logo

రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం

రైల్వే ట్రాక్‌పైకి బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు మహిళలు మృతిచెందిన ఘటన ఆదివారం సాయంత్రం బళ్లారి తాలూకాలో జరిగింది. మృతిచెందిన వారిని స్వాతి(21), పవిత్ర(16)లుగా గుర్తించారు. తాలూకా పి.డి.హళ్లి పిర్కాలోని తగ్గినబూదిహళ్‌ గ్రామానికి

Published : 27 Sep 2022 01:07 IST

బళ్లారి, న్యూస్‌టుడే: రైల్వే ట్రాక్‌పైకి బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు మహిళలు మృతిచెందిన ఘటన ఆదివారం సాయంత్రం బళ్లారి తాలూకాలో జరిగింది. మృతిచెందిన వారిని స్వాతి(21), పవిత్ర(16)లుగా గుర్తించారు. తాలూకా పి.డి.హళ్లి పిర్కాలోని తగ్గినబూదిహళ్‌ గ్రామానికి చెందిన స్వాతి, పవిత్ర గ్రామం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై బహిర్భూమికి వెళ్లారు. రైల్వే ట్రాక్‌పై ఉన్న సమయంలో రెండు వైపుల నుంచి రైళ్ల్లు రావడంతో తప్పించుకోవడానికి ఇబ్బందిగా మారింది. దీంతో ఇద్దరు రైలుకింద పడి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న పి.డి.హళ్లి ఎస్‌.ఐ.శశిధర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. రైల్వే పోలీస్‌స్టేషన్‌ పరిధి కావడంతో పోలీసులతో చర్చించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను విమ్స్‌కు తరలించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బళ్లారి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని