మైమరచిన రాచనగరి విహారి
విఖ్యాత దసరా ఉత్సవాలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. బుధవారం మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగే జంబూ సవారీ, కాగడాల ప్రదర్శనతో నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.
దసరా సెలవులు.. పోటెత్తిన పర్యాటకులతో మైసూరు వీధులు కిటకిట
మైసూరు, న్యూస్టుడే : విఖ్యాత దసరా ఉత్సవాలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. బుధవారం మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగే జంబూ సవారీ, కాగడాల ప్రదర్శనతో నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. జంబూసవారీలో ప్రదర్శించే 43 స్తబ్ద చిత్రాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. అశ్వదళం, గజదళాల అభ్యాసం సోమవారమూ కొనసాగింది. ఈ వారాంతం వరకు నగరానికి పర్యాటకులు వచ్చి వెళతారని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. పర్యాటకుల కోసం ప్యాలెస్ ఆవరణలో ఫలపుష్ప ప్రదర్శన, భారత్ స్కౌట్్స అండ్ గైడ్స్ మైదానంలో ఆహార ఉత్సవం, దసరా వస్తు ప్రదర్శనలు కొనసాగించనున్నారు. చాముండి బెట్ట, మైసూరు జంతు ప్రదర్శనశాల, బృందావన్ గార్డెన్స్, రైల్వే మ్యూజియం, శ్రీరంగపట్టణ కారంజి లేక్, పక్షిధామ, మేలుకోట, నంజనగూడు, బిళిరంగనబెట్టి, గోపాలస్వామి బెట్ట, మలెమహదేశ్వర, కొడగు తదితర ప్రాంతాలకు సందర్శకులు, పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. ప్యాలెస్ ఆవరణ నుంచి బన్ని మండపం వరకు బుధవారం జంబూసవారి కొనసాగే మార్గంలో వాహనాల రాకపోకలపై ఆ రోజు మధ్యాహ్నం నుంచి నిషేధం విధిస్తామని పోలీసు కమిషనర్ డాక్టర్ చంద్రగుప్త తెలిపారు. పర్యాటకులు, వాహనదారుల సంఖ్య ఎక్కువ కావడంతో శనివారం నుంచి ఈ ప్రాంతాల్లో సంచరించడం కష్టంగా మారింది. దొడ్డగడియార, ఆల్బర్ట్ విక్టర్ రోడ్డు, సయ్యాజిరావు రోడ్డు, ధన్వంతరి రోడ్డు, ఇర్విన్ రోడ్డు, చామరాజ డబుల్ రోడ్డు, ఎంజీ రోడ్డు, శివరాం పేట, అరస్ రోడ్లలో రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. శ్వానప్రియులను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన జాగిలాల ప్రదర్శనకు రెండు వందలకు పైగా వివిధ జాతుల శ్వానాలతో వాటి యజమానులు వచ్చారు. యువ దసరా ఉత్సవాలకు సోమవారం తెరపడింది. అంబా ప్యాలెస్లో రాజవంశస్తుడు యదువీర్ సోమవారం ప్రైవేటు దర్బారు నిర్వహించారు. మంగళవారం ఆయుధ పూజ చేస్తారు. అంబారీ బస్సులు, టాంగా ఎక్కి వీధుల్లో సంచరించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. మైసూరులోని అన్ని హోటళ్లు, రిసార్టులు, క్లబ్లు 100 శాతం నిండిపోయాయని మైసూరు హోటళ్ల సంఘం అధ్యక్షుడు సి.నారాయణ గౌడ తెలిపారు. గురువారం వరకు ఎక్కడా గదులు ఖాళీ లేవని ఆయన చెప్పారు.
జయచామరాజేంద్ర ఒడెయరు కూడలి కళకళ
అన్నిచోట్లా కిటకిటా
మైసూరు అనంతరం శ్రీరంగపట్టణం, ఉడుపి, మంగళూరు, పుత్తూరు, కొడగు తదితర ప్రాంతాల్లో దసరా వేడుకలు జోరుగా కొనసాగుతున్నాయి. దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో పిల్లి వేష (పులివేషం) ధారణతో స్థానిక కళాకారులు పోటీ పడుతున్నారు. బాలల నుంచి పెద్దల వరకు ఒంటికి రంగు వేసుకుని వీధుల్లో, దుకాణాల వద్ద నృత్యాలు చేయడం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. పుత్తూరు ఎమ్మెల్యే సంజీవ మఠందూరు పులివేషధారులతో కలిసి డ్యాన్స్ చేశారు. కొడగులో దసరా సమితి, దశమండపాల సమితి నేతృత్వంలో ఘనంగా దసరాను ఆచరిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, కొడగు ఆహార మేళాలను ఎమ్మెల్యే కె.జి.బోపయ్య ప్రారంభించారు. ఈ వారాంతం వరకు కొడగులో వేడుకలు కొనసాగనున్నాయి. కుశాలనగర కుందన నాట్యకళా బృందం, డ్యాన్స్ కర్ణాటక రియాలిటీ షో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన జాతరల్లో రద్దీ కొనసాగుతోంది. గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన మహిళా దసరాలో ఆయా రంగాల్లో ప్రతిభ చూపించిన మహిళలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఉడుపిలో ఉచ్చిల దసరా వేడుకలను నిర్వహిస్తుండగా, 101 మంది కళాకారులు ఏకకాలంలో వీణా వాదనతో ఆకట్టుకున్నారు. ఆదివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమానికి పది వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. బాగలకోటలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆదివారం కవాతు నిర్వహించారు. ఏటా ఒకసారి మాత్రమే కవాతు నిర్వహించే ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు గత ఏడాది నుంచి రెండుసార్లు కవాతు నిర్వహిస్తున్నారు. దసరాకు ముందు వచ్చే ఆదివారం కేవలం బాలురు మాత్రమే గణవేషధారులుగా కవాతులో పాల్గొనడం ఇక్కడి ప్రత్యేకత.
కంసాళె కళాకారులతో మంత్రి ఎస్.టి.సోమశేఖర్
శారాదామాత పూజ చేస్తున్న యదువీర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
‘ఉబర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!