అక్రమాల చిలుమె వదిలిస్తాం
గోప్యంగా ఉండాల్సిన ఓటర్ల సమాచారం చోరీ కావడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై విచారం వ్యక్తం చేశారు. చిలుమె సంస్థ అక్రమాలపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిందని తెలిపారు.
అంబేడ్కర్ విగ్రహంపై గులాబీ రేకులు చల్లుతున్న బొమ్మై
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : గోప్యంగా ఉండాల్సిన ఓటర్ల సమాచారం చోరీ కావడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై విచారం వ్యక్తం చేశారు. చిలుమె సంస్థ అక్రమాలపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిందని తెలిపారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విధానసౌధ ఆవరణలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం వద్ద స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరి, ఎమ్మెల్సీ ఛలవాది నారాయణ స్వామి తదితరులతో కలిసి శనివారం నివాళి అర్పించి విలేకరులతో మాట్లాడారు. సంస్థలు, అధికారులు తప్పు చేస్తే శిక్ష విధించే దిశలోనే ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశిస్తుందని చెప్పారు. ఓటరు సమాచారం చౌర్యానికి సంబంధించిన కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్టు చేశారని గుర్తు చేశారు. తొలగించిన పేర్ల వివరాలను ఎన్నికల కమిషన్ పరిశీలించి, తప్పును సరి చేస్తుందని వివరించారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కరోనా మహమ్మారి సమయంలో మరణించిన, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన, రెండు చోట్ల ఓటరు కార్డులు ఉన్న వారి పేర్లను ఎన్నికల కమిషన్ తొలగిస్తుందని చెప్పారు. బెళగావిలో శీతాకాల సమావేశాలను నిర్వహించే సమయంలో కిత్తూరు రాణి చెన్నమ్మ, సంగొళ్లి రాయణ్ణ విగ్రహాల ఏర్పాటుకు భూమి పూజ చేస్తామని వెల్లడించారు. వెనుకబడిన వర్గాల శాశ్వత కమిషన్ ఇచ్చిన నివేదిక అందిన వెంటనే నిపుణులతో పరిశీలించి సిఫార్సులను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రతిజ్ఞా విధి చదువుతున్న ముఖ్యమంత్రి బొమ్మై, స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరి తదితరులు
* అన్ని గ్రామ పంచాయతీలలోని గ్రంథాలయాల్లో రాజ్యాంగ ప్రతిని ఉంచాలని అధికారులకు సూచనలు ఇచ్చానని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఒంటబట్టించుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ తమ ధర్మగ్రంథంగా భావించాలని సూచించారు. అధికార వికేంద్రీకరణను మరింత విస్తరణ కావలసిన అవసరం ఉందన్నారు. ఏకరూప పౌరస్మృతి జారీ చేయాలన్నది భాజపా ఎన్నికల ప్రణాళికలో కీలక అంశమని గుర్తు చేశారు. దీన్ని జారీ చేసేందుకు పలు రాష్ట్రాల్లో సమితులు ఏర్పాటయ్యాయని తెలిపారు. అదే దిశలో కర్ణాటకలోనూ ఏకరూప పౌరస్మృతి జారీకి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
* రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విధానసౌధ సభామందిరంలో ఉద్యోగులు, సిబ్బందికి ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రతిజ్ఞా విధిని బోధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
‘ఉబర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి