వైభవంగా కనకదాస జయంతి
సింధనూరు తాలూకా కురుబ సమాజం ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో కనకదాస జయంతి అంగరంగ వైభవంగా జరిగింది.
తెక్కెలకోటలో ఊరేగింపులో పాల్గొన్న సమాజం సభ్యులు
సింధనూరు, న్యూస్టుడే: సింధనూరు తాలూకా కురుబ సమాజం ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో కనకదాస జయంతి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కనకదాస చిత్రపటాన్ని ఘనంగా ఊరేగించారు. మేళతాళాలు, భాజాభజంత్రీలు, కళాబృందాల ప్రదర్శనలతో పట్టణ ప్రధాన దారులు మారుమోగాయి. వందలసంఖ్యలో మహిళలు తలపై కలశాలు ధరించి ఊరేగింపులో పాల్గొన్నారు. భారీ ఊరేగింపు కారణంగా పట్టణంలో దాదాపు రెండు గంటలపాటు వాహనసంచారం గాడితప్పింది. వాసవీ కల్యాణ మంటపం నుంచి కుష్టిగి మార్గంలోని కనకదాస కల్యాణ మంటపం వరకూ ఊరేగింపు సాగింది. కురుబ సమాజం గురువులు, మస్కి ఎమ్మెల్యే ఆర్.బసనగౌడ, కపెక్ అధ్యక్షుడు కె.విరుపాక్షప్ప, మస్కి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్గౌడ, కాంగ్రెస్ నాయకులు కె.కరియప్ప, బసనగౌడ బాదర్లి, జేడీఎస్ నాయకుడు అభిషేక్ నాడగౌడ వేడుకలో పాల్గొన్నారు.
కనకదాస విగ్రహం ఎదుట కళాబృందాల ప్రదర్శన
సంకీర్తనలతో ఉత్తమ సమాజం
సిరుగుప్ప, న్యూస్టుడే: కనకదాస అందించిన సంకీర్తనలతో ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్యపడుతుందని హాలుమత సమాజం తెక్కెలకోట ప్రతినిధి నెణికెప్ప పేర్కొన్నారు. తెక్కెలకోటలో మంగళవారం కనకదాస జయంతిని చిత్రపటానికి పూల మాల వేసి ప్రారంభించారు. శ్రీ కాడసిద్దేశ్వర దేవాలయం నుంచి ప్రధాన రహదారి, కూడళ్ల మీదుగా కనకదాస కూడలి వరకు ఊరేగింపు నిర్వహించారు. ప్రతినిధులు బీరప్ప, కేశవ, అయ్యప్ప, రమేష్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న స్వామీజీలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దక్షిణాదిపైనే కమలదండు గురి
[ 20-04-2024]
సీనియర్ల పోటీ మధ్య రాష్ట్ర భాజపా అధ్యక్ష పగ్గాలు దక్కించుకున్న యువ నేత బి.వై.విజయేంద్ర సారథ్యంలో తొలిసారిగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. -
నటి హర్షికపై దాడి
[ 20-04-2024]
పులకేశినగరలో తన భర్త భువన్తో కలిసి వెళుతున్న సమయంలో కొందరు దుండగులు తమపై దాడి చేసి, తన గొలుసు దోచుకునేందుకు ప్రయత్నించారని పులకేశినగర ఠాణాలో నటి హర్షిక పుణచ్చ ఫిర్యాదు చేశారు. -
ప్రేమ పేరుతో రక్తపుటేరులా?
[ 20-04-2024]
కర్ణాటకలో లవ్ జిహాద్ ఘటనలు ఎక్కువవుతున్నాయంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది. -
అగ్రనేతల గడ్డపై ఎవరిదో విజయం?
[ 20-04-2024]
బళ్లారి లోక్సభ నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, భాజపా నుంచి ఫైర్బ్రాండ్గా ప్రత్యేక గుర్తింపు పొందిన దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ బరిలో నిలిచారు. -
ప్రధాని ప్రాభవమే శోభకు శ్రీరామరక్ష
[ 20-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ నియోజకవర్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం సందర్శించనున్న నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం మార్పులకు నోచుకుంటుందని, కమలనాథులకు విజయం చేరువవుతుందనే అంచనాలు తెరపైకి వచ్చాయి. -
కాంగ్రెస్లోకి మాలికయ్య గుత్తేదార్
[ 20-04-2024]
మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్, కుమటా మాజీ ఎమ్మెల్యే శారదా మోహన్శెట్టి తదితరులు శుక్రవారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
గదగలో నలుగురి దారుణ హత్య
[ 20-04-2024]
గదగ పట్టణంలోని చెన్నమ్మ కూడలి సమీపాన దాసర వీధిలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. -
నకిలీ పత్రాలతో నిలువుదోపిడీ
[ 20-04-2024]
ఒకే ఇంటి స్థలానికి లెక్కలేనన్ని నకిలీ పత్రాలు సిద్ధం చేసి వాటిని 22 బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.10 కోట్లకు పైగా రుణాన్ని తీసుకున్న ఆరుగురు వంచకులను బెంగళూరు జయనగర ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
ప్రజలు బెంజ్ కారు అడగట్లేదు కదా!.. ఎన్నికలపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
-
22న ఏపీ పదోతరగతి ఫలితాలు