సింధనూరును జిల్లాగా ప్రకటించాలని యాత్ర
నవ సంకల్పం- నవ సింధనూరు పేరిట ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బసనగౌడ బాదర్లి సోమవారం చేపట్టిన పాదయాత్ర కార్యక్రమంతో పట్టణం దద్దరిల్లింది. సింధనూరును కొత్త జిల్లాగా ప్రకటించాలని, రైతులు, యువత మేలు కోరుతూ మొత్తం ఆరు కోర్కెలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ బసనగౌడ బాదర్లి ఈ బృహత్ పాదయాత్ర ప్రారంభించారు.
నవ సంకల్పం అంటూ..నాగలి పట్టుకుని పాదయాత్రలో సాగిపోతున్న బసనగౌడ బాదర్లి
సింధనూరు, న్యూస్టుడే: నవ సంకల్పం- నవ సింధనూరు పేరిట ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బసనగౌడ బాదర్లి సోమవారం చేపట్టిన పాదయాత్ర కార్యక్రమంతో పట్టణం దద్దరిల్లింది. సింధనూరును కొత్త జిల్లాగా ప్రకటించాలని, రైతులు, యువత మేలు కోరుతూ మొత్తం ఆరు కోర్కెలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ బసనగౌడ బాదర్లి ఈ బృహత్ పాదయాత్ర ప్రారంభించారు. కొత్త జిల్లాగా ఆవిర్భంచడానికి సింధనూరుకు సకల అర్హతలూ ఉన్నా..స్థానిక నాయకులెవరూ దాని ఊసెత్తకపోవడం శోచనీయమని విమర్శించారు. తమ వ్యక్తిగత అభివృద్ధి తప్ప సింధనూరు మేలుకోసం ప్రయత్నం చేయని నాయకులను పక్కనపెట్టి జనం సహకారం కోరుతూ వారిని చైతన్యపర్చడానికి వారి ఇళ్ల వద్దకే వెళ్దామని ఈ పాదయాత్ర ప్రారంభించినట్లు ప్రకటించారు. మేళతాళాలతో, భాజాభజంత్రీలతో యాత్ర హోరెత్తింది. తొలి ప్రయత్నంగా సోమవారం స్థానిక అంబాదేవి ఆలయం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని అంబామఠంలోని అంబాదేవి దేవస్థానం వరకూ పాదయాత్ర జరిపారు. యువత అధికసంఖ్యలో పాల్గొని బాసనగౌడకు బాసటగా నిలిచి అడుగడుగునా గజమాలలతో స్వాగతం పలికారు. అన్నదాత ఆయుధం నాగలిని చేతపట్టి బసనగౌడ యాత్రలో సాగిపోయారు. యాత్ర కారణంగా పట్టణంలో దాదాపు రెండు గంటలసేపు వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
పాదయాత్రకు వన్నె తెస్తూ..కలశాలతో పాల్గొన్న మహిళలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ