పార్టీలోకి చేరడానికి మునిగాళ్లపై నిలబడ్డారు
భాజపాలోని పలువురు శాసనసభ్యులు, నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి మునిగాళ్లపై నిలబడ్డారని కేపీసీసీ ప్రచార సమితి అధ్యక్షుడు ఎం.బి.పాటీల్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
భాజపాపై కాంగ్రెస్ ఎదురుదాడి
మాట్లాడుతున్న గ్రామీణ శాసనసభ్యుడు బి.నాగేంద్ర, చిత్రంలో ఎం.బి.పాటీల్,
వి.ఎస్.ఉగ్రప్ప, మేయర్ మోదపల్లి రాజేశ్వరి, తదితరులు
బళ్లారి, న్యూస్టుడే: భాజపాలోని పలువురు శాసనసభ్యులు, నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి మునిగాళ్లపై నిలబడ్డారని కేపీసీసీ ప్రచార సమితి అధ్యక్షుడు ఎం.బి.పాటీల్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా శాసనసభ్యులు, నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి ప్రతిపక్షనేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ తదితర నేతలతో మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందే రాష్ట్రంలో మార్పులు వస్తున్నట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో హొసపేటె మాజీ శాసనసభ్యుడు హెచ్.ఆర్.గవియప్ప భాజపా నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. భాజపా మాదిరిగా ఆపరేషన్ కమలం చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీలోకి వస్తున్నట్లు ఎం.బి.పాటీల్ తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నళీన్ కుమార్ కటీల్ మెదడు, నోటికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. భాజపాలోనే ఆయన మాట వినే పరిస్థితుల్లో లేరన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఐ సంఘటనను ఐదేళ్ల పాటు రద్దు చేసింది. ఇదే తరహాలో దేశ వ్యాప్తంగా అల్లర్లు, ఘర్షణలు సృష్టిస్తున్న మతఛాందసవాదుల సంఘాలను కూడా నిషేధించాలన్నారు. ఇటీవల భాజపా 2023లో జరిగే విధానసభ ఎన్నికలపై సర్వే చేయగా, భాజపా 60, కాంగ్రెస్ 140 స్థానాల్లో గెలుపొందుతున్నట్లు తేలిందన్నారు. 2023 విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కచ్చితమన్నారు. దేశ వ్యాప్తంగా రాహుల్గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రకు విశేష స్పందన వస్తోందని చెప్పారు. లోక్సభ మాజీ సభ్యుడు వి.ఎస్.ఉగ్రప్ప, శాసనసభ్యుడు బి.నాగేంద్ర, మేయర్ మోదపల్లి రాజేశ్వరి, నారా భరత్రెడ్డి, అల్లం ప్రశాంత, మహమ్మద్ రఫీక్, శివయోగి, జె.ఎస్.ఆంజినేయులు, బెణకల్లు బసవరాజగౌడ, పేరం వివేక్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా