logo

చందనసీమ జాడేదీ?

విఖ్యాత దసరా ఉత్సవాల్లో భాగంగా చిత్రోత్సవాలను ప్రారంభించేందుకు నటులు శివరాజ్‌ కుమార్‌, కిచ్చ సుదీప్‌ గైర్హాజరయ్యారు. ఈ తరుణంలో జిల్లా వ్యవహారాల బాధ్య మంత్రి సోమశేఖర్‌ ఈ ఉత్సవాలను సోమవారం ప్రారంభించారు. పునీత్‌

Published : 27 Sep 2022 01:07 IST

మైసూరు, న్యూస్‌టుడే : విఖ్యాత దసరా ఉత్సవాల్లో భాగంగా చిత్రోత్సవాలను ప్రారంభించేందుకు నటులు శివరాజ్‌ కుమార్‌, కిచ్చ సుదీప్‌ గైర్హాజరయ్యారు. ఈ తరుణంలో జిల్లా వ్యవహారాల బాధ్య మంత్రి సోమశేఖర్‌ ఈ ఉత్సవాలను సోమవారం ప్రారంభించారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ కోసం బుధవారం పూర్తిగా కేటాయిస్తున్నామని ఆయన తెలిపారు. యువ దసరాలో ‘అప్పు నమన’ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమానికి అశ్విని పునీత్‌ రాజ్‌కుమార్‌ హాజరవుతారని వెల్లడించారు. చిత్రోత్సవాల్లో దేశ, విదేశాలకు చెందిన చిత్రాలను ప్రదర్శిస్తున్నామని చెప్పారు. సుమారు 14 ఏళ్ల తర్వాత తాను మైసూరు చిత్ర ఉత్సవాల్లో పాల్గొంటున్నానని సీనియరు నటి అను ప్రభాకర్‌ తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగేంద్ర, మేయరు శివకుమార్‌, జిల్లాధికారి బగాది గౌతమ్‌, అదనపు జిల్లాధికారి మంజునాథ స్వామి, చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు భా.మ.హరీశ్‌, కథానాయికలు కావ్యశెట్టి, అమృత అయ్యంగార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని