భగ్గుమన్న శివమొగ్గ
పడమటి కనుమల పాదప్రాంతం సామాజిక అశాంతితో భగ్గుమంది. శివమొగ్గ అమీర్ కూడలిలో హిందూ సంఘాలకు చెందిన కార్యకర్తలు ఏర్పాటు చేసిన సావర్కర్ చిత్రాలున్న బ్యానర్లు తొలగించిన వ్యవహారం ఉద్రిక్తతను ప్రోదిచేసింది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ప్రేమ్సింగ్
ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం
నిందితుల కట్టడికి పోలీసు కాల్పులు
శివమొగ్గలో పరిస్థితి అదుపు చేసేందుకు బరిలోకి దిగిన సాయుధ బలగాలు
శివమొగ్గ, న్యూస్టుడే : పడమటి కనుమల పాదప్రాంతం సామాజిక అశాంతితో భగ్గుమంది. శివమొగ్గ అమీర్ కూడలిలో హిందూ సంఘాలకు చెందిన కార్యకర్తలు ఏర్పాటు చేసిన సావర్కర్ చిత్రాలున్న బ్యానర్లు తొలగించిన వ్యవహారం ఉద్రిక్తతను ప్రోదిచేసింది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ప్రేమ్సింగ్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసిన ప్రధాన నిందితుడు మహ్మద్ జబీ అలియాస్ చర్బి (30)పై మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కాల్పులు జరిపి అరెస్టు చేశారు. నిందితుడు తలదాచుకున్న తీర్థహళ్లి రహదారి ఫలక్ సముదాయ భవనాన్ని పోలీసులు మంగళవారం వేకువ జామున చుట్టుముట్టారు. పట్టుకునేందుకు వెళ్లిన ఎస్సై మంజునాథ్పై నిందితుడు దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడని అధికారులు వివరించారు. లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినా పట్టించుకోకుండా వెళుతున్న అతని కాలుపైకి మంజునాథ్ కాల్పులు జరిపారు. కుడికాలిలోకి తూటా దూసుకు వెళ్లడంతో కిందపడిపోయిన నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడ్ని మెగ్గాన్ ఆసుపత్రిలో చేర్పించారు. అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కత్తిపోట్ల ఘటనకు సంబంధించి నదీమ్, అబ్దుల్ రెహమాన్, మరొక వ్యక్తిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ లక్ష్మీ ప్రసాద్ వెల్లడించారు.
భద్రావతిలో దాడి
శివమొగ్గ జిల్లా భద్రావతికి చెందిన సునీల్ అనే యువకునిపై ముబారక్ అలియాస్ డిచ్చి అనే వ్యక్తి దాడి చేశాడు. నెహ్రూనగరకు చెందిన బాధితుడు విధులకు హాజరయ్యేందుకు వెళుతుండగా ముబారక్ అడ్డగించి, దాడి చేసి పరారయ్యాడు. దాడిలో సునీల్ ముక్కు దూలం విరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితుడ్ని తాలూకా ఆసుపత్రిలో చేర్పించారు. భద్రావతి పాత ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడ్ని మాజీ మంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప మంగళవారం మధ్యాహ్నం పరామర్శించి ధైర్యం చెప్పారు. లోతైన దర్యాప్తు, నిందితులకు కఠిన శిక్షలతోనే ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
పరామర్శించిన మంత్రులు
దుండగుల చేతిలో కత్తిపోట్లకు గురైన ప్రేమ్సింగ్ను హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర, జిల్లా వ్యవహారాల బాధ్యుడు కె.సి.నారాయణగౌడ శివమొగ్గలోని మెగ్గాన్ ఆసుపత్రిలో పరామర్శించి ధైర్యం చెప్పారు. జిల్లా ఎస్పీ లక్ష్మీ ప్రసాద్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజస్థాన్కు చెందిన బాధితుడు కస్తూరిబా రోడ్డులోని దుస్తుల దుకాణంలో పని చేసేవాడని తెలిపారు. సావర్కర్ చిత్రం ఉన్న బ్యానర్లను దుండగులు తొలగించిన వెంటనే అమీర్ కూడలిలో గొడవ జరిగిందని చెప్పారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారని తెలిపారు. అక్కడి నుంచి పరారవుతూ నిందితులు దారి మధ్యలో ప్రేమ్సింగ్పై దాడి చేశారని వెల్లడించారు. శస్త్రచికిత్స అనంతరం బాధితుడు పూర్తిగా కోలుకున్నాడని, అతనికి ప్రాణాపాయం లేదని చెప్పారు.
ః గురువారం అర్ధరాత్రి వరకు శివమొగ్గ, భద్రావతి పరిధిలో 144వ సెక్షన్ను అమలులోకి తీసుకువచ్చారు. అవసరానికి అనుగుణంగా అదనపు భద్రత కావాలని ప్రభుత్వాన్ని కోరతామని జిల్లాధికారి సెల్వమణి తెలిపారు. జిల్లాలోని విద్యా సంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు. జిల్లాలో అన్ని మద్యం దుకాణాలను మంగళవారం మూయించారు. మద్యం విక్రయాలు జరగకుండా ఎక్సైజ్ శాఖ ఉప కమిషనర్ కెప్టెన్ అజిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రంగులరాట్నం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్కు కన్నడనాడు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల మధ్య ప్రచారం ఓ ఎత్తయితే నాలుగు రోజులుగా ప్రచారాస్త్రాలు కొత్త రంగు అద్దుకుంటున్నాయి. -
ఉపాధ్యాయిని అపహరణ
[ 24-04-2024]
హుబ్బళ్లిలోని ఒక పాఠశాలలో ఒప్పంద పద్ధతిలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్న అక్షత (24) అపహరణకు గురైంది. అఖండేశ్వర జాతరకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చిన ఆమె మళ్లీ వెనక్కు రాలేదు. -
బడుగుల బతుకు ధరాభారం
[ 24-04-2024]
దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలు నలిగి పోతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. -
కోలారు.. కోటి ఆశల తేరు!
[ 24-04-2024]
కోలారు (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాన్ని మరోసారి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు మునిగాళ్లపై నిలిచారు. నిన్నమొన్నటి అభిప్రాయభేదాలను పక్కనబెట్టి సీనియర్లు- జూనియర్లు ఒక్కటయ్యారు. -
ప్రజల ఆకాంక్షలకే పెద్దపీట
[ 24-04-2024]
రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో కీలక నేతల సందడి కొనసాగుతోంది. భాజపా తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రముఖులు అమిత్ షా, జేపీ నడ్డా రాకతో అభ్యర్థులు చివరి దశ ప్రచారాన్ని విజయవంతంగా ముగించే ప్రయత్నం చేస్తున్నారు. -
రాష్ట్రంలో అధికార దుర్వినియోగం: అశోక్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని దురుపయోగపరుస్తోందని విపక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అనుసరించవలసిన నిబంధనలను ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించిందని గుర్తు చేశారు. -
నేటితో ప్రచారం.. పరిసమాప్తం
[ 24-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికల కోసం జాతీయ నేతల ప్రచారం జోరందుకుంది. బుధవారంతో బహిరంగ ప్రచారానికి తెరపడనుండగా చివరి ప్రయత్నంగా జాతీయ పార్టీల నేతలు ప్రచార వేదికలపై ప్రసంగాలతో హోరెత్తించారు.