నూతన ఎస్పీ బాధ్యతల స్వీకరణ
జిల్లా నూతన పోలీస్ అధికారిగా రంజిత్కుమార్ బండారు మంగళవారం బదిలీ అయిన ఎస్పీ సైదులు అడావత్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. కొత్త ఎస్పీని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.
సైదులు అడావత్ నుంచి బాధ్యతలు స్వీకరిస్తున్న రంజిత్కుమార్ బండారు
బళ్లారి, న్యూస్టుడే: జిల్లా నూతన పోలీస్ అధికారిగా రంజిత్కుమార్ బండారు మంగళవారం బదిలీ అయిన ఎస్పీ సైదులు అడావత్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. కొత్త ఎస్పీని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆయన మంగళవారం ఉదయం బెంగళూరు నుంచి బళ్లారికి చేరుకున్నారు. తొలుత దుర్గమ్మను దర్శనం చేసుకొని ఎస్పీ కార్యాలయానికి చేరుకొని బాధ్యతలు స్వీకరించారు. రంజిత్కుమార్ బండారు తెలంగాణ రాష్ట్రం వరంగల్లు జిల్లాకు చెందిన వారు. అక్కడే ప్రాథమిక విద్య పూర్తి చేసి, 2008లో కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరారు. నాలుగేళ్ల పాటు ఉద్యోగం చేశారు. ప్రారంభం నుంచి సివిల్ సర్వీసులో చేరాలని పట్టుదలగా ఉండేది. 2013 మొదటి సారి సివిల్స్ పరీక్షలు రాశారు. అనంతరం 2014లో సివిల్స్ శిక్షణ కోసం దిల్లీకి వెళ్లారు. 2017లో సివిల్స్లో అఖిల భారత స్థాయిలో 555వ ర్యాంకు సాధించారు. కర్ణాటక ఐపీఎస్ కేటగిరిలో చేరారు. రాష్ట్రంలో పలు జిల్లాలో శిక్షణ పూర్తి చేశారు. మంగళూరు జిల్లా ఏసీపీగా విధులు నిర్వర్తించారు. అక్కడి నుంచి బెంగళూరు సెంటర్ ఫర్ కౌంటర్ టెర్రిరిజం ఇంటర్నల్ సెక్యూరిటీ విభాగంలో ఏసీపీగా పనిచేశారు. ప్రభుత్వం ఆయనను పదోన్నతిపై బళ్లారి ఎస్పీగా నియమించింది. ఈ సందర్భంగా ఏఎస్పీ నటరాజ్, నగర డీఎస్పీ శేఖరప్ప డీఎస్పీలు సత్యనారాయణరావు, కాశీగౌడ, మల్లేశ్ దొడ్డమని తదితర పోలీస్ అధికారులు కొత్త ఎస్పీకి ఘన స్వాగతం పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
‘ఉబర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ