తరలో ప్రధాని ప్రాభవమే శోభకు శ్రీరామరక్ష
[ 20-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ నియోజకవర్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం సందర్శించనున్న నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం మార్పులకు నోచుకుంటుందని, కమలనాథులకు విజయం చేరువవుతుందనే అంచనాలు తెరపైకి వచ్చాయి. -
కాంగ్రెస్లోకి మాలికయ్య గుత్తేదార్
[ 20-04-2024]
మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్, కుమటా మాజీ ఎమ్మెల్యే శారదా మోహన్శెట్టి తదితరులు శుక్రవారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
గదగలో నలుగురి దారుణ హత్య
[ 20-04-2024]
గదగ పట్టణంలోని చెన్నమ్మ కూడలి సమీపాన దాసర వీధిలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. -
నకిలీ పత్రాలతో నిలువుదోపిడీ
[ 20-04-2024]
ఒకే ఇంటి స్థలానికి లెక్కలేనన్ని నకిలీ పత్రాలు సిద్ధం చేసి వాటిని 22 బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.10 కోట్లకు పైగా రుణాన్ని తీసుకున్న ఆరుగురు వంచకులను బెంగళూరు జయనగర ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం