అంతర్జాలంలో రెక్కల చప్పుడు
చీకటిని చీల్చుకుంటూ భానుడి లేలేత కిరణాలు తాకుతుంటే.. పక్షుల కిలకిలరావాలు మేల్కొలుపుతుంటే ఆ అహ్లాదాన్ని వర్ణించడం కష్టమే.
కొనుగోలు చేయాలనుకునే వారికోసం.. పక్షులు సిద్ధం
మారతహళ్లి, న్యూస్టుడే : చీకటిని చీల్చుకుంటూ భానుడి లేలేత కిరణాలు తాకుతుంటే.. పక్షుల కిలకిలరావాలు మేల్కొలుపుతుంటే ఆ అహ్లాదాన్ని వర్ణించడం కష్టమే. యాంత్రికమైపోతున్న నగర జీవన విధానంలో ఆ ప్రాకృతిక అనుభూతిని ఆస్వాదించడం కష్టతరమే. ఉద్యాననగరిలో మాత్రం కొందరు పక్షి ప్రేమికులు ఆ అనుభూతిని పొందేందుకు పక్షులకు చేరువవుతున్నారు. వీటికోసం ప్రత్యేక ఫేస్బుక్ గ్రూప్ను నిర్వహిస్తున్నారు. ఇందులో పక్షులను పెంచుకునేందుకు అవసరమైన సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నారు. మనకు నచ్చిన పక్షులను పొందే అవకాశం ఇక్కడ లభిస్తోంది.
* చూడ చక్కనైన చిలుకలు, పిచ్చుకలు, రంగు రంగుల విదేశీ పక్షులు.. వాటి కిలకిల రావాలను వింటూ... వాటితో గడపడానికి చాలా మంది ఇష్ట పడుతుంటారు. ఉరకలు పరుగుల జీవితాల మధ్య పక్షులతో కొంత సమయం గడుపుతూ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేవారు అనేకం. ఇలాంటి పక్షి ప్రేమికులంతా ‘బర్డ్ లవర్ బెంగళూరు’ అనే ఫేస్బుక్ పేజ్ ద్వారా ఓ బృందంగా ఏర్పడ్డారు. 17 వేల మందికి పైగా ఉన్న పేజ్ ద్వారా పక్షులను ఆరోగ్యంగా పెంచేందుకు అవసరమైన సమాచారాన్ని పంచుకుంటారు. రెక్కల జీవుల సంరక్షణ ఆసక్తి ఉంటే వారికి కావాల్సిన పక్షులను ఈ గ్రూప్ ద్వారా వచ్చే సమాచారంతో సులభంగా పొందవచ్చు. అవసరమయ్యే పంజరాలూ ఇందులో వచ్చే పోస్టుల ఆధారంగా పొందడానికి ఏర్పాట్లున్నాయి. దుకాణాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా వారి అభిరుచికి తగ్గట్టుగా కొనుగోలు చేసుకునే సౌకర్యం కలుగుతోంది. పక్షులను ఆరోగ్యంగా పెంచేందుకు ధాన్యం ఎంతో అవసరం. ఏ రకమైన పక్షులు ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతాయో తెలుసుకుని వాటి మేతను కొనుగోలు చేసుకునేలా బర్డ్ లవర్ బెంగళూరు గ్రూప్ ఉపయోగపడుతోంది. ఎనిమిదేళ్లగా నిర్వహిస్తున్న ఈ పేజ్ ద్వారా వారు పెంచుకునే పక్షుల వీడియోలనూ పంచుకుంటున్నారు. పెంపకానికి ఉపయోగించే వస్తువులను వ్యాపారం చేసే వారికీ ఈ ఫేస్బుక్ పేజ్ ఉపయుక్తంగా ఉంటోంది. ఇందులో వారి వ్యాపార వస్తువులను పోస్ట్ చేస్తూ జీవనోపాది పొందుతున్నారు.
ప్రాణిదయకు చక్కని స్పందన
మినియేచర్ విభాగంలో విజేతగా నిలిచి, ప్రమాణ పత్రాన్ని అందుకున్న జాగిలంతో విద్యార్థి
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : పెంపుడు జంతువుల పట్ల కరుణ చూపించడాన్ని ప్రోత్సహించేందుకు యాక్షన్, కంప్యాషన్ అండ్ సర్వీస్ ఫర్ యానిమల్స్, సీఎంఆర్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా బాగలూరులో ‘ఆరోహణ్’ పేరిట ఆదివారం సంయుక్తంగా నిర్వహించిన పెట్ ర్యాంప్ వాక్, మారథాన్కు చక్కని స్పందన లభించింది. మారథాన్, పెట్ ర్యాంప్ వాక్లలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు 1400 మంది పాల్గొన్నారు. ప్రదర్శనలో పిల్లులు, జాగిలాలు, పక్షులతో పాటు ప్రాణిదయా సంఘం నిర్వహణలో ఉన్న తాబేలు, ఇతర ప్రాణులను కూడా తీసుకు వచ్చారు. భారతదేశంలో ఏటా 9.1 మిలియన్ పిల్లులు, 62 మిలియన్ల జాగిలాలు వీధుల పాలవుతున్నాయని సంస్థ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు కె.సి.రామమూర్తి విచారం వ్యక్తం చేశారు. ప్రాణుల పట్ల దయ కలిగి ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఏటా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన పెంపుడు జంతువుల యజమానులకు ప్రమాణపత్రాలు అందించారు.
చలువ కళ్లద్దాలలో బుల్లి పిల్లి
కబ్బన్లో జాగిలాల జోష్
పుడిల్ జాతి జాగిలంతో యువతి
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : జాగిలాలను ఇష్టపడి పెంచుకుంటున్న వారి కోసం కబ్బన్ ఉద్యానవనంలో ఆదివారం నిర్వహించిన ప్రదర్శనకు చక్కని స్పందన లభించింది. దేశీయ, విదేశీ జాగిలాలతో వాటి యజమానులు హల్చల్ చేశారు. జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, అమెరికా తదితర దేశాలకు చెందిన జాతి జాగిలాలతో పాటు రాజపాళెం, ముధోళ్ తదితర స్థానిక జాతుల గ్రామసింహాలను కొందరు ప్రదర్శనకు తీసుకువచ్చారు. పెంపుడు జంతువులను దత్తత తీసుకోవడాన్ని ప్రోత్సహించే దిశలో నిర్వహించిన ప్రదర్శన విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోలారు బాటలో కల్లోలం
[ 28-03-2024]
రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. అనూహ్యంగా ఎదురైన ఆ ఘట్టం అధికార కాంగ్రెస్ పార్టీని కుదిపేసింది. ఇలాంటి వ్యవహారమే మునుపు.. 2019 జులై 5వ తేదీన తలెత్తింది. -
చిత్రదుర్గ బరిలో కారజోళ!
[ 28-03-2024]
రాష్ట్రం నుంచి లోక్సభకు పోటీ చేసే పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితాను భాజపా వెల్లడించింది. -
అక్రమార్కుల నివాసాలపై దాడులు
[ 28-03-2024]
ఆదాయంతో పొంతన లేని ఆర్జన కలిగి ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల నివాసాలు, కార్యాలయాలపై లోకాయుక్త అధికారులు బుధవారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. -
వికసిత భారత్ సాధనే లక్ష్యం
[ 28-03-2024]
దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి గద్దెనెక్కాలని కోరుకుంటున్నారని భాజపా రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర పేరొన్నారు. -
హృదయం లేని మోదీ
[ 28-03-2024]
కర్ణాటకలో ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంటామన్న భయంతోనే భాజపా- జనతాదళ్ పొత్తు కుదుర్చుకున్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. -
ఉత్కంఠంగా విద్యావర్ధక సంఘం ఎన్నికలు
[ 28-03-2024]
వీరశైవ విద్యావర్ధక సంఘం నూతన అధ్యక్షుడిగా అల్లం గురుబసవరాజ్, కార్యదర్శిగా అరవింద్ పాటీల్లు నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికయ్యారు. -
అక్రమ తరలింపులపై దాడులు
[ 28-03-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికల నియమావళి ప్రవర్తన ఉల్లంఘించి అక్రమంగా మద్యం నిల్వ చేసిన ఇంటిపై, రవాణా చేస్తున్న వారి నుంచి రూ.3.52 లక్షలు విలువ చేసే 842.72 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా తెలిపారు. -
తిప్పేరుద్రస్వామి తిరునాలకు పోటెత్తిన భక్తులు
[ 28-03-2024]
రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన నాయకనహట్టి తిప్పేరుద్రస్వామి తిరునాళ్లకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించారు. -
ఎన్ఐఏ విస్తృత దాడులు
[ 28-03-2024]
రాజధాని నగరంలోని బ్రూక్ఫీల్డ్ రామేశ్వరం కేఫ్లో పేలుడు దర్యాప్తులో భాగంగా శివమొగ్గ, బెంగళూరు, తీర్థహళ్లి, హుబ్బళ్లి, చెన్నైలలో బుధవారం ఏకకాలంలో జాతీయ దర్యాప్తు దళం (ఎన్ఐఏ) అధికారులు దాడులు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా