ఐక్యతా యాత్రకు గట్టి పోటీ
కాంగ్రెస్ చేపడుతున్న భారత్ ఐక్యతా యాత్ర రాష్ట్రంలోని కీలక పార్టీలను పునరాలోచనలో పడేస్తోంది.
కన్నడనాట రాహుల్ పాదయాత్రపై అన్ని పార్టీల దృష్టి
ఈనాడు, బెంగళూరు : కాంగ్రెస్ చేపడుతున్న భారత్ ఐక్యతా యాత్ర రాష్ట్రంలోని కీలక పార్టీలను పునరాలోచనలో పడేస్తోంది. ఎంత విమర్శించినా ఏఐసీసీ నేత రాహుల్గాంధీ యాత్రకు దక్కుతున్న ప్రజా స్పందన తోసిపుచ్చలేని అంశం. అధికార పక్షం భాజపా, ఏకైక ప్రాంతీయ పార్టీ జనతాదళ్ ఈ యాత్రను అంత సులువుగా తీసుకునేందుకు ఏమాత్రం సాహసించటం లేదు. సిద్ధరామోత్సవం, మేకెదాటు పాదయాత్ర, ఆగస్టు 15న ఫ్రీడమ్ మార్చ్లతో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గరయ్యేందుకు చేసిన ప్రయత్నాలు దాదాపు విజయవంతమైనట్లే. ఈ యాత్రలకు గుమిగూడే వారంతా ఓటర్లుగా మారలేరన్న అభిప్రాయాలెలా ఉన్నా.. దక్కుతున్న ప్రజా స్పందనకు పోటీ కార్యక్రమాలు నిర్వహించటం ప్రత్యర్థులకు అనివార్యంగా మారింది.
* సిద్ధరామోత్సవ కార్యక్రమం అధికార భాజపా ఆలోచనలను మార్చింది. అప్పటికే రెండేసి మార్లు జనోత్సవాన్ని వాయిదా వేసిన భాజపా ఎట్టకేలకు దొడ్డబళ్లాపురలో ఆ కార్యక్రమాన్ని ముగించుకుంది. మూడేళ్ల సర్కారు ప్రగతిని కొనియాడేందుకు అధిష్ఠానం నుంచి కీలక నేతలు రాకపోవటంపై భాజపా రాష్ట్ర శాఖ అసంతృప్తికి గురైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేదా హోం మంత్రి అమిత్ షా కోసం ఎదురుచూసిన బొమ్మై సర్కారుకు నిరాస ఎదురైంది. మరోవైపు యడియూరప్ప నేతృత్వంలో శివమొగ్గలో కార్యకర్తల సమావేశం, ముఖ్యమంత్రి, నళిన్ కుమార్ కటీల్లతో రాష్ట్ర పర్యటనలకు అధిష్ఠానం నుంచి అనుమతి దక్కకపోవటం గమనార్హం. తాజాగా రాష్ట్రంలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ యాత్రతో కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేయటం అధికార పక్షానికి ఎంతైనా అవసరం. కేవలం ఐదారు నెలల్లో విధానసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ప్రజల వద్దకు వెళ్లే కార్యక్రమాలు అనివార్యంగా చేపట్టాలని తీర్మానించింది. ఇందులో భాగంగా అక్టోబరు 30న కలబురగిలో ఓబీసీ ర్యాలీని ఏర్పాటు చేయాలని కమలనాథులు తీర్మానించారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించేందుకు రాష్ట్ర కార్యవర్గం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో 54 శాతం ఓటర్లున్న ఓబీసీలలో 205 ఉపజాతుల నేతలను ఈ సమావేశానికి హాజరుపరచి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మోర్చా తీర్మానించింది. అంతకు ముందు శుక్రవారం ప్యాలెస్ మైదానంలో భాజపా కార్యవర్గ సమావేశానికి అమిత్ షాను ఆహ్వానించటం, 9 నుంచి ముఖ్యమంత్రి బొమ్మై నేతృత్వంలో రాష్ట్ర పర్యటన, కెంపేగౌడ 108 అడుగుల భారీ విగ్రహ ప్రతిష్ఠాపనకు జేపీ నడ్డాలను ఆహ్వానించాలని పార్టీ నిర్ణయించింది.
పంచరత్న రథయాత్ర
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రారంభించే భారత రాష్ట్ర సమితి- బీఆర్ఎస్కు పూర్తి సహకారం ఇస్తూ జాతీయ ప్రస్థానానికి సిద్ధమవుతున్న జేడీఎస్ త్వరలో ‘పంచరత్న రథయాత్ర’కు సిద్ధం కానుంది. పార్టీకి పట్టున్న క్షేత్రాలు క్రమంగా ఇతర పార్టీల పరం కావటంతో దళపతులు డీలాపడుతున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు 120 క్షేత్రాల్లో పంచరత్న రథయాత్రను నిర్వహించాలని ఆ పార్టీ నేత కుమారస్వామి నిర్ణయించారు. పాతమైసూరు ప్రాంతంలోని ఎనిమిది క్షేత్రాల ఆశావహులతో సమావేశమైన కుమారస్వామి ఈ యాత్ర కోసం సిద్ధం కావాలని నిర్ణయించారు. కాంగ్రెస్ జోడో యాత్రకు ముందుగానే తాను జనతా జలధారె యాత్రకు శ్రీకారం చుట్టానని కుమారస్వామి గుర్తు చేశారు. యాత్రల్లో హంగామా కంటే ఆ యాత్రల ఉద్దేశాన్ని ప్రజలకు అందించటం ముఖ్యం. ఈ సందేశాన్ని పంచరత్న రథయాత్రతో చేస్తామని జేడీఎస్ ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
‘ఉబర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్