logo

అందాల భామ.. మేఘనా

వివాహిత మహిళల కోసం నిర్వహించే పోటీల్లో మిసెస్‌ కర్ణాటక- 2022గా డాక్టర్‌ మేఘనారెడ్డి కీరిటాన్ని దక్కించుకున్నారు.

Published : 04 Oct 2022 02:18 IST

డాక్టర్‌ మేఘనారెడ్డి (ఎడమ నుంచి మూడో వ్యక్తి)

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : వివాహిత మహిళల కోసం నిర్వహించే పోటీల్లో మిసెస్‌ కర్ణాటక- 2022గా డాక్టర్‌ మేఘనారెడ్డి కీరిటాన్ని దక్కించుకున్నారు. ఆదివారం రాత్రి నిర్వహించిన ఈ పోటీల్లో బిగ్‌బాస్‌ ఫేం శైన్‌శెట్టి, ఫెమినా మిస్‌ ఇండియా ప్రాచి మిశ్ర, గర్భిణుల ఆరోగ్య సురక్షిత నిపుణురాలు లీనా సవూర్‌, డాక్టర్‌ మంజుశపాటిల్‌, దక్షిణ భారత దుస్తుల తయారీదారుల సంఘం అధ్యక్షురాలు అనురాగ్‌ సింగ్లా తదితర 70 మంది మహిళలు మిసెస్‌ కర్ణాటక-2022 పోటీలకు హాజరయ్యారు. వారిలో డాక్టర్‌ మేఘనా రెడ్డి మిసెస్‌ కర్ణాటకగా ఎంపికయ్యారు. ద్వితీయ స్థానం బింద రమేష్‌, తృతీయ స్థానం నౌశిన్‌ షరీఫ్‌ దక్కించుకున్నారు. పిల్లల పెంపకంతో పాటు సౌందర్య పోషణపై మహిళలు ఆసక్తి చూపుతున్నట్లు ఆమె ఈ సందర్భంగా వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని