వర్ణరంజితం.. సాంస్కృతికోత్సవం
పంద్రాగస్టు సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి తాలూకా క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన విజయనగర వైభవ సాంస్కృతిక కార్యక్రమాలు రంజింపజేశాయి. బెంగళూరు నుంచి వచ్చిన స్థానిక కళాకారులు సంప్రదాయ నృత్యం, దేశభక్తి గేయాలతో అలరించారు.
విజయనగర వైభవ కార్యక్రమంలో దేశభక్తిపై నృత్యప్రదర్శన చేస్తున్న కళాకారులు
హొసపేటె, న్యూస్టుడే: పంద్రాగస్టు సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి తాలూకా క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన విజయనగర వైభవ సాంస్కృతిక కార్యక్రమాలు రంజింపజేశాయి. బెంగళూరు నుంచి వచ్చిన స్థానిక కళాకారులు సంప్రదాయ నృత్యం, దేశభక్తి గేయాలతో అలరించారు. మా తుజే సలామ్, వందే మాతరం గేయాల నృత్యంలో కళాకారులు ఆకట్టుకున్నారు. విజయనగర వైభవాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించటానికి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి ఆనంద్సింగ్ పేర్కొన్నారు. కార్యక్రమాలు విజయవంతానికి కృషి చేసిన పలువురిని ఆయన సన్మానించారు. హంపీ స్మారకాల ఛాయాచిత్రాలను తీసి, సామాజిక మాధ్యమాల ద్వారా దేశ, విదేశీయులకు పరిచయం చేస్తున్న హొసపేటె ఛాయాచిత్రకారుడు శివశంకర్ బణగార్ను సన్మానించారు. కార్యక్రమంలో పాలనాధికారి పి.అనిరుద్ధ్ శ్రవణ్, ఎస్పీ డాక్టర్ కె.అరుణ్, జిల్లా పంచాయతీ సీఈవో హర్షల్ బోయర్, తదితరులు పాల్గొన్నారు.
* వాల్మీకి మహిళ కళా సంస్థ నుంచి: వాల్మీకి మహిళ కళాసంస్థ, కన్నడ, సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా ఆదివారం రాత్రి తాలూకాలోని నాగేనే హళ్లిలో స్వాతంత్య్ర మహోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కళాకారులు మల్లికార్జున తురువనూరు, అంగడి వామదేవ, యల్లప్పనవర్, వసంత్కుమార్, రేణుకా, కావ్యాబాయిలనుంచి నృత్య, సంగీత, గేయాలాపన కార్యక్రమాలు జరిగాయి. సంస్థ అధ్యక్షురాలు అనురాధ, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రంగులరాట్నం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్కు కన్నడనాడు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల మధ్య ప్రచారం ఓ ఎత్తయితే నాలుగు రోజులుగా ప్రచారాస్త్రాలు కొత్త రంగు అద్దుకుంటున్నాయి. -
ఉపాధ్యాయిని అపహరణ
[ 24-04-2024]
హుబ్బళ్లిలోని ఒక పాఠశాలలో ఒప్పంద పద్ధతిలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్న అక్షత (24) అపహరణకు గురైంది. అఖండేశ్వర జాతరకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చిన ఆమె మళ్లీ వెనక్కు రాలేదు. -
బడుగుల బతుకు ధరాభారం
[ 24-04-2024]
దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలు నలిగి పోతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. -
కోలారు.. కోటి ఆశల తేరు!
[ 24-04-2024]
కోలారు (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాన్ని మరోసారి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు మునిగాళ్లపై నిలిచారు. నిన్నమొన్నటి అభిప్రాయభేదాలను పక్కనబెట్టి సీనియర్లు- జూనియర్లు ఒక్కటయ్యారు. -
ప్రజల ఆకాంక్షలకే పెద్దపీట
[ 24-04-2024]
రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో కీలక నేతల సందడి కొనసాగుతోంది. భాజపా తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రముఖులు అమిత్ షా, జేపీ నడ్డా రాకతో అభ్యర్థులు చివరి దశ ప్రచారాన్ని విజయవంతంగా ముగించే ప్రయత్నం చేస్తున్నారు. -
రాష్ట్రంలో అధికార దుర్వినియోగం: అశోక్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని దురుపయోగపరుస్తోందని విపక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అనుసరించవలసిన నిబంధనలను ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించిందని గుర్తు చేశారు. -
నేటితో ప్రచారం.. పరిసమాప్తం
[ 24-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికల కోసం జాతీయ నేతల ప్రచారం జోరందుకుంది. బుధవారంతో బహిరంగ ప్రచారానికి తెరపడనుండగా చివరి ప్రయత్నంగా జాతీయ పార్టీల నేతలు ప్రచార వేదికలపై ప్రసంగాలతో హోరెత్తించారు.