మళ్లీ చిరుత చిత్రాలు చక్కర్లు
బళ్లారి కొండపై 40 రోజుల తర్వాత చిరుత ప్రత్యక్షమైంది. చిరుత కొండపై సంచరించే చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. తక్షణమే అటవీశాఖ ఉప సంరక్షణ సూర్యవంశీ సందీప్ ఆదేశాలతో ఆర్.ఎఫ్.ఒ. రాఘవేంద్ర తమ సిబ్బందితో సంజయ్గాంధీ నగర్కు చేరుకుని చిరుత ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాలను పరిశీలించారు.
అప్రమత్తమైన అటవీ శాఖాధికారులు
కొండపై ఉన్న చిరుతను పరిశీలిస్తున్న అటవీశాఖాధికారులు, సిబ్బంది
బళ్లారి, న్యూస్టుడే : బళ్లారి కొండపై 40 రోజుల తర్వాత చిరుత ప్రత్యక్షమైంది. చిరుత కొండపై సంచరించే చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. తక్షణమే అటవీశాఖ ఉప సంరక్షణ సూర్యవంశీ సందీప్ ఆదేశాలతో ఆర్.ఎఫ్.ఒ. రాఘవేంద్ర తమ సిబ్బందితో సంజయ్గాంధీ నగర్కు చేరుకుని చిరుత ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాలను పరిశీలించారు. నగరం నడిబొడ్డున ఉన్న కొండపై 40 రోజుల ముందు చిరుత ప్రత్యక్షమైనట్లు చిరుత సంచరించే చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో అటవీశాఖాధికారులు పోలీసుల సహకారంతో కొండ చుట్టుపక్కల ప్రత్యేక పోలీసుల భద్రత ఏర్పాట్లు చేశారు. రెండు బోన్లను కూడా అమర్చారు. వారం రోజులపాటు అటవీ శాఖాధికారులు కొండపై డ్రోన్ కెమెరాలతో పరిశీలించారు. రాత్రి పూట సంచరించే దృశ్యాలను నిక్షిప్తం చేయడానికి కొండపై మూడు ప్రదేశాల్లో కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే ఎలాంటి చిన్న ఆచూకీ కూడా కనిపించలేదు. కొండ చుట్టుపక్కల వాసులు చిరుత భయం నుంచి బయట పడ్డారు. ఆదివారం ఉదయం కొండ బండరాళ్లపై చిరుత సంచరిస్తున్న దృశ్యాలను స్థానిక ప్రజలు గుర్తించి చరవాణిలో ఫొటోలు తీశారు. సామాజిక మాధ్యమాల్లో చిత్రాలు చక్కర్లు కొట్టాయి. ఈ విషయాన్ని అటవీ శాఖాధికారులకు దృష్టికి తీసుకెళ్లడంతోపాటు అధికారులు అప్రమత్తమవయ్యారు. అధికారి రాఘవేంద్ర తమ సిబ్బందితో కొండ వద్దకు చేరుకొని డ్రోన్ కెమెరాలతో పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు లభించలేదు. ముందు జాగ్రత్తగా అధికారులు ప్రత్యేక బృందాలతో భద్రత ఏర్పాటు చేశారు. కొండ చుట్టూ ఉన్న ప్రాంతాలలో రాత్రి వేళ ఇంట్లో నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సోమవారం కొండపైకి వెళ్లి చిరుత కోసం గాలిస్తామని అధికారులు తెలిపారు. గత 40 రోజుల నుంచి కొండ చుట్టపక్కల కాలనీల్లో ఉంటున్న వీధి కుక్కలు మాయమవుతున్న విషయం స్థానికులు అటవీశాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కొండ చుట్టపక్కల ఉన్న సంజయ్గాంధీనగర్, సిద్ధార్థ నగర, నాగల చెరువు, కోట ప్రదేశం దేవినగర్, తదితర ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
బళ్లారి కొండలోని బండరాయిపై కనిపిస్తున్న చిరుత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.