లారీ ఢీ.. ముగ్గురు దుర్మరణం
హొసదుర్గం తాలూకా కైనదు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. శనివారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు
ప్రారంభం నుంచి ఆయన ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.
చెళ్లకెరె(చిత్రదుర్గం),న్యూస్టుడే: హొసదుర్గం తాలూకా కైనదు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. శనివారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు కైనదు గ్రామానికి చెందిన రవికుమార్ (29), గిరీశ్ (23), ఉజ్జీరప్ప (59)గా గుర్తించారు. హొసదుర్గం నుంచి వీరు ముగ్గురూ ఒకే ద్విచక్ర వాహనంపై కైనదు గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ప్రమాదం అనంతరం లారీ చోదకుడు వాహనాన్ని ఆపకుండా వెళ్లాడు. అప్రమత్తమైన స్థానికులు ముందున్న గ్రామంలోని స్నేహితులకు సమాచారం అందించగా వారు సోమసంద్రం వద్ద లారీ అడ్డుకుని, చోదకుడిని పోలీసులకు అప్పగించారు. శ్రీరాంపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ద్విచక్రవాహనదారుడు..
హొసపేటె, న్యూస్టుడే: లారీ ఢీకొన్న ఘటనలో ద్విచక్రవాహన చోదకుడు రామమూర్తి(46) ప్రమాద స్థలంలోనే మృతిచెందాడు. ఈ సంఘటన శనివారం రాత్రి కొట్టూరు తాలూకా కందగల్లువద్ద చోటు చేసుకుంది. అదే తాలూకా హారాళువాసి రామమూర్తి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై స్వస్థలం వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. తీవ్ర గాయాలైన అతను అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదానికి కారణమైన లారీ చోదకుడు కలబురగి జిల్లా కొండగూళి వాసి విశ్వనాథ్ను పోలీసులు అదుపులో తీసుకున్నారు.
ట్రాక్టర్ బోల్తా పడి మహిళ..
గంగావతి, న్యూస్టుడే: రహదారి పక్కన నడచుకుంటూ వెళ్తున్న మహిళపై ట్రాక్టర్ బోల్తాపడి మృతి చెందిన సంఘటన గంగావతి పట్టణంలోని కిత్తూరు చెన్నమ్మ కూడలిలో జరిగింది. లింగరాజుక్యాంపునకు చెందిన ముంతాజ్బేగం(36) ఓ హోటల్లో పని చేస్తుండేది. శనివారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి నడకమార్గంలో వెళుతుండగా చెరకు లోడు ట్రాక్టర్ ఆమెపై బోల్తా పడింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ప్రమాదంలో వర్సిటీ ఆచార్యుడు మృతి
ఆచార్య వాసుదేవన్ (దాచిన చిత్రం)
హొసపేటె, న్యూస్టుడే: దావణగెరె జిల్లా జగళూరువద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హంపీ కన్నడ వర్సిటీ సాంఘిక శాస్త్ర విభాగం ఆచార్య సి.ఎస్.వాసుదేవన్ దుర్మరణం చెందారు. కారులో ఉన్న ఆయన కుమారుడు డాక్టర్ శ్రేయస్, మరో ఇద్దరు విద్యార్థినులు నిర్మల, రాజేశ్వరి తీవ్రంగా గాయపడ్డారు. హొరనాడులో జరిగిన చరిత్ర అకాడమీ కార్యక్రమాన్ని ముగించుకుని కారులో తిరిగి హంపీ వర్సిటీ వస్తూ ఆగివున్న లారీని ఢీకొనడంతో దుర్ఘటన జరిగింది. ఆచార్య వాసుదేవన్ కారు నడుపుతున్నారు. ఆయన మృతికి వర్సిటీ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఎన్నో కన్నడ రచనలను ఆయన తెలుగులోకి అనువాదం చేశారు. కన్నడ వర్సిటీలో తెలుగు భాషపై పట్టున్న అధ్యాపకుల్లో సి.ఎస్.వాసుదేవన్ ప్రముఖులు. వర్సిటీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటి హర్షికపై దాడి
[ 20-04-2024]
పులకేశినగరలో తన భర్త భువన్తో కలిసి వెళుతున్న సమయంలో కొందరు దుండగులు తమపై దాడి చేసి, తన గొలుసు దోచుకునేందుకు ప్రయత్నించారని పులకేశినగర ఠాణాలో నటి హర్షిక పుణచ్చ ఫిర్యాదు చేశారు. -
దక్షిణాదిపైనే కమలదండు గురి
[ 20-04-2024]
సీనియర్ల పోటీ మధ్య రాష్ట్ర భాజపా అధ్యక్ష పగ్గాలు దక్కించుకున్న యువ నేత బి.వై.విజయేంద్ర సారథ్యంలో తొలిసారిగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. -
ప్రేమ పేరుతో రక్తపుటేరులా?
[ 20-04-2024]
కర్ణాటకలో లవ్ జిహాద్ ఘటనలు ఎక్కువవుతున్నాయంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది. -
అగ్రనేతల గడ్డపై ఎవరిదో విజయం?
[ 20-04-2024]
బళ్లారి లోక్సభ నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, భాజపా నుంచి ఫైర్బ్రాండ్గా ప్రత్యేక గుర్తింపు పొందిన దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ బరిలో నిలిచారు. -
బెంగళూరు ఉత్తరలో ప్రధాని ప్రాభవమే శోభకు శ్రీరామరక్ష
[ 20-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ నియోజకవర్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం సందర్శించనున్న నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం మార్పులకు నోచుకుంటుందని, కమలనాథులకు విజయం చేరువవుతుందనే అంచనాలు తెరపైకి వచ్చాయి. -
కాంగ్రెస్లోకి మాలికయ్య గుత్తేదార్
[ 20-04-2024]
మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్, కుమటా మాజీ ఎమ్మెల్యే శారదా మోహన్శెట్టి తదితరులు శుక్రవారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
గదగలో నలుగురి దారుణ హత్య
[ 20-04-2024]
గదగ పట్టణంలోని చెన్నమ్మ కూడలి సమీపాన దాసర వీధిలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. -
నకిలీ పత్రాలతో నిలువుదోపిడీ
[ 20-04-2024]
ఒకే ఇంటి స్థలానికి లెక్కలేనన్ని నకిలీ పత్రాలు సిద్ధం చేసి వాటిని 22 బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.10 కోట్లకు పైగా రుణాన్ని తీసుకున్న ఆరుగురు వంచకులను బెంగళూరు జయనగర ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే