సిద్ధును భాజపాలోకి ఆహ్వానిస్తా
మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత సిద్ధరామయ్య సొంత పార్టీలోనే కష్టాలు అనుభవిస్తున్నారు. మా పార్టీలోకి ఆహ్వానించి వెనకబడిన వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకొని రావడానికి ఆయనతో మాట్లాడతాను. దీనికి వేర్వేరు అర్థాలు
మంత్రి శ్రీరాములు వెల్లడి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బి.శ్రీరాములు, చిత్రంలో శాసనసభ్యుడు తదితరులు
బళ్లారి, న్యూస్టుడే: మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత సిద్ధరామయ్య సొంత పార్టీలోనే కష్టాలు అనుభవిస్తున్నారు. మా పార్టీలోకి ఆహ్వానించి వెనకబడిన వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకొని రావడానికి ఆయనతో మాట్లాడతాను. దీనికి వేర్వేరు అర్థాలు సృష్టించే అవసరం లేదని రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమ శాఖ, జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు స్పష్టం చేశారు. నగరంలో గురువారం అభివృద్ధి పనుల్లో పాల్గొన్న మంత్రి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో డి.కె.శివకుమార్, ఇతర నేతల నుంచి ఇబ్బందులు పడుతున్న కారణంతోనే సిద్ధరామయ్యను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంపై రాష్ట్ర అధ్యక్షుడికి ఏమి చెప్పాలో చెప్పడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడియూరప్ప పార్టీలో బలమైన నేత..పార్టీ, రాష్ట్ర ప్రజలకు జీవితం త్యాగం చేశారు. మొదటి నుంచి యడియూరప్ప, కె.ఎస్.ఈశ్వరప్ప పార్టీని బలపరచడానికి శ్రమించారు. నాకు ఈ స్థానం లభించడానికి యడియూరప్ప కారణమన్నారు. ప్రస్తుతం బి.ఎస్.యడియూరప్పకు కేంద్రంలో ఉన్నత స్థానం కల్పించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ, కార్యకర్తలకు ఏనుగంత బలం వచ్చింది. రెండు స్థానాల నుంచి 120 స్థానాలను గెలిపించారని గుర్తు చేశారు.విధానసభ ఎన్నికల్లో సామూహిక నాయకత్వంలో బి.ఎస్.యడియూరప్ప, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై మార్గదర్శనంలో ఎన్నికలను ఎదుర్కొంటామన్నారు. సమావేశంలో శాసనసభ్యుడు గాలి సోమశేఖర్రెడ్డి, బుడా అధ్యక్షుడు పి.పాలన్న, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దక్షిణాదిపైనే కమలదండు గురి
[ 20-04-2024]
సీనియర్ల పోటీ మధ్య రాష్ట్ర భాజపా అధ్యక్ష పగ్గాలు దక్కించుకున్న యువ నేత బి.వై.విజయేంద్ర సారథ్యంలో తొలిసారిగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. -
నటి హర్షికపై దాడి
[ 20-04-2024]
పులకేశినగరలో తన భర్త భువన్తో కలిసి వెళుతున్న సమయంలో కొందరు దుండగులు తమపై దాడి చేసి, తన గొలుసు దోచుకునేందుకు ప్రయత్నించారని పులకేశినగర ఠాణాలో నటి హర్షిక పుణచ్చ ఫిర్యాదు చేశారు. -
ప్రేమ పేరుతో రక్తపుటేరులా?
[ 20-04-2024]
కర్ణాటకలో లవ్ జిహాద్ ఘటనలు ఎక్కువవుతున్నాయంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది. -
అగ్రనేతల గడ్డపై ఎవరిదో విజయం?
[ 20-04-2024]
బళ్లారి లోక్సభ నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, భాజపా నుంచి ఫైర్బ్రాండ్గా ప్రత్యేక గుర్తింపు పొందిన దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ బరిలో నిలిచారు. -
ప్రధాని ప్రాభవమే శోభకు శ్రీరామరక్ష
[ 20-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ నియోజకవర్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం సందర్శించనున్న నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం మార్పులకు నోచుకుంటుందని, కమలనాథులకు విజయం చేరువవుతుందనే అంచనాలు తెరపైకి వచ్చాయి. -
కాంగ్రెస్లోకి మాలికయ్య గుత్తేదార్
[ 20-04-2024]
మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్, కుమటా మాజీ ఎమ్మెల్యే శారదా మోహన్శెట్టి తదితరులు శుక్రవారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
గదగలో నలుగురి దారుణ హత్య
[ 20-04-2024]
గదగ పట్టణంలోని చెన్నమ్మ కూడలి సమీపాన దాసర వీధిలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. -
నకిలీ పత్రాలతో నిలువుదోపిడీ
[ 20-04-2024]
ఒకే ఇంటి స్థలానికి లెక్కలేనన్ని నకిలీ పత్రాలు సిద్ధం చేసి వాటిని 22 బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.10 కోట్లకు పైగా రుణాన్ని తీసుకున్న ఆరుగురు వంచకులను బెంగళూరు జయనగర ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా