పండగ సంబరాలు ఊరంతా తోరణాలు!
కరోనా కష్టాలు కరిగిపోవడంతో.. రెండేళ్ల తర్వాత నగర ప్రజలు దసరా పండుగను ఘనంగా ఆచరించేందుకు సిద్ధమయ్యారు.
పూల విపణిలో ఎప్పటిలానే రద్దీ
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : కరోనా కష్టాలు కరిగిపోవడంతో.. రెండేళ్ల తర్వాత నగర ప్రజలు దసరా పండుగను ఘనంగా ఆచరించేందుకు సిద్ధమయ్యారు. పరిశ్రమలు, కంపెనీల్లో మంగళవారం ఉదయమే పూజలు నిర్వహించి, ఉద్యోగులకు బోనస్లు ఇచ్చారు. గుమ్మడికాయ కొట్టి తమ సంస్థలకు సెలవు ప్రకటించారు. మల్లేశ్వరం, యశ్వంతపుర, సిటీ మార్కెట్లలో మధ్యాహ్నం వరకు పూలు, పండ్లు, తోరణాలు, అరటిఆకులు, బొరుగుల కొనుగోళ్లు కొనసాగాయి. మధ్యాహ్నం తర్వాత రహదారులు ఖాళీగా కనిపించాయి. ఇళ్ల వద్ద తమ వాహనాలను శుభ్రం చేసుకున్న వాహనదారులు, వాటికి పూజలు చేసుకున్నారు. నగరానికి చుట్టుపక్కల ఉంటున్న వారిలో ఎక్కువ మంది మంగళవారం ఉదయమే తమ వాహనాల్లో తరలి వెళ్లారు. దూర ప్రాంతాల ప్రజలు సోమవారం సాయంత్రమే వెళ్లారు. లెక్కకు మించిన పర్యాటకులతో విధానసౌధ, కబ్బన్ ఉద్యానం, లాల్బాగ్ కిటికిటలాడాయి.
వాహనాలకు పూజ..
బెంగళూరు (సదాశివనగర), న్యూస్టుడే : ఆయుధ పూజను పురస్కరించుకుని కనకపురలోని డీకేఎస్ ఛారిటబుల్ ట్రస్టు కార్యాలయంలో వాహనాలకు పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ పూజచేశారు. కావేరి నివాసంలో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తన కుటుంబ సభ్యులతో కలిసి వాహన పూజలు పాల్గొన్నారు. దసరా పండుగను పురస్కరించుకుని గవర్నర్ థావర్చంద్ గహ్లోత్, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, జనతాదళ్ రాష్ట్రాధ్యక్షుడు సి.ఎం.ఇబ్రహీం తదితరులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం జాతీయ పార్టీని ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు మద్దతుగా కొందరు ఎమ్మెల్యేలతో కలిసి కుమారస్వామి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు. జంబూ సవారీలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి బొమ్మై హెచ్ఏఎల్ విమానాశ్రయం నుంచి రాచనగరికి మంగళవారం సాయంత్రం బయలుదేరారు.
వాహనాలకు పూజ చేస్తున్న డి.కె.శివకుమార్
కుటుంబ సభ్యులతో కలిసి వాహన పూజలో యడియూరప్ప
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోలారు బాటలో కల్లోలం
[ 28-03-2024]
రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. అనూహ్యంగా ఎదురైన ఆ ఘట్టం అధికార కాంగ్రెస్ పార్టీని కుదిపేసింది. ఇలాంటి వ్యవహారమే మునుపు.. 2019 జులై 5వ తేదీన తలెత్తింది. -
చిత్రదుర్గ బరిలో కారజోళ!
[ 28-03-2024]
రాష్ట్రం నుంచి లోక్సభకు పోటీ చేసే పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితాను భాజపా వెల్లడించింది. -
అక్రమార్కుల నివాసాలపై దాడులు
[ 28-03-2024]
ఆదాయంతో పొంతన లేని ఆర్జన కలిగి ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల నివాసాలు, కార్యాలయాలపై లోకాయుక్త అధికారులు బుధవారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. -
వికసిత భారత్ సాధనే లక్ష్యం
[ 28-03-2024]
దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి గద్దెనెక్కాలని కోరుకుంటున్నారని భాజపా రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర పేరొన్నారు. -
హృదయం లేని మోదీ
[ 28-03-2024]
కర్ణాటకలో ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంటామన్న భయంతోనే భాజపా- జనతాదళ్ పొత్తు కుదుర్చుకున్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. -
ఉత్కంఠంగా విద్యావర్ధక సంఘం ఎన్నికలు
[ 28-03-2024]
వీరశైవ విద్యావర్ధక సంఘం నూతన అధ్యక్షుడిగా అల్లం గురుబసవరాజ్, కార్యదర్శిగా అరవింద్ పాటీల్లు నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికయ్యారు. -
అక్రమ తరలింపులపై దాడులు
[ 28-03-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికల నియమావళి ప్రవర్తన ఉల్లంఘించి అక్రమంగా మద్యం నిల్వ చేసిన ఇంటిపై, రవాణా చేస్తున్న వారి నుంచి రూ.3.52 లక్షలు విలువ చేసే 842.72 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా తెలిపారు. -
తిప్పేరుద్రస్వామి తిరునాలకు పోటెత్తిన భక్తులు
[ 28-03-2024]
రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన నాయకనహట్టి తిప్పేరుద్రస్వామి తిరునాళ్లకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించారు. -
ఎన్ఐఏ విస్తృత దాడులు
[ 28-03-2024]
రాజధాని నగరంలోని బ్రూక్ఫీల్డ్ రామేశ్వరం కేఫ్లో పేలుడు దర్యాప్తులో భాగంగా శివమొగ్గ, బెంగళూరు, తీర్థహళ్లి, హుబ్బళ్లి, చెన్నైలలో బుధవారం ఏకకాలంలో జాతీయ దర్యాప్తు దళం (ఎన్ఐఏ) అధికారులు దాడులు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?