రాచనగరిలో రమ్య విహారం!
విఖ్యాత మైసూరు దసరా వేడుకలు ఊపందుకున్నాయి.
కన్నుల పండుగగా దసరా వేడుకలు
విద్యుత్తు దీపాల వెలుగులో ప్యాలెస్ మైదానం
మైసూరు, న్యూస్టుడే : విఖ్యాత మైసూరు దసరా వేడుకలు ఊపందుకున్నాయి. సాయంత్రం కురుస్తున్న చిరుజల్లులను లక్ష్యం చేయకుండా పర్యాటకులు రాచనగరి వీధుల్లో సంచరిస్తున్నారు. మైసూరు మహారాజ కళాశాల ఆడిటోరియంలో కొనసాగుతున్న యువ దసరా వేడుకల్లో భాగంగా నవదుర్గల దర్శనం, విఘ్న నివారకుని ఆరాధన, శివ స్మరణలతో వివిధ కళా బృందాలు ప్రేక్షకులను అలరించాయి. మైసూరు బాలల దసరాను మంత్రి బీసీ నాగేశ్, గ్రామీణ దసరాను మంత్రి సోమశేఖర్, మాజీ మంత్రి జి.టి.దేవేగౌడ గురువారం సాయంత్రం ప్రారంభించారు. దసరా యోగ సమితి ప్యాలెస్ ముందు శుక్రవారం యోగథాన్ను నిర్వహించింది. లోక్సభ సభ్యుడు ప్రతాప సింహ యోగాసనాలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్యాలెస్ నుంచి టౌన్హాల్ వరకు గుర్రపుబగ్గీ (టాంగా)లపై వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి చూపించారు. పర్యాటక శాఖ, పురాతత్వ శాఖ సంయుక్తంగా దంపతుల కోసమే కొన్ని టాంగాలను నడుపుతుంది. కోట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద రైతు దసరాను మంత్రి బి.సి.పాటిల్ ప్రారంభించారు. ఎద్దుల బండి ఎక్కి మంత్రి కొంతదూరం ప్రయాణించారు. జీకే మైదానంలో వ్యవసాయ పరికరాల మేళా ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. మానస గంగోత్రి ఆవరణలో రాణి బహద్దూర్ ఆడిటోరియంలో యువ కవి గోష్ఠి నిర్వహించారు. ఈ గోష్ఠిని ఎమ్మెల్యే జి.టి.దేవేగౌడ ప్రారంభించారు. సుమారుగా 30కుపైగా కవులు ఈ గోష్ఠుల్లో పాల్గొంటారు. యువ దసరా, క్రీడా దసరా వేడుకలను మైసూరుకే పరిమితం కాకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లాధికారి డాక్టర్ బగాది గౌతమ్ తెలిపారు.
ప్యాలెస్లో సందర్శకులు
ప్యాలెస్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫల-పుష్ప ప్రదర్శనను సందర్శకులను ఆకట్టుకుంటోంది. ప్రైవేటు దర్బార్ సమయం మినహా మిగిలిన అన్ని సమయాల్లో ప్యాలెస్ వీక్షణకు సందర్శకులు వస్తున్నారు. చాముండిబెట్ట, బృందావన్ గార్డెన్, జూ వద్ద రద్దీ కొనసాగుతోంది. ప్యాలెస్కు మొత్తం 97,000 విద్యుత్తు దీపాలు ఉండడం, రాత్రుళ్లు దీపపు వెలుగుల్లో దాన్ని చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత ప్యాలెస్ను 1912లో నిర్మించగా, దాని నిర్మాణానికి అప్పుడు రూ.41.47 లక్షల ఖర్చు వచ్చింది. సుమారు 245 అడుగుల పొడవు, 156 అడుగుల వెడల్పుతో ఉన్న ప్యాలెస్పై గోపురం భూమట్టం నుంచి 145 అడుగుల ఎత్తులో నిర్మించారు. దీనికి బంగారు పూత ఉన్న రేకును తాపడం చేసి ఉంటుంది. వారంతం కావడంతో శనివారం, ఆదివారం సందర్శకులు, పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది.
బంగారు సింహాసనంపై శ్రీకంఠదత్త ఒడెయరు పూలబొమ్మ
ఎర్రకోట నమూనా ముందు వరుసగా ఏనుగులు, ఒంటెలు, గొర్రెల బొమ్మలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూట్యూబర్ దుస్సాహసం.. ఎయిర్పోర్టు రన్వేపై వీడియో చిత్రీకరించి..
[ 18-04-2024]
బెంగళూరు నగర శివారు దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేపై వీడియో చిత్రీకరించి, యూట్యూబ్లో అప్లోడ్ చేసిన యూట్యూబర్ వికాస్ గౌడను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. -
భార్య హంతకుడికి ఐదేళ్ల కారాగారం
[ 18-04-2024]
సారాయి తాగవద్దని అడ్డుకుంటున్న నసీమా (23) అనే గృహిణిని 2021 అక్టోబరు 19న బ్లేడుతో గొంతు కోసి హత్య చేసిన ఆమె భర్త ఇబ్రహీం సయ్యద్ హబీబ్ (25)కు కలబురగిలోని ఒకటో అదనపు జిల్లా న్యాయస్థానం.. -
భాజపాతో పోటీ.. హామీలు గ్యారంటీ
[ 18-04-2024]
కర్ణాటకలో గ్యారంటీలను సజావుగా అమలు చేశామన్న ధీమాతో కాంగ్రెస్ దేశప్రజలకు అదే స్థాయి హామీలిచ్చింది. ఇప్పటికే 25 గ్యారంటీలతో ఎన్నికల ప్రణాళిక ప్రకటించిన కాంగ్రెస్ వాటిపై రాష్ట్ర ప్రచారంలో మరింత వివరణ ఇచ్చింది. -
భాజపాకు గ్యారంటీల భయం.. హస్తానికదే అభయం
[ 18-04-2024]
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారంటీలు కొట్టుకుని పోతాయని ప్రచారంలో ముందుకు వెళ్తున్న భాజపాకు ఎక్కడో అదే గ్యారంటీల భయం వెంటాడుతోందని సర్వత్రా చర్చనీయాంశమైంది. -
విద్యానగరిలో స్వతంత్రుడి సెగ?
[ 18-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలో అనుభవం కలిగిన నాయకుడు ప్రహ్లాద్ జోసి- యువనేత వినోద్ అసూటి మధ్య మధ్య పోటీ రసవత్తరంగా మారింది. -
పంచభూతాల్లో లీనమైన ద్వారకీశ్
[ 18-04-2024]
గుండెపోటుతో మంగళవారం ఉదయం మరణించిన సీనియరు నటుడు, దర్శకుడు, నిర్మాత- ద్వారకీశ్ భౌతికకాయానికి చామరాజపేట టీఆర్ మిల్ ఆవరణలో బుధవారం మధ్యాహ్నం పోలీసు గౌరవ లాంఛనాలతో- కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించారు. -
డీకేపై గౌడ తీవ్ర ఆరోపణ
[ 18-04-2024]
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆస్తి కోసం ఒక తొమ్మిదేళ్ల బాలికను అపహరించారని మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవేగౌడ మంగళవారం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. -
కరడికి చేయందించిన కాంగ్రెస్
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురై, మంగళవారం లోక్సభ సభ్యత్వానికి- భారతీయ జనతాపార్టీకీ రాజీనామా చేసిన కొప్పళ ఎంపీ కరడి సంగణ్ణ బుధవారం బెంగళూరులో కాంగ్రెస్లో చేరారు. -
మోదీ సభకు సకల సన్నాహాలు
[ 18-04-2024]
బెంగళూరు ప్యాలెస్ మైదానంలో శనివారం సాయంత్రం నిర్వహించే బహిరంగలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభాకరంద్లాజె వెల్లడించారు. -
భాజపాను బలపరుద్దాం
[ 18-04-2024]
మాదిగ సముదాయ ప్రజలందరం భాజపాను బలపరుద్దామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. చెళ్లకెర వాసవీ కల్యాణ మంటపంలో బుధవారం జరిగిన మాదిగ సముదాయ సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మంత్రి మల్లికార్జున ప్రచారం
[ 18-04-2024]
బోవి గురుపీఠాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున వివిధ పీఠాధిపతులను కలిసి లోక్సభ ఎన్నికల్లో దావణగెరె కాంగ్రెస్ అభ్యర్థి డా.ప్రభ మల్లికార్జునకు మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
భాజపా రామాలయం నిర్మిస్తే.. మేం రామరాజ్యమే తెస్తాం
[ 18-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామరాజ్యమే నిర్మిస్తామని బళ్లారి జిల్లా మంత్రి బి.నాగేంద్ర స్పష్టం చేశారు. జూన్ 4న కేంద్రంలో భాజపా ప్రభుత్వం పతనమవుతుంది. -
ఫోన్ ట్యాపింగ్ చేయలేదు కుమారస్వామి స్పష్టీకరణ
[ 18-04-2024]
తాను ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి ఉంటే సంకీర్ణ ప్రభుత్వం పతనమయ్యేది కాదని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ