కృషితో ఏదైనా సాధించవచ్చు
అలుపెరగని కృషి, అకుంఠిత దీక్షతో ముందుకు వెళితే జీవితంలో ఏదైనా సాధించవచ్చని విజయనగర జిల్లా పాలనాధికారి పి.అనిరుద్ధ్ శ్రవణ్ పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని విజ్ఞాన్ కళాశాలలో ఏర్పాటు చేసిన సూపర్-100 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.
విద్యార్థినులతో కలిసి సూపర్ 100 కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న పాలనాధికారి పి.అనిరుద్ధ్ శ్రవణ్
హొసపేటె, న్యూస్టుడే : అలుపెరగని కృషి, అకుంఠిత దీక్షతో ముందుకు వెళితే జీవితంలో ఏదైనా సాధించవచ్చని విజయనగర జిల్లా పాలనాధికారి పి.అనిరుద్ధ్ శ్రవణ్ పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని విజ్ఞాన్ కళాశాలలో ఏర్పాటు చేసిన సూపర్-100 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివిన, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 100 మంది పీయూసీ ద్వితీయ సంవత్సర సైన్స్ విద్యార్థులను ఎంపికచేసి వారికి నీట్, సీఈటీ పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వడమే ఈ సూపర్-100 కార్యక్రమం ఉద్దేశమని వివరించారు. దీనికోసం జిల్లా ఖనిజ నిధులను ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఉన్నత చదువులపై ఆశ పెట్టుకున్న నిరుపేద విద్యార్థులకు నిరాశ కలగకూడదన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు. పట్టణంలోని విజ్ఞాన్ పీయూ కళాశాలలోనే శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ఎంపికైన వంద మంది విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి, రవాణా ఖర్చులను కూడా జిల్లా యంత్రాంగమే భరిస్తుందన్నారు. నోడల్ అధికారి ఈరప్ప బిరాదార్ మాట్లాడారు. కార్యక్రమంలో పీయూ విద్యాశాఖ డీడీ నాగరాజ్ హవాల్దార్, విజ్ఞాన్ కళాశాల, ఇతర కళాశాలల ప్రధానాచార్యులు విద్యాధర్, జె.సిద్రామ, ఎన్.ఎన్.ధర్మాయత్, హాలప్ప, షణ్ముఖప్ప బాగేవాడి, రామచంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా