మోదీ అడుగిడితే ఓటమే: సిద్ధు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్కడ పర్యటిస్తే.. ఆ ప్రాంతంలో భాజపా నేతలు ఓటమి మూటగట్టుకుంటారని విపక్ష కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. ‘డర్టీ పాలిటిక్స్’ చేయడం సంఘపరివార నేతలకు అలవాటేనని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పోరాటాలతో స్వాతంత్య్రాన్ని తీసుకువస్తే.. సమాజంలో చీలికలు
చెరువు గట్టున వాయనం సమర్పిస్తున్న సిద్ధరామయ్య
మైసూరు, న్యూస్టుడే : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్కడ పర్యటిస్తే.. ఆ ప్రాంతంలో భాజపా నేతలు ఓటమి మూటగట్టుకుంటారని విపక్ష కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. ‘డర్టీ పాలిటిక్స్’ చేయడం సంఘపరివార నేతలకు అలవాటేనని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పోరాటాలతో స్వాతంత్య్రాన్ని తీసుకువస్తే.. సమాజంలో చీలికలు తీసుకు వచ్చి భాజపా రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. తన కుమారుడు యతీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ నియోజకవర్గం చిక్కహొమ్మ గ్రామంలోని చెరువు గట్టున సోమవారం సిద్ధు వాయనం సమర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పీసీసీ కార్యాధ్యక్షుడు సతీశ్ జార్ఖిహొళి, యతీంద్రలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాహుల్ పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవలేదని ఎద్దేవా చేస్తున్న భాజపా నాయకులు గతంలో మోదీ పర్యటించిన పంజాబ్, తెలంగాణ, కేరళలో ఏమైందో గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని భాజపా చేస్తున్న విమర్శలు ఏదో ఓరోజు వారికే తిరుగుబాణాలు అవుతాయని హెచ్చరించారు. రాహుల్ కర్ణాటకలో పర్యటిస్తే మళ్లీ గెలుపు మాదేనని ముఖ్యమంత్రి బొమ్మై చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. రాజకీయాల్లో తాను కర్ణుడు లాంటివాడినని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. విమర్శలు చేసి, తప్పించుకోవాలని కోరుకునేవారే అలా విమర్శలు చేస్తుంటారని తూర్పారబట్టారు. వినాయక చవితి వేడుకల్లో ‘మహాత్ముడిని హత్య చేసిన గాడ్సే’ చిత్రాలు ఉంచి ఊరేగించడమే డర్టీ పాలిటిక్స్ అని ధ్వజమెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్