అన్నదాతకు చేదోడు : బొమ్మై
తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించని అన్నదాతల పొలాలు, ఆస్తులను బ్యాంకులు జప్తు చేయకుండా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తెలిపారు. దీనికి అనుగుణంగా త్వరలో చట్టంలో సవరణ తీసుకు వస్తామని వెల్లడించారు.
వేదికపై శివమూర్తిస్వామీజీ, బసవరాజ బొమ్మై, యడియూరప్ప
బెంగళూరు (గ్రామీణం), న్యూస్టుడే : తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించని అన్నదాతల పొలాలు, ఆస్తులను బ్యాంకులు జప్తు చేయకుండా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తెలిపారు. దీనికి అనుగుణంగా త్వరలో చట్టంలో సవరణ తీసుకు వస్తామని వెల్లడించారు. చిత్రదుర్గలోని సిరిగెరె తరళుబాళు మఠంలో శివకుమార శివాచార్య మహాస్వామి 30వ వర్ధంతి నేపథ్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతు బిడ్డల కోసం రూపొందించిన విద్యా నిధి పథకాన్ని 14 లక్షల మంది విద్యార్థులు అందుకున్నారని చెప్పారు. అతివృష్టి, అనావృష్టి, పంట నష్టంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పారు. ఈ ఏడాది చక్కని వర్షాలతో అన్ని చెరువులూ నిండాయని, వచ్చే మూడేళ్ల పాటు భూగర్భ జలాలు వృద్ధి చెంది, చక్కని ఫలసాయం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎగువ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం పలికితే తక్షణమే రూ.14 వేల కోట్లు కర్ణాటకకు విడుదల అవుతాయని తెలిపారు. సమాజం గురువు వైపు చూస్తుండగా, ప్రభుత్వం సమాజం వైపు చూస్తుందని చెప్పారు. గురువుల మార్గదర్శనం అన్ని సందర్భాల్లో అవసరమని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ఫ మఠాధిపతి శివమూర్తి శివాచార్య స్వామి, మంత్రి మాధుస్వామి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖËర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!