చందన సీమలో నవరంగ తరంగాలు
కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా కళ తప్పిన విఖ్యాత దసరా ఉత్సవాలు ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దసరా ఢంకానాదం మార్మోగనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా సంబర సన్నాహాలు
మైసూరు కూడళ్లకు విద్యుల్లతల సోయగం
మైసూరు, న్యూస్టుడే : కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా కళ తప్పిన విఖ్యాత దసరా ఉత్సవాలు ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దసరా ఢంకానాదం మార్మోగనుంది. యువ దసరా, క్రీడా దసరా కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. లలితకళలు, పుస్తక మేళా, కవిగోష్ఠి, పుష్ప ప్రదర్శనలు, హస్తకళా ఉత్పత్తుల ప్రదర్శన, బొమ్మల కొలువు, యోగా కార్యక్రమాలు, సాంస్కృతిక ఉత్సవాలు.. చివరిగా జంబూసవారి, కాగడాల ప్రదర్శనకు రాచనగరి సాక్ష్యంగా నిలువనుంది. నవరాత్రులకు రాచనగరి సర్వాంగ సుందరంగా సింగరించుకుంది. విద్యుద్దీపాల శోభతో నగరంలో సంబరాలు మొదలయ్యాయి. మడికేరి, మంగళూరులకూ పండుగ కళ వచ్చింది. మడికేరిలో రాత్రి పది గంటల వరకు వేడుకలను నిర్వహించుకునేందుకు కొడగు జిల్లా పాలన యంత్రాంతం అనుమతించింది. స్పీకర్లు, డీజేలు లేకుండా రిసార్టుల్లో అర్థరాత్రి వరకు వేడుకలకు అనుమతించామని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ప్రకటించారు. మంగళూరులో కద్రి మంజునాథ స్వామి, కుద్రోళిలో నవరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా కొనసాగిస్తారు. యక్షగాన ప్రదర్శనలు, పులి వేషాలకు కళాకారులు అభ్యాసాన్ని ప్రారంభించారు. విజయనగర రాజులకు సామంతులుగా ఉన్న మైసూరు రాజులు మొదటి నుంచి దసరా ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. భారతదేశంలో రాజ్యాలు విలీనమైనా.. రాజవంశస్తుల సమక్షంలోనే ఉత్సవాల నిర్వహణ కొనసాగుతోంది. మహారాష్ట్రలోని దేవగిరిలో తయారు చేయించిన 750 కిలోల బంగారు అంబారీకి ఎనిమిది శతాబ్దాల చరిత్ర ఉంది. కంపిల, విజయనగర సామ్రాజ్యాలను దాటి నాలుగు దశాబ్దాల కిందట అది మైసూరుకు చేరుకుంది. ఇప్పటికీ అదే అంబారీలో చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవ మూర్తితో జంబూ సవారీని నిర్వహిస్తున్నారు. మొదటిసారిగా మైసూరు యదువంశానికి చెందిన తొమ్మిదో రాజు రాజా ఒడయరు 1610లో దసరా ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన పలు వివరాలను ఇటలీ, మిడిల్ ఈస్ట్, పోర్చుగీసు, రష్యా, ఫ్రాన్సు తదితర దేశాల నుంచి వచ్చిన పర్యాటకులు, వ్యాపారులు తమ రచనల్లో పొందుపరచడం ప్రస్తావనార్హం. విజయనగర రాజులు ఆచరించిన దసరా ఉత్సవాలకు కొన్ని మార్పులు చేసి రాచనగరిలో సంబరాలు కొనసాగించారు. అప్పటి నుంచి ఉత్సవాల్లో మార్పు లేకుండా నాడ దేవత చాముండేశ్వరిని కొలుస్తూ వస్తున్నారు. నిమిషాంబ దేవి, చాముండేశ్వరిలకు పూజలు, బంగారు సింహాసనంపై కూర్చుని రాజ ప్రతినిధి ప్రైవేటు దర్బార్ నిర్వహణతో పాటు వివిధ రకాల పోటీలను నిర్వహిస్తూ వస్తున్నారు. మొదటిసారిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఏడాది ఉత్సవాలను ప్రారంభించనున్నారు. వరుసగా సెలవలు ఉండడంతో పలు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు పెద్ద సంఖ్యలో రాచనగరికి చేరుకుంటున్నారు.
గజరాజుల వైభవం.. మైసూరుకు తలమానికం
మైసూరు రాజమాత ప్రమోదాదేవికి ‘దసరా వేడుకలకు ఆహ్వానం’
పలుకుతున్న మంత్రి ఎస్.టి.సోమశేఖర్ తదితరులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్