logo

మహారాష్ట్రలో బస్సులపై దాడి

మహారాష్ట్రతో సరిహద్దు వివాదం మరింత తీవ్రమవుతోంది. ఆకతాయిలు కేఎస్‌ఆర్టీసీ బస్సులపై దాడులు కొనసాగించారు.

Published : 27 Nov 2022 01:38 IST

‘మహా’ పరిధిలో కర్ణాటక బస్సులకు మరకలు

బెళగావి, న్యూస్‌టుడే : మహారాష్ట్రతో సరిహద్దు వివాదం మరింత తీవ్రమవుతోంది. ఆకతాయిలు కేఎస్‌ఆర్టీసీ బస్సులపై దాడులు కొనసాగించారు. పుణె- అథణి మార్గంలో ప్రయాణిస్తున్న ఒక బస్సుపై దుండగులు రాళ్లు రువ్వడంతో అద్దాలు పగిలిపోయాయి. డ్రైవరు గొంతు భాగంలో గాజు ముక్క గుచ్చుకుని గాయపడ్డారు. కొన్ని డిపోల్లో నిలిపిన బస్సులు పాక్షికంగా ధ్వంసమయ్యాయని అధికారులు గుర్తించారు. మీరజ్‌ మార్గంలో ప్రయాణించే ఆర్టీసీ బస్సులను పూర్తిగా నిలిపి వేశామని రవాణా శాఖ అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని