రైతులు, మహిళల రుణాల మాఫీకి డిమాండు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఐ నేతృత్వంలో శనివారం బళ్లారి నగరంలో ఆందోళన నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సత్యబాబు, రాష్ట్ర సమితి సభ్యులు గురుశాంత్, చంద్రకుమారి నేతృత్వంలో
డీసీ కార్యాలయం ముందు ఆందోళనలో పాల్గొన్న కార్యకర్తలు
బళ్లారి, న్యూస్టుడే : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఐ నేతృత్వంలో శనివారం బళ్లారి నగరంలో ఆందోళన నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సత్యబాబు, రాష్ట్ర సమితి సభ్యులు గురుశాంత్, చంద్రకుమారి నేతృత్వంలో స్థానిక గడిగి చెన్నప్ప కూడలి నుంచి డీసీ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. డీసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సత్యబాబు, గురుశాంత్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, వ్యవసాయ కూలీలు, దళితులు, మహిళలు తీసుకున్న బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని, కేరళలో మాదిరిగా రాష్ట్రంలోనూ రుణ రహితం చేయాలన్నారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలని, ప్రభుత్వాలు కొత్తగా తీసుకొచ్చిన విద్యుత్తు చట్టం, భూస్వాధీన చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండు చేశారు. పేదలు, కార్మికులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ఏళ్ల తరబడి ప్రభుత్వం, అటవీశాఖ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు సాగు పట్టాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల ఏర్పాటుకు తీసుకున్న భూముల్లో వాటిని స్థాపించాలని, పరిశ్రమలు స్థాపించే వరకూ భూములను కోల్పోయిన రైతు కుటుంబాలకు నెలకు రూ.20 వేల ఆర్థిక సహాయం చేయాలని, నిత్యావసర, చమురు, వంట గ్యాస్ తదితర ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో తాలూకా సమితి కార్యదర్శులు తిప్పయ్య, గాళి బసవరాజ్, సభ్యులు శివశంకర్, ఎ.స్వామి, ఓబలేశప్ప, దుర్గమ్మ, ఈరమ్మ, తరంగణి, రుద్రమ్మ, మహమ్మద్ఖాన్, చెన్న బసయ్య, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటి హర్షికపై దాడి
[ 20-04-2024]
పులకేశినగరలో తన భర్త భువన్తో కలిసి వెళుతున్న సమయంలో కొందరు దుండగులు తమపై దాడి చేసి, తన గొలుసు దోచుకునేందుకు ప్రయత్నించారని పులకేశినగర ఠాణాలో నటి హర్షిక పుణచ్చ ఫిర్యాదు చేశారు. -
దక్షిణాదిపైనే కమలదండు గురి
[ 20-04-2024]
సీనియర్ల పోటీ మధ్య రాష్ట్ర భాజపా అధ్యక్ష పగ్గాలు దక్కించుకున్న యువ నేత బి.వై.విజయేంద్ర సారథ్యంలో తొలిసారిగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. -
ప్రేమ పేరుతో రక్తపుటేరులా?
[ 20-04-2024]
కర్ణాటకలో లవ్ జిహాద్ ఘటనలు ఎక్కువవుతున్నాయంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది. -
అగ్రనేతల గడ్డపై ఎవరిదో విజయం?
[ 20-04-2024]
బళ్లారి లోక్సభ నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, భాజపా నుంచి ఫైర్బ్రాండ్గా ప్రత్యేక గుర్తింపు పొందిన దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ బరిలో నిలిచారు. -
బెంగళూరు ఉత్తరలో ప్రధాని ప్రాభవమే శోభకు శ్రీరామరక్ష
[ 20-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ నియోజకవర్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం సందర్శించనున్న నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం మార్పులకు నోచుకుంటుందని, కమలనాథులకు విజయం చేరువవుతుందనే అంచనాలు తెరపైకి వచ్చాయి. -
కాంగ్రెస్లోకి మాలికయ్య గుత్తేదార్
[ 20-04-2024]
మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్, కుమటా మాజీ ఎమ్మెల్యే శారదా మోహన్శెట్టి తదితరులు శుక్రవారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
గదగలో నలుగురి దారుణ హత్య
[ 20-04-2024]
గదగ పట్టణంలోని చెన్నమ్మ కూడలి సమీపాన దాసర వీధిలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. -
నకిలీ పత్రాలతో నిలువుదోపిడీ
[ 20-04-2024]
ఒకే ఇంటి స్థలానికి లెక్కలేనన్ని నకిలీ పత్రాలు సిద్ధం చేసి వాటిని 22 బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.10 కోట్లకు పైగా రుణాన్ని తీసుకున్న ఆరుగురు వంచకులను బెంగళూరు జయనగర ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే