Karnataka: మేకలు.. గొర్రెలు.. కోళ్లు.. వీటి ధరలు వింటే గుండెల‘ధర’పోతాయ్!
మేకలు, గొర్రెలు, కోళ్లు ధరలు వింటే హడలిపోవాల్సిందే. డార్ఫర్ గొర్రె ధర రూ.6 లక్షలు, జమునాపారి మేక ధర రూ.5లక్షలు, డుంబ గొర్రె ధర రూ.2 లక్షలు, డాంగ్ తావ్ కోడిధర రూ.30వేలు, నల్లకోడి ధర రూ.వెయ్యి పలుకుతున్నాయి.
రూ.6లక్షల డార్ఫర్ గొర్రెలు
రూ.5లక్షలు ధర పలికె జమునాపారి మేక
రూ.2లక్షలు ధర పలికే డుంబ గొర్రెలు
నలుపు రంగు కలిగిన కడక్నాథ్ కోడి
బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్టుడే: మేకలు, గొర్రెలు, కోళ్లు ధరలు వింటే హడలిపోవాల్సిందే. డార్ఫర్ గొర్రె ధర రూ.6 లక్షలు, జమునాపారి మేక ధర రూ.5లక్షలు, డుంబ గొర్రె ధర రూ.2 లక్షలు, డాంగ్ తావ్ కోడిధర రూ.30వేలు, నల్లకోడి ధర రూ.వెయ్యి పలుకుతున్నాయి. ఇక వాటి కిలో మాంసం ధర రూ.3వేల పైమాటే. అధిక ధరలు పలుకుతున్న గొర్రెలు, మేకలు, కోళ్లను తిలకించాలంటే ఓసారి నగరంలోని జీకేవీకే ఆవరణలో జరుగుతున్న కృషి మేళా-2022 సందర్శించాల్సిందే. చర్మవ్యాధి వ్యాపించడంతో ఈసారి ప్రదర్శనలో పశువులకు నిర్వాహకులు అవకాశం కల్పించలేదు. గొర్రెలు, మేకలు, కోళ్లు, చేపలు, బాతులకు అవకాశం కల్పించారు. దక్షిణ ఆఫ్రికాకు చెందిన డార్ఫర్ గొర్రె రూ.ఆరులక్షల ధర పలుకుతోంది. 1930లో డార్ఫర్ హన్స్, నల్లతల పర్షియన్ గొర్రె సంకర జాతితో డార్ఫర్ను సృష్టించారు. దాన్ని యలహంక సమీపంలోని మారేనహళ్లి ఫారంలో పెంచుతున్నారు. తల నల్లగా మిగతా భాగం తెల్లగా ఎక్కువ బొచ్చుతో ఉంటుందని, విదేశీదైన స్వదేశీ వాతావరణానికి అనుగుణంగా జీవిస్తుందని ఫారం నిర్వాహకుడు సతీశ్ తెలిపారు. మూడు,నాలుగు నెలల్లో 40 నుంచి 60 కిలోల బరువు కలిగి ఉంటుందని తెలియజేశారు. మాంసం కన్నా సంతానాభివృద్ధికి ఆ గొర్రెను ఎక్కువగా ఉపయోగిస్తామని చెప్పారు. జమునాపారి మేక అన్ని వాతావరణాలకు తట్టుకుంటుంది. మూడు నెలలకు 35 నుంచి 45 కిలోల బరువు కలిగి ఉంటుంది. ఆడమేక రోజు రెండు నుంచి మూడు లీటర్ల పాలు ఇస్తుందని నిర్వాహకులు తెలిపారు.
* సన్నటి తల, పెద్దకాళ్లతో కూడిన ఆరుకిలోల బరువు కలిగిన డాంగ్తావ్ (డ్రాగన్ బర్డ్) కోడి ధర రూ.30వేలు, జత రూ.65వేలు పలుకుతోంది. వియత్నాంకు చెందిన డాంగ తావ్ కోళ్లను చేతన్ హ్యచరీస్ నిర్వాహకుడు చేతన్ తెలిపారు. వ్యాపారాన్ని రైతులు దృష్టిలో పెట్టుకుని గిరిరాజ, కావేరి, ఆసీల్ క్రాస్, కాలింగ్బ్రౌన్, తదితర రకాల కోళ్లను సాగుతున్నారు. ఇప్పుడు విధానం మారింది. అలంకారం కోసం కాకుండా వ్యాపారం దృష్టిలో పెంచాలని తెలియజేశారు.
* నలుపు రంగు కలిగిన కడక్ నాథ్ కోడి వ్యాధుల నియంత్రణకు రామబాణంగా మారింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో ఆదివాసీలు ఆ కోళ్లను పెంచుతునారు. అవి కనుమరుగు కాకుండా వివిధ సంస్థలు అభివృద్ధి చేస్తున్నాయి. మాంసం, రక్తం నల్లగా ఉంటుంది. ఆ మాంసాన్ని భుజిస్తే పక్షవాతం, మధుమేహం, అస్తమా, తదితర వ్యాధులు నియంత్రణలోకి వస్తాయని ఆ కోళ్ల పెంపకందారుడు విజయకుమార్ తెలిపారు. ఆ కోడి గుడ్లకు మంచి డిమాండ్ ఉన్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
బర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.