ఉన్నత విద్యవైపు అడుగేయాలి
వృత్తి విద్య (పాలిటెక్నిక్) కోర్సులు పూర్తి చేసి బయటకు వెళ్తున్న విద్యార్థులు..ఉన్నత చదువులవైపు అడుగులు చేయాలని బళ్లారి విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా.సి.శంకరగౌడ పాటీల్ సూచించారు. బళ్లారి
డిగ్రీ పట్టాలు పొందడానికి సిద్ధంగా ఉన్న విద్యార్థులు
బళ్లారి, న్యూస్టుడే: వృత్తి విద్య (పాలిటెక్నిక్) కోర్సులు పూర్తి చేసి బయటకు వెళ్తున్న విద్యార్థులు..ఉన్నత చదువులవైపు అడుగులు చేయాలని బళ్లారి విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా.సి.శంకరగౌడ పాటీల్ సూచించారు. బళ్లారి నగరం కంటోన్మెంట్ ప్రాంతంలోని హనగల్ శ్రీ కుమారేశ్వర పాలిటెక్నిక్ తాంత్రిక విద్యాలయంలో గురువారం గ్రాడ్యుయేషన్ డేను రిజిస్ట్రార్ ప్రారంభించారు. కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఎంత ఎత్తుకు ఎదిగినా..తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలన్నారు. ఉద్యోగంలో స్థిరపడే భావన కంటే..ఉద్యోగాలు సృష్టించే స్థాయికి చేరుకోవాలన్నారు. విమ్స్ బాధ్య సంచాలకుడు డా.గంగాధరగౌడ మాట్లాడుతూ తాను వీరశైవ విద్యావర్ధక సంఘం విద్యా సంస్థల్లో కన్నడ మాధ్యమంలో చదివి ఈ స్థాయికి చేరుకున్నట్లు వివరించారు. నేర్చుకోవడానికి భాష ముఖ్యం కాదు..మనసు ముఖ్యమన్నారు. ప్రతి విద్యార్థి ప్రాథమిక దశ నుంచే అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి శ్రమించాలి. అప్పుడే జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులు సంతోషంగా ఉంటారని తెలిపారు. వి.వి.సంఘం కార్యదర్శి బి.వి.బసవరాజ్, కళాశాల అధ్యక్షుడు కిరణ్కుమార్ మాట్లాడారు. అనంతరం తాంత్రిక విద్యా పూర్తి చేసిన విద్యార్థులకు ప్రమాణ పత్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ప్రధాన ఆచార్యులు టి.ఎం.వీరగంగాధరస్వామి, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
మాట్లాడుతున్న బళ్లారి వీఎస్కేయూ రిజిస్ట్రార్ డా.సి.శంకరగౌడ పాటీల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
బర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె