దేహదారుఢ్యానికి క్రీడలు దోహదం
యువకులు క్రీడా సాధన చేయడంతో శారీరకంగానే కాకుండా మానసికంగా దృఢంగా ఉంటారని జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం, యువ సబలీకరణ, క్రీడాశాఖ బళ్లారి ఫుట్బాల్ అసోసియేషన్ సంయుక్తంగా స్థానిక డా.రాజ్కుమార్ రహదారిలోని బి.డి.ఎ.ఎ.
ఫుట్బాల్ పోటీలను ప్రారంభిస్తున్న ఏసీ డా.ఆకాశ్ శంకర్, చిత్రంలో మంత్రి, శాసనసభ్యుడు, మేయర్, డీసీ, ఎస్పీ తదితరులు
బళ్లారి, న్యూస్టుడే : యువకులు క్రీడా సాధన చేయడంతో శారీరకంగానే కాకుండా మానసికంగా దృఢంగా ఉంటారని జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం, యువ సబలీకరణ, క్రీడాశాఖ బళ్లారి ఫుట్బాల్ అసోసియేషన్ సంయుక్తంగా స్థానిక డా.రాజ్కుమార్ రహదారిలోని బి.డి.ఎ.ఎ. ఫుట్బాల్ క్రీడామైదానంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఫుట్బాల్ పోటీలను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. క్రీడా పోటీల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. ఈ సందర్భంలో ప్రముఖ ఫుట్బాల్ ఆటగాడు రోనాల్డ్, సునీల్ ఆదర్శాలతో ముందుకు వెళ్లాలని సూచించారు. స్థానిక శాసనసభ్యుడు గాలి సోమశేఖర్రెడ్డి మాట్లాడుతూ అనేక ఏళ్ల తర్వాత బళ్లారి నగరంలో ఫుట్బాల్ క్రీడాపోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. బళ్లారి ఉప విభాగం అసిస్టెంట్ కమిషనర్ డా.ఆకాశ్ శంకర్ మాట్లాడుతూ బళ్లారి నగరంలో ఫుట్బాల్ పోటీలను నిర్వహించాలని పలువురు ఆటగాళ్లు తమ దృష్టికి తీసుకొని రావడంతో ఫుట్బాల్ లీజ్ మ్యాచ్లు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ఆయన ఫుట్బాల్ ఆడి పోటీలను ప్రారంభించారు. మేయర్ మోదపల్లి రాజశ్వేరి, లోక్సభ మాజీ సభ్యురాలు శాంత, జిల్లా పాలనాధికారి పవన్కుమార్ మాలపాటి, జిల్లా పోలీస్ అధికారి సైదులు ఆడావత్, క్రీడాశాఖాధికారి హరిసింగ్ రాథోడ్, కోచ్లు శాంతి, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దక్షిణాదిపైనే కమలదండు గురి
[ 20-04-2024]
సీనియర్ల పోటీ మధ్య రాష్ట్ర భాజపా అధ్యక్ష పగ్గాలు దక్కించుకున్న యువ నేత బి.వై.విజయేంద్ర సారథ్యంలో తొలిసారిగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. -
నటి హర్షికపై దాడి
[ 20-04-2024]
పులకేశినగరలో తన భర్త భువన్తో కలిసి వెళుతున్న సమయంలో కొందరు దుండగులు తమపై దాడి చేసి, తన గొలుసు దోచుకునేందుకు ప్రయత్నించారని పులకేశినగర ఠాణాలో నటి హర్షిక పుణచ్చ ఫిర్యాదు చేశారు. -
ప్రేమ పేరుతో రక్తపుటేరులా?
[ 20-04-2024]
కర్ణాటకలో లవ్ జిహాద్ ఘటనలు ఎక్కువవుతున్నాయంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది. -
అగ్రనేతల గడ్డపై ఎవరిదో విజయం?
[ 20-04-2024]
బళ్లారి లోక్సభ నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, భాజపా నుంచి ఫైర్బ్రాండ్గా ప్రత్యేక గుర్తింపు పొందిన దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ బరిలో నిలిచారు. -
ప్రధాని ప్రాభవమే శోభకు శ్రీరామరక్ష
[ 20-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ నియోజకవర్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం సందర్శించనున్న నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం మార్పులకు నోచుకుంటుందని, కమలనాథులకు విజయం చేరువవుతుందనే అంచనాలు తెరపైకి వచ్చాయి. -
కాంగ్రెస్లోకి మాలికయ్య గుత్తేదార్
[ 20-04-2024]
మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్, కుమటా మాజీ ఎమ్మెల్యే శారదా మోహన్శెట్టి తదితరులు శుక్రవారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
గదగలో నలుగురి దారుణ హత్య
[ 20-04-2024]
గదగ పట్టణంలోని చెన్నమ్మ కూడలి సమీపాన దాసర వీధిలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. -
నకిలీ పత్రాలతో నిలువుదోపిడీ
[ 20-04-2024]
ఒకే ఇంటి స్థలానికి లెక్కలేనన్ని నకిలీ పత్రాలు సిద్ధం చేసి వాటిని 22 బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.10 కోట్లకు పైగా రుణాన్ని తీసుకున్న ఆరుగురు వంచకులను బెంగళూరు జయనగర ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్