సిద్ధుకు చేదు అనుభవం
విపక్ష నేత సిద్ధరామయ్య కొడగు జిల్లా పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. ఆయనను మడికేరిలో భాజపా యువ మోర్చా కార్యకర్తలు గురువారం ఘెరావ్ చేశారు. కొడగు జిల్లా శివార్లలోని తితిమతిలో సిద్ధుకు నల్లజెండాలు చూపిస్తూ
భాజపా శ్రేణుల నిరసనలు వ్యక్తమైనా.. మడికేరికి చేరుకున్న సిద్ధుకు కాంగ్రెస్ కార్యకర్తల ఘనస్వాగతం
మడికేరి, న్యూస్టుడే : విపక్ష నేత సిద్ధరామయ్య కొడగు జిల్లా పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. ఆయనను మడికేరిలో భాజపా యువ మోర్చా కార్యకర్తలు గురువారం ఘెరావ్ చేశారు. కొడగు జిల్లా శివార్లలోని తితిమతిలో సిద్ధుకు నల్లజెండాలు చూపిస్తూ ‘గోబ్యాక్ సిద్ధు’ అంటూ నినాదాలు చేశారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు సిద్ధు వస్తున్నారని తెలుసుకున్న మోర్చా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. గతంలో వద్దని చెప్పినా వినకుండా ఆయన టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహించి, విద్వేషాలను రెచ్చగొట్టారని మోర్చా జిల్లాధ్యక్షుడు దర్శన్ జోయప్ప ధ్వజమెత్తారు. కొడగు ప్రజలు గోమాంసాన్ని తింటారని తన ఉపన్యాసాల్లో గతంలో సిద్ధు చేసిన విమర్శలను ఆయన గుర్తు చేశారు.
ఇప్పుడేం అవసరం?
మైసూరు: కొడగులో వర్షాలు నిలిచి పోయాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిర్వాసితుల కేంద్రాల్లోనూ ఎవరూ లేరు. ఇప్పుడు సిద్ధరాయయ్య కొడగు జిల్లా పర్యటనకు ఎందుకు వెళ్లారంటూ సహకార శాఖ మంత్రి ఎస్.టి.సోమశేఖర్ ప్రశ్నించారు. పరిస్థితులన్నీ చక్కబడిన పక్షం రోజులకు పర్యటనకు వెళ్లి రాజకీయాలు చేద్దామని ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మైసూరులో మంత్రి విలేకరులతో మాట్లాడారు. నోటికి ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం, తనపై విమర్శలు వస్తున్నప్పుడు మొహం చాటేయడం ఆయనకు అలవాటేనని విమర్శించారు.
సీటీ గరం
బెంగళూరు (మల్లేశ్వరం): ముస్లింలు ఉండే ప్రాంతంలో సావర్కర్ చిత్రాలు ఉన్న బ్యానర్లు కట్టకూడదని విపక్ష నాయకుడు సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సి.టి.రవి ఖండించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకంగా ఉన్నాయని చెప్పారు. అలా సమర్థించుకుంటూ వెళితే నేడు సావర్కర్ను, రేపు అంబేడ్కర్, గాంధీజీని కూడా విమర్శిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. తనను కలుసుకున్న విలేకరులతో ఆయన మాట్లాడారు. సిద్ధరామయ్య తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే బాగుంటుందని హితవు పలికారు. సావర్కర్ స్వాతంత్య్ర సమరయోధుడా? కాదా? అని ప్రమాణపత్రాలు ఇవ్వవలసిన అవసరం ఏమీ లేదన్నారు. క్లబ్ హౌస్లో పాకిస్తాన్కు మద్దతుగా నినాదాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామనగరలో శివశక్తి ప్రదర్శన
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ఘట్టం గురువారం ప్రారంభమైన నేపథ్యంలో శక్తి ప్రదర్శనకు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రామనగర పట్టణాన్ని వేదికగా మలుచుకున్నారు. కాంగ్రెస్ తరఫున బెంగళూరు గ్రామీణ అభ్యర్థిగా సోదరుడు డీకే సురేశ్ -
పేలుడు కేసులో నిందితుడి అరెస్టు
[ 29-03-2024]
బ్రూక్ఫీల్డ్ పరిధి రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు నిందితుడు ముజామిల్ షరీఫ్ను అరెస్టు చేశామని జాతీయ తనిఖీ దళం గురువారం రాత్రి ప్రకటించింది. -
గెలిచాకే మోదీని కలుస్తా: ఈశ్వరప్ప
[ 29-03-2024]
శివమొగ్గ లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప తన సొంత కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. -
నాకు ప్రాణాపాయం
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల వేళ తనను అంతం చేసేందుకు కొందరు భాజపా నాయకులు కంకణం కట్టుకున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. -
ఐదుగురు కుమార్తెలతో తల్లి ఆత్మహత్యాయత్నం
[ 29-03-2024]
భర్త గోపాల్ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. -
యాప్ల తోడుగా ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా!
[ 29-03-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను సజావుగా, సులువుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక యాప్లను సిద్ధం చేసింది. ఈ యాప్లు ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా తెలిపారు. -
కఠోర శ్రమతో సులువుగా లక్ష్య సాధన
[ 29-03-2024]
నవోదయ రీగెల్-24 వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గురువారం రాత్రి నవోదయ స్టేడియంలో మూడు రోజుల కార్యక్రమాలను రాయచూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ హనుమంతప్ప జ్యోతి వెలిగించి ప్రారంభించారు. -
ప్రగతిని తుంగలో తొక్కిన భాజపా
[ 29-03-2024]
బెంగళూరు గ్రామీణ లోక్సభ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి హస్తినలో మీ స్వరాన్ని వినిపించేందుకు డీకే సురేశ్ను మరోసారి గెలిపించాలని ప్రజలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. ఇక్కడి ప్రజల సమస్యలకు మొదటి నుంచి ఆయన స్పందిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. -
మరింత పడిపోయిన విద్యుదుత్పాదన
[ 29-03-2024]
రాష్ట్రంలోని శాఖోత్పన్న విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పాదన సగానికి పతనమైంది. గురువారం సాయంత్రం 4.24 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం. -
లాడ్జిలో దంపతుల ఆత్మహత్య
[ 29-03-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు