పరేశ్ మెస్తా కలకలం
భాజపా గెల్చిన ప్రతి నియోజకవర్గంలోనూ పరేశ్ మెస్తా వంటి అమాయకుల రక్తం చిందిన దాఖలాలు ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్వీట్ చేయడం రాజకీయ కలకలం రేపింది.
సిద్ధు ట్వీట్తో మాటల యుద్ధం
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : భాజపా గెల్చిన ప్రతి నియోజకవర్గంలోనూ పరేశ్ మెస్తా వంటి అమాయకుల రక్తం చిందిన దాఖలాలు ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్వీట్ చేయడం రాజకీయ కలకలం రేపింది. ‘మీరు అనుభవిస్తున్న అధికారపు కుర్చీకి మెస్తా వంటి వ్యక్తుల రక్తం మరకలు అంటుకుని ఉన్నాయి’ అని బాజపా కర్ణాటక ఖాతాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మెస్తా కేసులో సీబీఐ అధికారులు బీ- రిపోర్టు దాఖలు చేయడం పట్ల సిద్ధు ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. హొన్నావరకు చెందిన మెస్తా హత్యకు గురయ్యారని పోలీసులు కేసు నమోదు చేసుకోగా.. అది హత్య కాదు హఠాన్మరణం అని సీబీఐ నివేదిక ఇవ్వడం దురదృష్టకరమని సిద్ధు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మెస్తా మరణిస్తే దానికి కాషాయ రంగును పులిమి భాజపా నాయకులు తీర ప్రాంత జిల్లాల్లో విధ్వంసాన్ని సృష్టించారని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ ఆరోపించారు. అప్పటి ఘర్షణల్లో ఐజీపీ కారుపైకి రాళ్లు రువ్వారని, పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారని ఆయన గుర్తు చేశారు. ఆ రోజు తమను విమర్శించిన భాజపా నాయకులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
భాజపా ఎదురుదాడి..
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : పరేశ్ మెస్తా హత్య కేసులో సీబీఐ న్యాయస్థానానికి దాఖలు చేసిన నివేదికను తాము ఇంకా చూడలేదని భాజపా నేత, ఎమ్మెల్సీ రవికుమార్ పేర్కొన్నారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ హత్యకు సంబంధించిన అన్ని ఆధారాలను ఆ పార్టీ నాయకులు నాశనం చేశారని ఆరోపించారు. ఈ విషయంలో భాజపా క్షమాపణలు అడిగే ప్రశ్నే లేదని అన్నారు. భాజపా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 24 మంది హిందూ సంఘాల కార్యకర్తలు, పరేశ్ మెహతా, ధార్వాడ జిల్లా పంచాయతీ సభ్యుడు యోగీశ్ గౌడ తదితరుల హత్యలు జరిగాయని గుర్తు చేశారు. జిల్లాధికారి డి.కె.రవి అనుమానాస్పద మృతి, డీవైఎస్పీ గణపతి ఆత్మహత్య కేసు, అరకావతి కుంభకోణంలో క్లీన్ చిట్ ఇప్పించుకున్న ఆరోపణలు సిద్ధరామయ్యపై ఉన్నాయని ఆరోపించారు. యడియూరప్ప, అశోక్, శోభాకరంద్లాజె తదితరులు టిప్పు ఖడ్గాన్ని పట్టుకుని ఉన్న చిత్రాలను కాంగ్రెస్ పార్టీ నేతలు విడుదల చేయడం వెనుక కుట్ర ఉందన్నారు. భాజపాను మైనార్టీలకు వ్యతిరేకులుగా సృష్టించడం తగదన్నారు. సిద్ధరామయ్య టిప్పు టోపీ పెట్టించుకుంటారని, కాషాయ కండువా వేస్తే ఎందుకు తిరస్కరిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామనగరలో శివశక్తి ప్రదర్శన
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ఘట్టం గురువారం ప్రారంభమైన నేపథ్యంలో శక్తి ప్రదర్శనకు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రామనగర పట్టణాన్ని వేదికగా మలుచుకున్నారు. కాంగ్రెస్ తరఫున బెంగళూరు గ్రామీణ అభ్యర్థిగా సోదరుడు డీకే సురేశ్ -
పేలుడు కేసులో నిందితుడి అరెస్టు
[ 29-03-2024]
బ్రూక్ఫీల్డ్ పరిధి రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు నిందితుడు ముజామిల్ షరీఫ్ను అరెస్టు చేశామని జాతీయ తనిఖీ దళం గురువారం రాత్రి ప్రకటించింది. -
గెలిచాకే మోదీని కలుస్తా: ఈశ్వరప్ప
[ 29-03-2024]
శివమొగ్గ లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప తన సొంత కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. -
నాకు ప్రాణాపాయం
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల వేళ తనను అంతం చేసేందుకు కొందరు భాజపా నాయకులు కంకణం కట్టుకున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. -
ఐదుగురు కుమార్తెలతో తల్లి ఆత్మహత్యాయత్నం
[ 29-03-2024]
భర్త గోపాల్ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. -
యాప్ల తోడుగా ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా!
[ 29-03-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను సజావుగా, సులువుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక యాప్లను సిద్ధం చేసింది. ఈ యాప్లు ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా తెలిపారు. -
కఠోర శ్రమతో సులువుగా లక్ష్య సాధన
[ 29-03-2024]
నవోదయ రీగెల్-24 వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గురువారం రాత్రి నవోదయ స్టేడియంలో మూడు రోజుల కార్యక్రమాలను రాయచూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ హనుమంతప్ప జ్యోతి వెలిగించి ప్రారంభించారు. -
ప్రగతిని తుంగలో తొక్కిన భాజపా
[ 29-03-2024]
బెంగళూరు గ్రామీణ లోక్సభ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి హస్తినలో మీ స్వరాన్ని వినిపించేందుకు డీకే సురేశ్ను మరోసారి గెలిపించాలని ప్రజలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. ఇక్కడి ప్రజల సమస్యలకు మొదటి నుంచి ఆయన స్పందిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. -
మరింత పడిపోయిన విద్యుదుత్పాదన
[ 29-03-2024]
రాష్ట్రంలోని శాఖోత్పన్న విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పాదన సగానికి పతనమైంది. గురువారం సాయంత్రం 4.24 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం. -
లాడ్జిలో దంపతుల ఆత్మహత్య
[ 29-03-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!