మేళతాళాలతో స్వాగత తోరణాలు
కాంగ్రెస్ యువనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ ఐక్యత యాత్ర నాలుగో రోజు మైసూరులో ఉత్సాహవంతంగా సాగింది. కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్, రణదీప్సింగ్ సుర్జేవాల, బీకే హరిప్రసాద్ తదితరులు ఆయనతో కలిసి నడిచారు.
తన చిత్రాన్ని శరీరంపై వేయించుకున్న యువకుడితో రాహుల్
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : కాంగ్రెస్ యువనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ ఐక్యత యాత్ర నాలుగో రోజు మైసూరులో ఉత్సాహవంతంగా సాగింది. కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్, రణదీప్సింగ్ సుర్జేవాల, బీకే హరిప్రసాద్ తదితరులు ఆయనతో కలిసి నడిచారు. దారి పొడవునా కాంగ్రెస్ కార్యకర్తలు, విద్యార్థులు, జానపద కళాకారులు స్వాగతం పలికారు. భద్రత ఎక్కువ కావడంతో ఎవరూ ఆయన వద్దకు వెళ్లలేక పోతున్నారు. కొందరిని ఆయనే స్వయంగా పిలిపించుకుని మాట్లాడుతున్నారు. కేరళ నుంచి వచ్చి కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో.. రాహుల్ జోక్యం చేసుకున్నారు. బాలలు, మహిళలు, యువతులతో కలిసి కొంత దూరం నడిచారు. బాలలకు మిఠాయిలు ఇచ్చి సంతోషం పంచుకున్నారు.
చాముండేశ్వరి దేవస్థానంలో రాహుల్ పూజ
* యాత్రలో భాగంగా రాహుల్తో పాటు పార్టీ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్, రణదీప్సింగ్ సుర్జేవాల తదితరులు చాముండేశ్వరి దేవస్థానానికి వెళ్లి పూజలు చేశారు. అనంతరం.. మైసూరులోని మస్జీద్- ఈ ఇఝమ్ మసీదుకు వెళ్లారు. అక్కడ ముల్లాలు ప్రార్థనలు నిర్వహించి రాహుల్ను సత్కరించారు. పురాతన సెయింట్ ఫిలోమినా చర్చిలోనూ ప్రార్థనలు చేశారు. అక్కడి ఫాదర్లు ప్రార్థనలు చేసి అభిషేక జలాలను చల్లారు. క్రైస్తవ సన్యాసులను రాహుల్ కలిసి మాట్లాడారు. పాదయాత్ర సమయంలో ఓ యువతిని దగ్గర తీసుకుని క్షేమసమాచారం విచారించారు. భజన కళాకారులతో కలిసి తాళాలు వేశారు. వారితో కలిసి నృత్యం చేశారు. తన బొమ్మను శరీరంపై గీయించుకుని పాదయాత్రకు వచ్చిన యువకుడితో ఉత్సాహంగా కాసేపు మాట్లాడారు. మైసూరులోకి రాహుల్కు జానపద కళాకారులు స్వాగతం పలికారు. యాత్ర సాగే రహదారికి ఇరువైపులా విద్యార్థులు జేజేలు పలికారు. ఉదయం 6.30 గంటలకు మైసూరు ఆర్-గేట్ నుంచి ప్రారంభమైన యాత్ర మధ్యాహ్నం 12 గంటలకు బమ్మూర్ అగ్రహారకు చేరుకుంది. అక్కడ భోజనానంతరం కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు శ్రీరంగపట్టణ కె.ఎస్.ఆర్టీసీ బస్టాండు నుంచి పాదయాత్ర ప్రారంభమై మండ్య జిల్లాలోకి అడుగుపెట్టింది.
సుత్తూరు మఠంలో శివరాత్రి దేశికేంద్ర స్వామి ఆశీస్సులు పొందిన వేళ..
మైసూరు మస్జీద్- ఈ అఝమ్ మసీదులో కాంగ్రెస్ నేతల బృందం
సెయింట్ ఫిలోమినా చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్న నాయకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా