ప్రత్యర్థుల గుండెల్లో దడ
‘పంచరత్న’ యాత్ర ప్రారంభించినప్పటి నుంచి కాంగ్రెస్, భాజపా నాయకులు తనపై నోరు పారేసుకోవడం ఎక్కువైందని జనతాదళ్ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ధ్వజమెత్తారు.
కుమార బృందానికి పంపర పనస హారం
బెంగళూరు (గ్రామీణం), న్యూస్టుడే : ‘పంచరత్న’ యాత్ర ప్రారంభించినప్పటి నుంచి కాంగ్రెస్, భాజపా నాయకులు తనపై నోరు పారేసుకోవడం ఎక్కువైందని జనతాదళ్ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ధ్వజమెత్తారు. తాను అధికారంలో ఉన్నప్పుడు మండ్య జిల్లా అభివృద్ధికి రూ.9 వేల కోట్లు కేటాయించానని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మండ్య జిల్లాలో రైతులు ఎక్కువ సంఖ్యలో బలవన్మరణాలకు పాల్పడ్డారని గణాంకాలు వివరించారు. పంచరత్న రథయాత్రలో భాగంగా దేవనహళ్లిలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తన యాత్రకు ప్రజలు సునామీ తరహాలో పోటెత్తి రావడాన్ని కాంగ్రెస్, భాజపాలు జీర్ణించుకులేక పోతున్నాయని వ్యాఖ్యానించారు. మండ్యలో మైషుగర్ పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు రూ.100 కోట్లు కేటాయించినా, తర్వాత అధికారంలోకి వచ్చిన భాజపా ఆ నిధులు వినియోగించుకోవడంలో చతికిలపడిందని మంత్రి అశ్వత్థ నారాయణ తెలుసుకోవాలని సూచించారు. దేవనహళ్లి సమీపానికి వచ్చిన రథయాత్రకు స్థానికులు ద్రాక్ష, మొక్క జొన్న, పంపర పనస, పట్టు, బెంగళూరు మిరపకాయలు తదితరాలతో చేసిన హారాలను క్రేన్ సహాయంతో తీసుకు వచ్చి కుమారకు స్వాగతం పలికారు. సోమవారానికి యాత్ర ప్రారంభమై 11వ రోజుకు చేరుకుంది. దేవనహళ్లి సమీపంలోని హారోహళ్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి కుమార మధ్యాహ్న భోజనాన్ని చేశారు. ఆదివారం రాత్రి నంది గ్రామంలో విశ్రాంతి తీసుకున్న కుమారస్వామి, సోమవారం ఉదయమే భోగనందీశ్వర ఆలయంలో పూజ చేయించుకుని యాత్రను కొనసాగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ