ప్రాణదాతకు.. సాంకేతిక బ్రేకు
రాష్ట్ర వ్యాప్తంగా 108 అంబులెన్సు సేవలు ఆదివారం నిలిచి పోయాయి. పేదలను ఆసుపత్రులకు ఉచితంగా తీసుకు వెళ్లే అంబులెన్సు సేవలను పునరుద్ధరణకు ఒప్పందం...
నిలిచిన 108 సేవలు
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే: రాష్ట్ర వ్యాప్తంగా 108 అంబులెన్సు సేవలు ఆదివారం నిలిచి పోయాయి. పేదలను ఆసుపత్రులకు ఉచితంగా తీసుకు వెళ్లే అంబులెన్సు సేవలను పునరుద్ధరణకు ఒప్పందం చేసుకున్న సంస్థ చర్యలు చేపట్టిందని ఆరోగ్య శాఖ మంత్రి డా.కె.సుధాకర్ తెలిపారు. అంబులెన్సుల నిర్వహణలోని మదర్బోర్డు సాఫ్ట్వేర్లో లోపాలతో ఈ సమస్య ఎదురైందన్నారు. తుమకూరు జిల్లా మధుగిరి తాలూకా ఐడిహళ్లిలో సకాలంలో అంబులెన్సు దొరక్క పోవడంతో జయమ్మ (65) అనే మహిళ మరణించింది. ఉచిత అంబులెన్సు కోసం సహాయవాణి నంబరు 108కు ఫోన్ చేసిన రెండు నిమిషాల్లోగా అంబులెన్సును పంపించేందుకు ఆపరేటర్ లైన్లోకి వచ్చేవారు. ఇప్పుడు ఒక్కో కాల్ను ఆపరేటర్కు కనెక్ట్ చేసేందుకు కనీసం 8-10 నిమిషాల సమయం తీసుకుంటోంది. నిత్యం ఎనిమిదివేల కాల్స్ను స్వీకరించవలసి ఉండగా, ప్రస్తుతం రెండు వేల కాల్స్ను మాత్రమే తీసుకోగలుగుతున్నారు. ఉచిత సేవలు అందుబాటులో లేకపోవడంతో ఆయా ఆసుపత్రులకు చెందిన అంబులెన్సులను రోగుల కుటుంబ సభ్యులు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 108 కింద 850 అంబులెన్సులు ఉన్నాయి. ఈ సేవలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించే వరకు 104 సేవలు, ప్రైవేటు ఆసుపత్రులు నామమాత్రపు ధరల్లో అంబులెన్సులను అందించాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రంగులరాట్నం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్కు కన్నడనాడు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల మధ్య ప్రచారం ఓ ఎత్తయితే నాలుగు రోజులుగా ప్రచారాస్త్రాలు కొత్త రంగు అద్దుకుంటున్నాయి. -
ఉపాధ్యాయిని అపహరణ
[ 24-04-2024]
హుబ్బళ్లిలోని ఒక పాఠశాలలో ఒప్పంద పద్ధతిలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్న అక్షత (24) అపహరణకు గురైంది. అఖండేశ్వర జాతరకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చిన ఆమె మళ్లీ వెనక్కు రాలేదు. -
బడుగుల బతుకు ధరాభారం
[ 24-04-2024]
దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలు నలిగి పోతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. -
కోలారు.. కోటి ఆశల తేరు!
[ 24-04-2024]
కోలారు (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాన్ని మరోసారి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు మునిగాళ్లపై నిలిచారు. నిన్నమొన్నటి అభిప్రాయభేదాలను పక్కనబెట్టి సీనియర్లు- జూనియర్లు ఒక్కటయ్యారు. -
ప్రజల ఆకాంక్షలకే పెద్దపీట
[ 24-04-2024]
రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో కీలక నేతల సందడి కొనసాగుతోంది. భాజపా తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రముఖులు అమిత్ షా, జేపీ నడ్డా రాకతో అభ్యర్థులు చివరి దశ ప్రచారాన్ని విజయవంతంగా ముగించే ప్రయత్నం చేస్తున్నారు. -
రాష్ట్రంలో అధికార దుర్వినియోగం: అశోక్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని దురుపయోగపరుస్తోందని విపక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అనుసరించవలసిన నిబంధనలను ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించిందని గుర్తు చేశారు. -
నేటితో ప్రచారం.. పరిసమాప్తం
[ 24-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికల కోసం జాతీయ నేతల ప్రచారం జోరందుకుంది. బుధవారంతో బహిరంగ ప్రచారానికి తెరపడనుండగా చివరి ప్రయత్నంగా జాతీయ పార్టీల నేతలు ప్రచార వేదికలపై ప్రసంగాలతో హోరెత్తించారు.