మాతంగి కొండ అభివృద్ధికి కృషి
ప్రసిద్ధి చెందిన హంపీలోని మాతంగ కొండ అభివృద్ధికి తనవంతు శాయశక్తులా కృషి చేస్తానని పర్యాటక శాఖ మంత్రి ఆనంద్సింగ్ పేర్కొన్నారు. మాతంగ కొండ అభివృద్ధి సమితి
మాతంగి మహాయజ్ఞ కుండానికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న మంత్రి ఆనంద్సింగ్
హొసపేటె, న్యూస్టుడే : ప్రసిద్ధి చెందిన హంపీలోని మాతంగ కొండ అభివృద్ధికి తనవంతు శాయశక్తులా కృషి చేస్తానని పర్యాటక శాఖ మంత్రి ఆనంద్సింగ్ పేర్కొన్నారు. మాతంగ కొండ అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో ఆదివారం హంపీలోని మాతంగ కొండలో ఏర్పాటు చేసిన మహాయజ్ఞ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం మాతంగ కొండ ఎక్కేందుకు మెట్లు పూర్తిగా శిథిలమయ్యాయి. వాటి పునర్నిర్మాణానికి రూ.6.5 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అంజనాద్రి కొండపైన ఉన్నంత శ్రద్ధ మాతంగ కొండపైన లేదని వస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. హంపీలో చిన్న ఇటుక పెట్టాలన్నా యునెస్కో, ప్రాధికారం, పురావస్తు శాఖల ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో మాతంగ కొండ అందానికి ఎలాంటి విఘాతం కలగకుండా మెట్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఈ కొండ ఎక్కేందుకు ఎంతో ఉత్సాహం చూపుతున్నారన్నారు. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రల నుంచి వచ్చిన భక్తులు, విదేశీయులు అష్టకష్టాలు పడి కొండెక్కి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నామన్నారు. ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండబోవని అన్నారు. అన్ని నియమాలు పాటిస్తూనే కొండ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. మహాయజ్ఞానికి ముందు విరూపాక్ష ఆలయం నుంచి మాతంగ కొండవరకు అమ్మవారి ఉత్సవ మూర్తి ఊరేగింపు జరిగింది. కలశ, కుంభాలతో మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రముఖులు వీరస్వామి, బసవరాజ్, రాజశేఖర్ హిట్నాళు, భరత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కలశ, కుంభాలతో హంపీ విరుపాక్ష వీధిలో మహిళల ఊరేగింపు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోలారు బాటలో కల్లోలం
[ 28-03-2024]
రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. అనూహ్యంగా ఎదురైన ఆ ఘట్టం అధికార కాంగ్రెస్ పార్టీని కుదిపేసింది. ఇలాంటి వ్యవహారమే మునుపు.. 2019 జులై 5వ తేదీన తలెత్తింది. -
చిత్రదుర్గ బరిలో కారజోళ!
[ 28-03-2024]
రాష్ట్రం నుంచి లోక్సభకు పోటీ చేసే పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితాను భాజపా వెల్లడించింది. -
అక్రమార్కుల నివాసాలపై దాడులు
[ 28-03-2024]
ఆదాయంతో పొంతన లేని ఆర్జన కలిగి ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల నివాసాలు, కార్యాలయాలపై లోకాయుక్త అధికారులు బుధవారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. -
వికసిత భారత్ సాధనే లక్ష్యం
[ 28-03-2024]
దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి గద్దెనెక్కాలని కోరుకుంటున్నారని భాజపా రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర పేరొన్నారు. -
హృదయం లేని మోదీ
[ 28-03-2024]
కర్ణాటకలో ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంటామన్న భయంతోనే భాజపా- జనతాదళ్ పొత్తు కుదుర్చుకున్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. -
ఉత్కంఠంగా విద్యావర్ధక సంఘం ఎన్నికలు
[ 28-03-2024]
వీరశైవ విద్యావర్ధక సంఘం నూతన అధ్యక్షుడిగా అల్లం గురుబసవరాజ్, కార్యదర్శిగా అరవింద్ పాటీల్లు నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికయ్యారు. -
అక్రమ తరలింపులపై దాడులు
[ 28-03-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికల నియమావళి ప్రవర్తన ఉల్లంఘించి అక్రమంగా మద్యం నిల్వ చేసిన ఇంటిపై, రవాణా చేస్తున్న వారి నుంచి రూ.3.52 లక్షలు విలువ చేసే 842.72 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా తెలిపారు. -
తిప్పేరుద్రస్వామి తిరునాలకు పోటెత్తిన భక్తులు
[ 28-03-2024]
రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన నాయకనహట్టి తిప్పేరుద్రస్వామి తిరునాళ్లకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించారు. -
ఎన్ఐఏ విస్తృత దాడులు
[ 28-03-2024]
రాజధాని నగరంలోని బ్రూక్ఫీల్డ్ రామేశ్వరం కేఫ్లో పేలుడు దర్యాప్తులో భాగంగా శివమొగ్గ, బెంగళూరు, తీర్థహళ్లి, హుబ్బళ్లి, చెన్నైలలో బుధవారం ఏకకాలంలో జాతీయ దర్యాప్తు దళం (ఎన్ఐఏ) అధికారులు దాడులు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్