విపణికి పండగ కళ!
దసరా, ఆయుధ పూజల నేపథ్యంలో ఇటు బెంగళూరు.. అటు మైసూరులో మార్కెట్లు కిటకిటలాడాయి. ఇసుకేస్తే నేలరాలనంతగా జనం కదలిరావడంతో సోమవారం రాకపోకలు పలు దఫాలుగా స్తంభించిపోయాయి. బెంగళూరులో పెద్ద సంఖ్యలో పూజాసామగ్రి కొనుగోలు చేశారు.
బెంగళూరు : కేఆర్ మార్కెట్ వీధి.. కిటకిటలు
శివాజీనగర, న్యూస్టుడే : దసరా, ఆయుధ పూజల నేపథ్యంలో ఇటు బెంగళూరు.. అటు మైసూరులో మార్కెట్లు కిటకిటలాడాయి. ఇసుకేస్తే నేలరాలనంతగా జనం కదలిరావడంతో సోమవారం రాకపోకలు పలు దఫాలుగా స్తంభించిపోయాయి. బెంగళూరులో పెద్ద సంఖ్యలో పూజాసామగ్రి కొనుగోలు చేశారు. చిక్కబళ్లాపుర, దొడ్డబళ్లాపుర, రామనగర, మాగడి, ఆనేకల్ ప్రాంతాల నుంచి పాతిక లోడుల గుమ్మడికాయలు రాగా, ఆది, సోమవారాల్లో నాలుగు వందల లారీల్లో అవే కాయలను తరలించుకొచ్చేంతగా డిమాండు ఏర్పడింది. రెండు నెలలుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల పంట ఆశించిన స్థాయిలో రాలేదని చిక్కబళ్లాపురకు చెందిన యువ రైతు మహేశ్ తెలిపారు. బూడిద గుమ్మడి కాయ కిలోకు వ్యాపారులు, దళారులు రైతుకు రూ.20 చెల్లిస్తుండగా, మార్కెట్లో రూ.40కి విక్రయిస్తున్నారు. ఊబకాయం, మధుమేహ నియంత్రణకు ఈ కాయరసం చక్కగా పని చేస్తుండంతో గత కొన్నేళ్లుగా ఈ పంట సాగుపై ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలతో దిగుబడి తగ్గడంతోనే ధరలు ఎక్కువగా ఉన్నాయని వ్యాపారులు తెలిపారు. పూలు, పండ్లు, పత్రాల విక్రయాల జోరు చెప్పనలవి కాదు. పిండి వంటలకు ఉపకరించే పదార్థాలూ విపరీతంగా అమ్ముడుపోయాయి.
ధార్వాడ : దుర్గాష్టమి పూజల్లో పాల్గొన్న విశేష భక్తగణం
భక్తిప్రపత్తులతో పూజలు
భార్య చెన్నమ్మతో కలిసి పూజ చేస్తున్న బొమ్మై
బెంగళూరు (గ్రామీణం), న్యూస్టుడే : దొడ్డబళ్లాపుర సమీపంలోని బాశెట్టిహళ్లి పారిశ్రామికవాడలోని తన కుమారుడు భరత్ నిర్వహిస్తున్న మ్యాగ్నటిక్ ఫొటో కంపెనీ పరిశ్రమలో ముఖ్యమంత్రి బొమ్మై తన భార్య చెన్నమ్మతో కలిసి సోమవారం ఆయుధ పూజ చేశారు. పూజలో కుటుంబ సభ్యులతో పాటు ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ పాల్గొన్నారు. గత ఏడాది కూడా ముఖ్యమంత్రి పరిశ్రమలో పూజలో పాల్గొని తానే స్వయంగా అక్కడి సిబ్బందికి బోనస్ అందజేశారు.
మైసూరు : దేవరాజ్ విపణిలో కిక్కిరిసిన దుకాణాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దక్షిణాదిపైనే కమలదండు గురి
[ 20-04-2024]
సీనియర్ల పోటీ మధ్య రాష్ట్ర భాజపా అధ్యక్ష పగ్గాలు దక్కించుకున్న యువ నేత బి.వై.విజయేంద్ర సారథ్యంలో తొలిసారిగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. -
నటి హర్షికపై దాడి
[ 20-04-2024]
పులకేశినగరలో తన భర్త భువన్తో కలిసి వెళుతున్న సమయంలో కొందరు దుండగులు తమపై దాడి చేసి, తన గొలుసు దోచుకునేందుకు ప్రయత్నించారని పులకేశినగర ఠాణాలో నటి హర్షిక పుణచ్చ ఫిర్యాదు చేశారు. -
ప్రేమ పేరుతో రక్తపుటేరులా?
[ 20-04-2024]
కర్ణాటకలో లవ్ జిహాద్ ఘటనలు ఎక్కువవుతున్నాయంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది. -
అగ్రనేతల గడ్డపై ఎవరిదో విజయం?
[ 20-04-2024]
బళ్లారి లోక్సభ నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, భాజపా నుంచి ఫైర్బ్రాండ్గా ప్రత్యేక గుర్తింపు పొందిన దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ బరిలో నిలిచారు. -
ప్రధాని ప్రాభవమే శోభకు శ్రీరామరక్ష
[ 20-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ నియోజకవర్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం సందర్శించనున్న నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం మార్పులకు నోచుకుంటుందని, కమలనాథులకు విజయం చేరువవుతుందనే అంచనాలు తెరపైకి వచ్చాయి. -
కాంగ్రెస్లోకి మాలికయ్య గుత్తేదార్
[ 20-04-2024]
మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్, కుమటా మాజీ ఎమ్మెల్యే శారదా మోహన్శెట్టి తదితరులు శుక్రవారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
గదగలో నలుగురి దారుణ హత్య
[ 20-04-2024]
గదగ పట్టణంలోని చెన్నమ్మ కూడలి సమీపాన దాసర వీధిలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. -
నకిలీ పత్రాలతో నిలువుదోపిడీ
[ 20-04-2024]
ఒకే ఇంటి స్థలానికి లెక్కలేనన్ని నకిలీ పత్రాలు సిద్ధం చేసి వాటిని 22 బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.10 కోట్లకు పైగా రుణాన్ని తీసుకున్న ఆరుగురు వంచకులను బెంగళూరు జయనగర ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.