logo

పిడుగుపాటుకు నలుగురి మృతి

పిడుగుపాటుకు తల్లి, ఇద్దరు పిల్లలు మరణించిన ఘటన యాదగిరి గ్రామీణ విభాగం ఎస్‌.హొసహళ్లిలో బుధవారం మధ్యాహ్నం సంభవించింది. మోనమ్మ (35), భాను (4), శ్రీనివాస (2)లను మృతులుగా గుర్తించారు.

Published : 29 Sep 2022 02:20 IST

యాదగిరి, న్యూస్‌టుడే : పిడుగుపాటుకు తల్లి, ఇద్దరు పిల్లలు మరణించిన ఘటన యాదగిరి గ్రామీణ విభాగం ఎస్‌.హొసహళ్లిలో బుధవారం మధ్యాహ్నం సంభవించింది. మోనమ్మ (35), భాను (4), శ్రీనివాస (2)లను మృతులుగా గుర్తించారు. పొలంలో పని చేస్తున్న సమయంలో వర్షం రావడంతో తన పిల్లలను తీసుకుని చెట్టుకిందకు వెళ్లింది. అదే సమయంలో పిడుగుపడడంతో గాజరకోటకు చెందిన వీరు ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు. ఇక్కడికి సమీపంలో మరో పొలంలో పని చేసుకుంటున్న సాబణ్ణ (18)పై పిడుగు పడడంతో అతనూ అక్కడికక్కడే మరణించాడు. యాదగిరి గ్రామీణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని