యువ వేదిక సిద్ధం
మహారాజ కళాశాలలో మంగళవారం నుంచి అక్టోబరు మూడో తేదీ వరకు యువ దసరా వేడుకల కోసం ప్రత్యేక వేదిక నిర్మాణం పూర్తయింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్.టి.సోమశేఖర్, ప్రముఖ నటుడు కిచ్చ సుదీప్ ఈ యువ దసరా వేడుకలు
మానస గంగోత్రి వేదికపై శుక్రవారం రాత్రి కొనసాగిన యువ సంభ్రమ ప్రదర్శనలు
మైసూరు, న్యూస్టుడే : మహారాజ కళాశాలలో మంగళవారం నుంచి అక్టోబరు మూడో తేదీ వరకు యువ దసరా వేడుకల కోసం ప్రత్యేక వేదిక నిర్మాణం పూర్తయింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్.టి.సోమశేఖర్, ప్రముఖ నటుడు కిచ్చ సుదీప్ ఈ యువ దసరా వేడుకలు ప్రారంభించనున్నారు. దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్కు నివాళిగా బుధవారం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తామని యువ దసరా ఉప సమితి ప్రత్యేక అధికారి ఆర్.చేతన్ తెలిపారు. కళాకారుడు శ్రీధర్ జైన్, గాయకులు రఘు దీక్షిత్, మంగ్లి తదితరుల ప్రదర్శనలు మొదటి రోజు ఉంటాయని వెల్లడించారు. సెప్టెంబరు 29న లేజర్ షో, సిగ్నేచర్ గ్రూప్ డ్యాన్స్, కన్నికా కపూర్, అసెంట్ బృందాల కార్యక్రమంలో, సెప్టెంబరు 30న స్యాండల్వుడ్ నైట్ కార్యక్రమం ఉంటుందని ఆయన వివరించారు. అక్టోబరు ఒకటిన గాయని శమిత మత్నాడ్, 2వ తేదీన పవన్ డ్యాన్సర్, నటులు హర్షిక పుణచ్చ, విజయ రాఘవేంద్ర, అమిత్ త్రివేది, చివరి రోజు సుప్రియా రామ్ మహిళా బ్యాండ్ బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు, చివరిగా ఫ్యాషన్ షో ఉంటుందని చేతన్ వెల్లడించారు. వారం రోజులుగా యువ సంభ్రమ వేడుకలను మానసగంగోత్రి ప్రాంగణంలో కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దక్షిణాదిపైనే కమలదండు గురి
[ 20-04-2024]
సీనియర్ల పోటీ మధ్య రాష్ట్ర భాజపా అధ్యక్ష పగ్గాలు దక్కించుకున్న యువ నేత బి.వై.విజయేంద్ర సారథ్యంలో తొలిసారిగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. -
నటి హర్షికపై దాడి
[ 20-04-2024]
పులకేశినగరలో తన భర్త భువన్తో కలిసి వెళుతున్న సమయంలో కొందరు దుండగులు తమపై దాడి చేసి, తన గొలుసు దోచుకునేందుకు ప్రయత్నించారని పులకేశినగర ఠాణాలో నటి హర్షిక పుణచ్చ ఫిర్యాదు చేశారు. -
ప్రేమ పేరుతో రక్తపుటేరులా?
[ 20-04-2024]
కర్ణాటకలో లవ్ జిహాద్ ఘటనలు ఎక్కువవుతున్నాయంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది. -
అగ్రనేతల గడ్డపై ఎవరిదో విజయం?
[ 20-04-2024]
బళ్లారి లోక్సభ నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, భాజపా నుంచి ఫైర్బ్రాండ్గా ప్రత్యేక గుర్తింపు పొందిన దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ బరిలో నిలిచారు. -
ప్రధాని ప్రాభవమే శోభకు శ్రీరామరక్ష
[ 20-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ నియోజకవర్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం సందర్శించనున్న నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం మార్పులకు నోచుకుంటుందని, కమలనాథులకు విజయం చేరువవుతుందనే అంచనాలు తెరపైకి వచ్చాయి. -
కాంగ్రెస్లోకి మాలికయ్య గుత్తేదార్
[ 20-04-2024]
మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్, కుమటా మాజీ ఎమ్మెల్యే శారదా మోహన్శెట్టి తదితరులు శుక్రవారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
గదగలో నలుగురి దారుణ హత్య
[ 20-04-2024]
గదగ పట్టణంలోని చెన్నమ్మ కూడలి సమీపాన దాసర వీధిలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. -
నకిలీ పత్రాలతో నిలువుదోపిడీ
[ 20-04-2024]
ఒకే ఇంటి స్థలానికి లెక్కలేనన్ని నకిలీ పత్రాలు సిద్ధం చేసి వాటిని 22 బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.10 కోట్లకు పైగా రుణాన్ని తీసుకున్న ఆరుగురు వంచకులను బెంగళూరు జయనగర ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.